Gold-Silver Price: గుడ్న్యూస్! బాగా తగ్గిన పసిడి ధర.. వెండి మాత్రం స్వల్పంగా.. నేడు మీ ప్రాంతంలో ధరలివీ..
విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,750 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,820గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,200గా ఉంది.
![Gold-Silver Price: గుడ్న్యూస్! బాగా తగ్గిన పసిడి ధర.. వెండి మాత్రం స్వల్పంగా.. నేడు మీ ప్రాంతంలో ధరలివీ.. Gold Silver Price Today 28 October 2021 know rates in your city Andhra Pradesh Amaravati Telangana Hyderabad Gold-Silver Price: గుడ్న్యూస్! బాగా తగ్గిన పసిడి ధర.. వెండి మాత్రం స్వల్పంగా.. నేడు మీ ప్రాంతంలో ధరలివీ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/24/7da137f3e5477bd67ccd548a76b71af6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత మార్కెట్లో బంగారం, వెండి ధరలు నేడు తగ్గాయి, పసిడి గ్రాముకు రూ.30 చొప్పున తగ్గింది. వెండి కిలోకు రూ.100 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.44,750 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,820 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.69,200గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే రూ.100 తగ్గింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,750 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,820గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,200గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,750 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,820గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.69,200 గా ఉంది.
Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.47,130గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,130గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,080 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,180గా ఉంది.
Also Read: Loan Options: మీకు అర్జెంట్గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్!
ప్లాటినం ధరలో పెరుగుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు పెరిగింది. హైదరాబాద్లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.25,310 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)