అన్వేషించండి

UPS Update: కేంద్ర ఉద్యోగులకు దసరా ధమాకా ఆఫర్‌ - కొత్త స్కీమ్‌కు కొన్ని రోజుల్లో నోటిఫికేషన్‌!

Central Government Employees: పాత పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్ స్కీమ్‌లోని అనుకూల విషయాల కలబోతగా యూపీఎస్‌ ఉంటుంది. పదవీ విరమణ తర్వాత హామీతో కూడిన పెన్షన్‌ వస్తుంది.

Unified Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ పథకం (Unified Pension Scheme - UPS) వచ్చే ఏడాది ఏప్రిల్ (01 ఏప్రిల్‌ 2025‌) నుంచి అమలవుతుంది. అయితే, దీనిని ఇంకా ముందుగానే ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌లో, దసరా-దీపావళి కానుకగా, 15 అక్టోబర్ 2024న ఏకీకృత పెన్షన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయవచ్చని సమాచారం. ఈ నూతన పెన్షన్ (యూపీఎస్‌) పథకం భారత ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటి. లక్షలాది మంది కేంద్ర ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా దీనిని రూపొందించారు.

ఏకీకృత పెన్షన్ పథకానికి సంబంధించి సమావేశాలు
ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్‌ ప్రకారం, నూతన పెన్షన్ పథకాన్ని సులభంగా అమలు చేయడానికి, కేంద్ర కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ ‍‌(Tv Somanathan‌) వివిధ మంత్రిత్వ శాఖలు & విభాగాలతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు, 'జాతీయ పెన్షన్ స్కీమ్‌'ను (NPS) సమీక్షించే బాధ్యతను అప్పగించిన కమిటీకి టీవీ సోమనాథన్ ఛైర్మన్‌గా ఉన్నారు. సోమనాథన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏకీకృత పెన్షన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఏకీకృత పెన్షన్ పథకం అమలు బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించింది.

UPS ప్రత్యేకత ఏంటి? 
రిటైర్‌ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా స్థిరమైన మొత్తంలో పింఛను ఇవ్వడం యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ లక్ష్యం. అంటే, ఎన్‌పీఎస్‌లో లేని భరోసాను ఉద్యోగులు ఈ స్కీమ్‌లో పొందే అవకాశం ఉంది. నూతన పథకం కింద, కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణకు ముందు 12 నెలల 'ప్రాథమిక వేతనం + డీఏ' సగటు మొత్తాన్ని లెక్కేసి, అందులో సరిగ్గా సగం డబ్బును పెన్షన్‌గా ఇస్తారు. నెలనెలా స్థిరమైన మొత్తంలో పింఛను అందుతుంది. చేతిలోకి వచ్చే డబ్బు ఎంతో ముందే తెలుస్తుంది కాబట్టి, దానికి తగ్గట్లుగా విశ్రాంత ఉద్యోగులు తమ ఖర్చులను మేనేజ్‌ చేసుకోవచ్చు. 

మరో ఆసక్తికర కథనం: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌ 

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌లోనూ ఉద్యోగులు పెన్షన్ ఫండ్‌కు కాంట్రిబ్యూట్‌ చేయాలి. ఉద్యోగులు తమ 'ప్రాథమిక వేతనం + DA'లో 10 శాతాన్ని NPSలో జమ చేస్తున్నట్లుగానే, యూపీఎస్‌లోనూ పెన్షన్ ఫండ్‌కు జమ చేయాలి. ఎన్‌పీఎస్‌లో, ఉద్యోగుల పెన్షన్ ఫండ్‌కు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్‌ 14 శాతంగా ఉంటే, యూపీఎస్‌లో 18.5 శాతం జమ చేస్తుంది. అంటే, యూపీఎస్‌లో ప్రభుత్వ సహకారం పెరుగుతుంది. ఏకీకృత పెన్షన్ పథకం కింద, ప్రభుత్వ ఉద్యోగులు కనీసం 25 సంవత్సరాల సర్వీస్ తర్వాత మాత్రమే నిర్దేశిత ఫార్ములా కింద 'హామీతో కూడిన పెన్షన్' పొందేందుకు అర్హులు. ఈ కొత్త పెన్షన్ స్కీమ్ 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 24న, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం యూనిఫైడ్‌ పెన్షన్ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది.

మరో ఆసక్తికర కథనం: స్విగ్గీ నుంచి 10 నిమిషాల్లో ఫుడ్‌ డెలివెరీ, హైదరాబాద్‌లో కొత్త సర్వీస్‌ 

టాప్ హెడ్ లైన్స్

RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget