అన్వేషించండి

Amaravati Farmers: అమరావతి రగులుతోంది! రైతుల అసంతృప్తిని కూటమి ప్రభుత్వం గమనిస్తుందా?

Amaravati Farmers: అమరావతి రాజధాని రైతులు ప్రభుత్వ అధికారులపై అసంతృప్తితో ఉన్నారు. వారి చెప్పిన సమస్యలు ఒక్కటే పరిష్కారమైందని వాపోతున్నారు. ఈ నెలాఖరున కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.

Amaravati Farmers: రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఒక కమిటీగా ఏర్పడి ఈ మధ్యనే గుంటూరులో ఒక సమావేశం నిర్వహించారు. వారి మాటల్లో రాజధాని కోసం భూములు ఇచ్చి అధికారులతో మాటలు పడాల్సిన కర్మ పట్టిందే అన్న బాధ ఎక్కువగా కనిపించింది. చంద్రబాబుపై నమ్మకంతో 29 గ్రామాల ప్రజలు భూములు ఇస్తే తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ప్రభుత్వం నత్త నడకన పనిచేస్తోంది అనేది వారి ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా సిఆర్డిఏ అధికారులు కలవడానికి నానా అగుచాట్లు పడవలసి వస్తుందని అధికారులు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. నిజానికి 2019-24 మధ్య కాలంలో అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేసిన జగన్ ప్రభుత్వంపై మొట్టమొదట ఉద్యమాలు చేసింది తామే అని దాని ఫలితంగా 2024 ఎన్నికల్లో కూటమి పెద్ద విజయం సాధించింది అనీ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. అమరావతి రైతులు వినిపిస్తున్న ప్రధాన సమస్యలు ఇవి 

1) గ్రామ కంఠం సమస్య-గెజిట్ నోటిఫికేషన్ ఆలస్యం

ప్రధానంగా అమరావతి రైతులు ఎదుర్కొంటున్న సమస్య అసలు రాజధాని బౌండరీస్ ఎక్కడని. ఇంతవరకు అమరావతి గెజిట్ నోటిఫికేషన్ రాకపోవడంతో రాజధాని ఎల్లలపై సందిగ్దత అలాగే కొనసాగుతుంది. అదిగాక గ్రామ కంఠాల సమస్య అలాగే నిలిచిపోయింది. నిజానికి ప్రభుత్వం, అధికారులు దృష్టి పెడితే పది పదిహేను రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించవచ్చు. కానీ కూటమి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికి సమస్య అలాగే ఉంది.

2) మహిళల్ని, చిన్న రైతులని అవమానిస్తున్నారు

CRDA అధికారులు మహిళలు, చిన్నకారు రైతులతో మాట్లాడే విధానం అసలు బాలేదని రాజధాని కోసం భూములు ఇచ్చి ఉద్యమాలు చేసిన తమతో వారి వ్యవహార శైలి ఏమాత్రం బాగుండడం లేదనేది వారి ఆరోపణ. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తమకు వ్యతిరేకత లేదని కానీ కింద ఉన్న నాయకులు అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు.

3) భూములు ఇవ్వని పొలాల్లో ఇచ్చిన వారికి ప్లాట్లు

అమరావతికి 29 గ్రామాల ప్రజలు భూములు ఇవ్వగా ఆయా గ్రామాల్లో ఇంకా కొన్ని పొలాల భూ సమీకరణ జరగాల్సి ఉంది. భూములు ఇచ్చిన రైతులకు ఇంకా రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చే విషయంలో పనులు నత్త నడకన సాగుతున్నాయి. అంతేకాకుండా ఇంకా భూములు ఇవ్వని 1250 ఎకరాల్లో రోడ్లు వేయడం కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. దానితో అక్కడ రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా గజిబిజిగా తయారైంది.

4) ఇప్పటికీ అమరావతి రైతులపై కేసులు అలానే ఉన్నాయి  అలానే ఉన్నాయి

2019-24 మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరావతి రైతుల JAC నాయకులపై నమోదు చేసిన కేసులు ఇప్పటికే అలాగే ఉన్నాయి. వీలైనంత త్వరగా తొలగించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయినా ఎన్నికల్లో ఇచ్చిన ఆ హామీ అలాగే ఉండిపోయింది.

మొత్తం 14 సమస్యలు... తీర్చింది ఒక్కటే

ప్రభుత్వం వచ్చిన కొత్తలో మున్సిపల్ మంత్రి నారాయణ కలిసి అమరావతి జేఏసీ 14 సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. అయితే వాటిలో నెరవేరింది మాత్రం కేవలం ఒక్కటే. అది రైతులు ఇచ్చిన భూములకు ఏడాది పొడవునా ఇచ్చే కౌలు. అలాగే అమరావతిలో ఉన్న అసైండ్  భూములకు సంబంధించి ఇచ్చే నష్ట పరిహారంపై ఇప్పట్లో ఏమి తేల్చలేదని స్పష్టత రైతులకు ఇచ్చేసింది ప్రభుత్వం. మిగిలిన 12 సమస్యలపై ప్రభుత్వం గానీ సిఆర్డిఏ అధికారులు కానీ ఏమి తేల్చకుండా ఉండడం వల్ల రైతుల నుంచి జేఏసీ నాయకులు పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. ఈ నెలాఖరున మరోసారి సమావేశమై తమ తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని అమరావతి రైతుల JAC చెబుతోంది.

ఈరోజు రైతు సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం

మరోవైపు రైతుల ఆందోళన ఫై ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈరోజు అమరావతి రైతుల సమస్యలపై చర్చించడానికి మంత్రుల బృందం భేటీ కానుంది. ఇప్పటికే అంటే ఈ నెల 10వ తేదీన జరిగిన కమిటీ మొదటి సమావేశంలో చర్చించిన అంశాల పురోగతితోపాటు రైతులు లేవనెత్తుతున్న ఇతర సమస్యలపై చర్చిస్తారని మంత్రి నారాయణ కార్యాలయం ప్రకటించింది. 

సీఎం చంద్రబాబు నియమించిన ఈ కమిటీ రెండో సమావేశం నేటి ఉదయం 9 గంటలకు రాయపూడిలోని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఆఫీస్ 7వ ఫ్లోర్‌లో జరుగుతుంది. కమిటీలో సభ్యులుగా ఉన్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్,రాష్ట్ర మంత్రి నారాయణ,తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ,సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ,అదనపు కమిషనర్ భార్గవ తేజ ఈ సమావేశంలో పాల్గొంటారు. మరి ఈ సమావేశంలోనైనా అమరావతి రైతులు చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇచ్చి వారిని శాంత పరుస్తారో లేదో చూడాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget