అన్వేషించండి

DA Hike: పెరగనున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతం, డీఏ పెంపునకు సర్వం సిద్ధం!

మరో 4 శాతం పెంచితే, అది మూల వేతనంలో 38 శాతం నుంచి 42 శాతానికి చేరుతుంది. దీనికి అనుగుణంగా ఉద్యోగుల స్థూల, నిరక వేతనం కూడా పెరుగుతుంది.

DA Hike: కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు అతి త్వరలోనే పెద్ద శుభవార్త రాబోతోంది. ప్రభుత్వ ఉద్యోగులు & పింఛనుదార్లకు (Pensioners) కరవు భత్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచవచ్చు. ఫిక్స్‌డ్ ఫార్ములా కింద డియర్‌నెస్ అలవెన్స్‌ను (DA) మరో 4 శాతం పెంచడం లాంఛనంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కరవు భత్యం (Dearness Allowance) 38 శాతంగా ఉంది. ఇప్పుడు, దీనిని మరో 4 శాతం పెంచితే, అది మూల వేతనంలో 38 శాతం నుంచి 42 శాతానికి చేరుతుంది. దీనికి అనుగుణంగా ఉద్యోగుల స్థూల, నిరక వేతనం (Gross Pay & Net Pay) కూడా పెరుగుతుంది.

డీఏ పెంపునకు ఒక ప్రామాణిక పద్ధతి ఉంది. ప్రతి నెలా లేబర్ బ్యూరో విడుదల చేసే "కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్" [Consumer Price Index for Industrial Workers - CPI(IW)] ఆధారంగా డీఏను లెక్కిస్తారు. కార్మిక శాఖకు చెందిన అనుబంధ విభాగమే ఈ లేబర్ బ్యూరో. 

ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివ గోపాల్ మిశ్రా వెల్లడించిన ప్రకారం.. 2022 డిసెంబర్ నెలకు సంబంధించిన సీపీఐ ఐడబ్ల్యూ 2023 జనవరి 31న విడుదల అయ్యింది. దీని ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్ 4.23 శాతం మేర పెరగాల్సి ఉంటుంది. అనవాయితీ ప్రకారం, పాయింట్ తర్వాత ఉన్న నంబర్లను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోదు. అందువల్ల, పాయింట్‌ తర్వాత ఉన్న 23 నంబర్‌ను వదిలేసి, డీఏను నికరంగా 4 శాతం పెంచవచ్చని శివ గోపాల్ మిశ్రా చెప్పారు. తద్వారా, మొత్తం డియర్‌నెస్‌ అలవెన్స్‌ 42 శాతానికి పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ మేరకు డీఏ పెంపు ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ కేంద్ర మంత్రివర్గం ఆమోదం కోసం పంపుతుందని చెప్పారు.

సంవత్సరానికి రెండు సార్లు సవరణ
డియర్‌నెస్ అలవెన్స్‌ అంటే పెరిగిన ధరల నుంచి రక్షణ కోసం ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉపశమనం లేదా పరిహారం. డీఏను ప్రతి సంవత్సరం రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం సవరిస్తుంది. ఈ పద్ధతిలో డీఏను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. దేశంలో ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి కాబట్టి, ప్రతి సవరణలోనూ సాధారణంగా డీఏ పెంపు ఉంటుంది.

జనవరి 1, 2023 నుంచి కొత్త DA వర్తింపు
ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి, జులై 1వ తేదీ నుంచి కొత్త డీఏ అమల్లోకి వస్తుంది. చివరిసారిగా 2022 సెప్టెంబర్ 28న DA సవరించారు. దానిని ఆ ఏడాది జులై 1వ తేదీ నుంచి వర్తింపజేశారు. కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదిస్తే, తాజా డీఏ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఫలితంగా, కోటి మందికి పైగా ఉద్యోగులు & పెన్షనర్లు లబ్ధి పొందుతారు. వాళ్లు ప్రస్తుతం అందుకుంటున్న డియర్‌నెస్‌ రిలీఫ్‌ 38 శాతం నుంచి 42 శాతానికి చేరుతుంది. 

ALSO READ: RBI Repo Rate: వడ్డీల వాతకు సిద్ధంగా ఉండండి, మరో పాతిక శాతం పెరిగే అవకాశం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
పెరుగుతున్న EMI భారం నుంచి ఇలా బయటపడండి.. ఈ చిట్కాలు పాటించకపోతే కష్టమే
పెరుగుతున్న EMI భారం నుంచి ఇలా బయటపడండి.. ఈ చిట్కాలు పాటించకపోతే కష్టమే
Home Loan Tips:హోమ్‌లోన్ ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారా ఈ వివరాలు అస్సలు మర్చిపోవద్దు! లేకుంటే చాలా నష్టపోతారు!
హోమ్‌లోన్ ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారా ఈ వివరాలు అస్సలు మర్చిపోవద్దు! లేకుంటే చాలా నష్టపోతారు!
Friday Stock Markets: మరోసారి వెయ్యి పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్ - ఐదున్నర లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
మరోసారి వెయ్యి పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్ - ఐదున్నర లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Embed widget