అన్వేషించండి

UPS Update: కేంద్ర ఉద్యోగులకు దసరా ధమాకా ఆఫర్‌ - కొత్త స్కీమ్‌కు కొన్ని రోజుల్లో నోటిఫికేషన్‌!

Central Government Employees: పాత పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్ స్కీమ్‌లోని అనుకూల విషయాల కలబోతగా యూపీఎస్‌ ఉంటుంది. పదవీ విరమణ తర్వాత హామీతో కూడిన పెన్షన్‌ వస్తుంది.

Unified Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ పథకం (Unified Pension Scheme - UPS) వచ్చే ఏడాది ఏప్రిల్ (01 ఏప్రిల్‌ 2025‌) నుంచి అమలవుతుంది. అయితే, దీనిని ఇంకా ముందుగానే ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో, దసరా-దీపావళి కానుకగా, 15 అక్టోబర్ 2024న ఏకీకృత పెన్షన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయవచ్చని సమాచారం. ఈ నూతన పెన్షన్ (యూపీఎస్‌) పథకం భారత ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటి. లక్షలాది మంది కేంద్ర ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా దీనిని రూపొందించారు.

ఏకీకృత పెన్షన్ పథకానికి సంబంధించి సమావేశాలు
ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్‌ ప్రకారం, నూతన పెన్షన్ పథకాన్ని సులభంగా అమలు చేయడానికి, కేంద్ర కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ ‍‌(Tv Somanathan‌) వివిధ మంత్రిత్వ శాఖలు & విభాగాలతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు, 'జాతీయ పెన్షన్ స్కీమ్‌'ను (NPS) సమీక్షించే బాధ్యతను అప్పగించిన కమిటీకి టీవీ సోమనాథన్ ఛైర్మన్‌గా ఉన్నారు. సోమనాథన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏకీకృత పెన్షన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఏకీకృత పెన్షన్ పథకం అమలు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించింది.

UPS ప్రత్యేకత ఏంటి? 
రిటైర్‌ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా స్థిరమైన మొత్తంలో పింఛను ఇవ్వడం యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ లక్ష్యం. అంటే, ఎన్‌పీఎస్‌లో లేని భరోసాను ఉద్యోగులు ఈ స్కీమ్‌లో పొందే అవకాశం ఉంది. నూతన పథకం కింద, కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణకు ముందు 12 నెలల 'ప్రాథమిక వేతనం + డీఏ' సగటు మొత్తాన్ని లెక్కేసి, అందులో సరిగ్గా సగం డబ్బును పెన్షన్‌గా ఇస్తారు. నెలనెలా స్థిరమైన మొత్తంలో పింఛను అందుతుంది. చేతిలోకి వచ్చే డబ్బు ఎంతో ముందే తెలుస్తుంది కాబట్టి, దానికి తగ్గట్లుగా విశ్రాంత ఉద్యోగులు తమ ఖర్చులను మేనేజ్‌ చేసుకోవచ్చు. 

మరో ఆసక్తికర కథనం: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌ 

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌లోనూ ఉద్యోగులు పెన్షన్ ఫండ్‌కు కాంట్రిబ్యూట్‌ చేయాలి. ఉద్యోగులు తమ 'ప్రాథమిక వేతనం + DA'లో 10 శాతాన్ని NPSలో జమ చేస్తున్నట్లుగానే, యూపీఎస్‌లోనూ పెన్షన్ ఫండ్‌కు జమ చేయాలి. ఎన్‌పీఎస్‌లో, ఉద్యోగుల పెన్షన్ ఫండ్‌కు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్‌ 14 శాతంగా ఉంటే, యూపీఎస్‌లో 18.5 శాతం జమ చేస్తుంది. అంటే, యూపీఎస్‌లో ప్రభుత్వ సహకారం పెరుగుతుంది. ఏకీకృత పెన్షన్ పథకం కింద, ప్రభుత్వ ఉద్యోగులు కనీసం 25 సంవత్సరాల సర్వీస్ తర్వాత మాత్రమే నిర్దేశిత ఫార్ములా కింద 'హామీతో కూడిన పెన్షన్' పొందేందుకు అర్హులు. ఈ కొత్త పెన్షన్ స్కీమ్ 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 24న, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం యూనిఫైడ్‌ పెన్షన్ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది.

మరో ఆసక్తికర కథనం: స్విగ్గీ నుంచి 10 నిమిషాల్లో ఫుడ్‌ డెలివెరీ, హైదరాబాద్‌లో కొత్త సర్వీస్‌ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

8th Pay Commission Updates: 8వ వేతన సంఘం లేటెస్ట్ అప్‌డేట్స్‌! అభ్యర్థనల సమర్పణ గడువు పెంపు! రెండు రోజుల్లో సభ్యుల హైదరాబాద్‌ టూర్! 
8వ వేతన సంఘం లేటెస్ట్ అప్‌డేట్స్‌! అభ్యర్థనల సమర్పణ గడువు పెంపు! రెండు రోజుల్లో సభ్యుల హైదరాబాద్‌ టూర్! 
Google Pay UPI Circle: రెండో ఫోన్‌కి బ్యాంకు అకౌంట్ అక్కర్లేదు - గూగుల్ పే యూపీఐ సర్కిల్ తో మీ ఫోనే మీ డిజిటల్ బ్యాంక్! ఫుల్ డీటైల్స్
రెండో ఫోన్‌కి బ్యాంకు అకౌంట్ అక్కర్లేదు - గూగుల్ పే యూపీఐ సర్కిల్ తో మీ ఫోనే మీ డిజిటల్ బ్యాంక్! ఫుల్ డీటైల్స్
Petrol Diesel Price Hike: చమురుపై అగ్ర దేశాలు 50 శాతం వడ్డిస్తే భారత్‌ ప్రభుత్వం రూ.3లతో సరిపెట్టింది! విమర్శించే ముందు తేడా తెలుసుకోండి!
చమురుపై అగ్ర దేశాలు 50 శాతం వడ్డిస్తే భారత్‌ ప్రభుత్వం రూ.3లతో సరిపెట్టింది! విమర్శించే ముందు తేడా తెలుసుకోండి!
Petrol Diesel Price Hike: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS PBKS Result Update: ఆర్సీబీ ధ‌మాకా.. ప్లే ఆఫ్స్ చేరిన తొలి జ‌ట్టుగా రికార్డు.. పంజాబ్ పై ఘ‌న‌విజ‌యం.. రాణించిన శ‌శాంక్, సలామ్, భువీ
ఆర్సీబీ ధ‌మాకా.. ప్లే ఆఫ్స్ చేరిన తొలి జ‌ట్టుగా రికార్డు.. పంజాబ్ పై ఘ‌న‌విజ‌యం.. రాణించిన శ‌శాంక్, సలామ్, భువీ
Vidadala Rajini: డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
Nara Devanash YouTube Channel: కంటెంట్ క్రియేటర్‌గా మారిన నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్.. Dino Deets యూట్యూబ్ ఛానల్ ప్రారంభం
కంటెంట్ క్రియేటర్‌గా నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్.. Dino Deets యూట్యూబ్ ఛానల్ ప్రారంభం
Vishal - CM Joseph Vijay: తమిళనాడు సీఎం విజయ్ మంత్రివర్గ కూర్పుపై విశాల్ అసంతృప్తి... దళపతి ముందు మూడు డిమాండ్స్
తమిళనాడు సీఎం విజయ్ మంత్రివర్గ కూర్పుపై విశాల్ అసంతృప్తి... దళపతి ముందు మూడు డిమాండ్స్
Fire Accident: యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
TG EAPCET 2026 Toppers List: తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
Rajdhani Express Fire Accident: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
Embed widget