అన్వేషించండి

Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ

అదానీ గ్రూపుపై గతేడాది జనవరిలో హిండెన్ బర్గ్  రీసెర్చీ ఆరోపణలు చేయగా, ఈ ఏడాది అమెరికా కోర్టులో అధికారులకు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపైగ్రూపు చైర్మన్ అదానీ స్పందించారు.

Gautam Adani breaks silence on bribery charges in America | జైపూర్: తన వ్యాపారాలపై వచ్చిన ఆరోపణలపై భారత కుబేరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ స్పందించారు. తమపై జరుగుతున్న దాడుల వల్ల తామింక మరింత పటిష్టమవుతున్నట్లు పేర్కొన్నారు. రాజస్థాన్ లో జరిగిన 51వ అవార్డుల ప్రదానోత్సవంలో తాజాగా పాల్గొన్న ఆయన ప్రసంగించారు.

ఆరోపణలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు

రెండు వారాల కిందట అమెరికాలో తమ కంపెనీకి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీపై అరోపణలు వచ్చాయని, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదని అదానీ గుర్తు చేశారు. ఇలాంటి ఆరోపణలు ఎదురైన ప్రతీసారి తమ మరింతగా రాటుదేలుతామని, ఎదురయ్యే ప్రతి సవాళ్లను విజయ సోపానాలుగా మార్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గతనెల 20న భారత అధికారులకు అదానీ గ్రూపు దాాపు 25 కోట్ల డాలర్లను ముడుపులుగా చెల్లించిందని అమెరికా ప్రాసిక్యూటర్లు అరోపించిన సంగతితెలిసిందే. ఈ లంచాల ద్వారా సోలార్ పవర్ కు సంబంధించిన ప్రాజెక్టును అదానీ గ్రీన్ ఎనర్జీ సాధించిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను నిరాధారమైనవని అదానీ గ్రూపు కొట్టేసిన సంగతి తెలిసిందే. 
కోర్టు పరిధిలో ఉంది.

మరోవైపు అదానీ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ప్రైవేటు కంపెనీలు, కొంతమంది వ్యక్తులు, అెమెరికన్ న్యాయ శాఖకు సంబంధించిన వ్యవహారమని శుక్రవారం విదేశాంక శాఖాధికారులు పేర్కొన్నారు. చట్టప్రకారం ఈ వ్యవహారం ముందుకు సాగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

హిండెన్ బర్గ్ రీసెర్ఛ్ పైనా..
మరోవైపు గతేదాడి తమ గ్రూపును కుదిపేసిన హిండెన్ బర్గ్ రీసెర్ఛ్ నివేదికపైనా అదానీ స్పందించారు. ఈ ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా జరిగాయని, తమ కంపెనీ ప్రతిష్టను దెబ్బతీయడంతోపాటు, రాజకీయ ప్రకంపనలు రేకెత్తించాలనే ధ్యేయంతో జరిగినట్లు పేర్కొన్నారు. నిజానికి గత జనవరిలో తాము ఫాలోఆన్ పబ్లిక్ ఆఫరింగ్ కు సిద్ధమయ్యామని, ఈ దశలొ ఉద్దేశపూర్వకంగా దాడులకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి షార్ట్ సెల్లింగ్ ద్వారా దాడులకు గురయ్యామని పేర్కొన్నారు. దురద్దేశాలతోనే ఆ కంపెనీ తమపై ఆరోపణలు చేసిందని వ్యాఖ్యానించారు. 
ఏదేమైనప్పటికీ, హిండెన్ బర్గ్ ఆరోపణలద్వార తమ కంపెనీ ఆర్థికంగా ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. ఇలాంటి ఆరోపణలు ఎదురైనప్పటికీ తాము మరింత స్ట్రాంగ్ గా పనిచేశామని, ఎఫ్ పీఓ ద్వారా20 వేల కోట్ల రూపాయల నిధులు సేకరించి ఇండియాలోనే అత్యంత భారీ ఎప్ పీఓ గా నిలిచామని పేర్కొన్నారు. 

Also Read: Maharastra Politics: ముఖ్యమంత్రి పేరు ప్రకటనపై వీడని ఉత్కంఠ ? నేడు సతారా నుంచి ముంబైకి ఏక్‌నాథ్ షిండే


నిధులను సేకరిస్తున్నాం..
అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులను సేకరిస్తున్నామని, తద్వార అప్పులను తగ్గిస్తున్నామని అదానీ పేర్కొన్నారు. దీంతో తమ సంస్థల Debt to EBITDA రేషియో 2.5 రెట్ల దిగువకు వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు తమకు ఇండియాలోనే కాకుండా, విదేశాలకు చెందిన ఏ క్రెడిట్ రేటింగ్ సంస్థ తమను తక్కువ రేటింగ్ ఇవ్వలేదని పేర్కొన్నారు. మరోవైపు భారత సుప్రీంకోర్టు నుంచి కూడా తమకు అనుకూల తీర్పు వచ్చిందని గుర్తు చేశారు.  

Also Read: Fastest Developing Cities: 2033 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నగరాలలో హైదరాబాద్‌కు చోటు, సర్వేలో భారత్ డామినేషన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Embed widget