అన్వేషించండి

Amaravati farmers: త్వరలో అమరావతి గెజిట్ - సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం - రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ

Amaravati farmers problems: అమరావతి రైతుల సమస్యలకు ఆరు నెలల్లో పరిష్కారం చూపిస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని హామీ ఇచ్చారు. అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారంతో ఆయన రైతులకో సమావేశం అయ్యారు.

Amaravati farmers problems will be resolved within six months: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన అన్ని సమస్యలు 6 నెలల్లో పూర్తిగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని  కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. అమరావతి రైతుల సమస్యల పరిష్కారం అంశంపై రైతులతో సమావేశమయ్యారు.   ప్రభుత్వం స్థానికులు, రైతులతో ప్రతి వారం లేదా రెండు వారాలకు ఒకసారి సంప్రదింపులు జరుపుతుందని తెలిపారు. అమరావతి గురించి సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు వార్తలు విశ్వసించవద్దని, చట్టపరమైన , సంక్లిష్ట సమస్యలను క్రమబద్ధంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశం రాయపుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఆఫీస్‌లో 7వ అంతస్తులో ఉదయం 9 గంటలకు జరిగింది.
 
ఈ నెల 10న జరిగిన మొదటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించారు. రైతులు లేవనెత్తిన కొత్త సమస్యలు, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఆందోళనలను చర్చించారు. కమిటీ సభ్యులు అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు నిధులు సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అమరావతి రైతుల సహకారం లేకుండా రాజధాని అభివృద్ధి సాధ్యం కాదు. వారి సమస్యలు మా ప్రాధాన్యత అని మంత్రి పి. నారాయణ  స్పష్టం చేశారు. 

సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పి. నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్ భార్గవ తేజ అందరూ రైతుల సమస్యలు వినేందుకు వచ్చారు.  అమరావతిని శాశ్వత రాజధానిగా చేసే బిల్లును పార్లమెంట్‌లో ఆమోదం  పొందే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.  ఇది అమరావతి రైతులకు భద్రత ఇస్తుందని, 3 సంవత్సరాల్లో వరల్డ్ క్లాస్ క్యాపిటల్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.     

రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని కొంత కాలంగా జరుగుతున్న ప్రచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కమిటీని నియమించారు. ముగ్గురికి  బాధ్యతలు అప్పగించారు. వారు తరచూ రైతులతో సమావేశం అయి.. వారి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నారు.  2019-24 మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరావతి రైతుల JAC నాయకులపై నమోదు చేసిన కేసులు ఇప్పటికే అలాగే ఉన్నాయి. వీలైనంత త్వరగా తొలగించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయినా ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీ అలాగే ఉండిపోయింది. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.                       

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
Mana Shankara Vara Prasad Garu Trailer: ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
ట్రైలర్ లాంచ్‌కు చిరు & నయన్ వెళ్లట్లేదు... మరి చీఫ్ గెస్ట్ ఎవరు? MSG Trailer ఈవెంట్ డీటెయిల్స్‌ తెలుసుకోండి
Soldier Suicide: కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
కూల్‌గా కూర్చున్నాడు, రైలు రాగానే పట్టాలపై తలపెట్టి జవాను ఆత్మహత్య
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ 3 వాస్తు చిట్కాలను పాటిస్తే అంతా ప్రేమమయం అయిపోతుంది!
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
Embed widget