అన్వేషించండి

Budget 2023: మిడిల్‌ క్లాస్‌కు మోదీ గిఫ్ట్‌! బడ్జెట్లో వరాలు ప్రకటిస్తారని అంచనా!

Budget 2023: కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్లో వారికి ప్రయోజనం కల్పించనుంది.

Budget 2023:

కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్లో వారికి ప్రయోజనం కల్పించనుంది. వివిధ ప్రభుత్వ శాఖలు పంపించిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ క్షుణ్ణంగా పరిశీలించిందని సమాచారం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వీటిని ప్రకటిస్తారని తెలిసింది.

కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత ఆదాయ పన్ను మినహాయింపును పెంచలేదు. దివంగత ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ రూ.2.5 లక్షలకు పెంచాక దీనిని పట్టించుకోలేదు. అలాగే 2019 నుంచి స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000 గానే ఉంది. ప్రభుత్వం స్టాండర్డ్‌ డిడక్షన్‌, మినహాయింపులను పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెరిగిన ద్రవ్యోల్బణం నుంచి వేతన ఆధారిత మధ్య తరగతికి ఉపశమనం కల్పిస్తారని అంటున్నారు. మిడిల్‌ క్లాస్‌ కష్టాలు తనకూ తెలుసన్న నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.

'నేనూ మధ్య తరగతి మహిళనే. వారి కష్టాలను నేను అర్థం చేసుకోగలను. నన్ను నేను మధ్య తరగతి మహిళగానే గుర్తించుకుంటాను. కాబట్టి వారి గురించి నాకు తెలుసు' అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కొన్ని రోజుల ముందు వెల్లడించారు. మధ్యతరగతి వర్గాలపై మోదీ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి పన్నులు పెంచలేదని గుర్తు చేశారు. దేశంలో ఈ వర్గం పెరుగుతుండటంతో 27 నగరాల్లో మెట్రో రైలు విస్తరించామని, వంద స్మార్ట్‌ సిటీలు నిర్మిస్తున్నామని వివరించారు. వీరి కోసం ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు.

'నేను మధ్య తరగతి సమస్యల్ని గుర్తించగలను. వారి కోసం ప్రభుత్వం చాలా చేసింది. ఇంకా చేస్తుంది' అని నిర్మాలా సీతారామన్‌ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పన్ను విధానాల్లో మార్పులు చేస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు. మినహాయింపులు పెంచడం, సెక్షన్‌ 80సీ పరిధి పెంచడం, కొన్నింటిని ఆ జాబితాలోంచి తొలగించి కొత్త సెక్షన్లు సృష్టించడం చేస్తుందని అంటున్నారు.

మధ్యతరగతి వర్గాలకు మేలు జరిగేలా మూలధన రాబడి పన్ను నిబంధనలను ప్రభుత్వం సరళీకరిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ మధ్య కాలంలో వీరు ఈక్విటీ మార్కెట్లలో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొన్నారు. వైద్య బీమా ప్రీమియం చెల్లింపులను సులభం చేయనుందని అంటున్నారు. జీవిత బీమా మినహాయింపు కోసం ప్రత్యేక ప్రావిజన్లు ఏర్పాటు చేస్తారని అంచనా.

Also Read: కేంద్ర బడ్జెట్‌ నుంచి స్టాక్‌ మార్కెట్‌ ఏం కోరుకుంటోంది, ఇన్వెస్టర్ల ఆశలేంటి?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maoists Surrendered: మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
CTET February 2026 : ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
విమాన సంస్థలకు ఎయిర్‌బస్‌ హెచ్చరిక! సాఫ్ట్‌వేరే అప్‌డేట్‌కు సిద్ధమైన సంస్థలు! 250కిపైగా విమానాలపై ప్రభావం!
విమాన సంస్థలకు ఎయిర్‌బస్‌ హెచ్చరిక! సాఫ్ట్‌వేరే అప్‌డేట్‌కు సిద్ధమైన సంస్థలు! 250కిపైగా విమానాలపై ప్రభావం!
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Surrendered: మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
CTET February 2026 : ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం
విమాన సంస్థలకు ఎయిర్‌బస్‌ హెచ్చరిక! సాఫ్ట్‌వేరే అప్‌డేట్‌కు సిద్ధమైన సంస్థలు! 250కిపైగా విమానాలపై ప్రభావం!
విమాన సంస్థలకు ఎయిర్‌బస్‌ హెచ్చరిక! సాఫ్ట్‌వేరే అప్‌డేట్‌కు సిద్ధమైన సంస్థలు! 250కిపైగా విమానాలపై ప్రభావం!
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
Embed widget