Maoists surrender: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
Telangana DGP :తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఆజాద్ కూడా ఉన్నారు.

37 Maoists surrender before Telangana DGP: మావోయిస్టులు తెలంగాణలో మరో తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి ముందు మొత్తం 37 మంది మావోయిస్టులు శనివారం లొంగుబాటు చేశారు. వీరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ వంటి కీలక నేతలు కూడా ఉన్నారు. మావోయిస్టు పార్టీ ప్రభావం తగ్గుతోందని, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలనే భావన పెరుగుతోందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ పోలీస్ హెడ్క్వార్టర్స్లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ లొంగుబాటు జరిగింది. 37 మందిలో 25మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారు. వీరు అజాద్, అప్పాసి నారాయణ (రమేష్) వంటి స్టేట్ కమిటీ నేతలు, అలాగే ఏవోబీ ప్రాంతాల్లో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినవారు. ఆజాద్కు మావోయిస్టు పార్టీలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. అతను ఏవోబీ ప్రాంతంలో ఆయుధాలు, రిక్రూట్మెంట్, ప్రచార విభాగాల్లో ముఖ్య బాధ్యతలు నిర్వహించాడు. రమేష్ కూడా స్టేట్ కమిటీలో కీలక సభ్యుడిగా పనిచేశాడు.
పోలీసులు ఈ లొంగుబాటు తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో వివరాలు వెల్లడించారు. వీరు తీసుకొచ్చిన ఆయుధాల్లో 303 రైఫిల్, G3 రైఫిల్, SLR, AK-47 రైఫిల్లు, వేలాది బుల్లెట్లు, క్యార్ట్రిజ్ సీజ్లు ఉన్నాయి. ఈ ఆయుధాలు మావోయిస్టు ఆపరేషన్లకు ఉపయోగపడేవి. డీ ఈ లొంగుబాటు మావోయిస్టు పార్టీకి భారీ నష్టం. 2025లో మొత్తం 427 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు.
కొయ్యాడ సాంబయ్య (ఆజాద్) మావోయిస్టు పార్టీలో 2000ల నుంచి ఉన్నాయి. అతను ఏవోబీ ప్రాంతంలో పార్టీ సెక్రటారీగా పనిచేశాడు. ఆయుధాల పంపిణీ, క్యాడర్ రిక్రూట్మెంట్, ప్రచార కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాడు. పోలీసుల పటిష్ఠమైన ఆపరేషన్లు, ఆరోగ్య సమస్యలు, పార్టీలో అంతర్గత విభేదాలు కారణంగా ఆజాద్ లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు
కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని సంకల్పించింది. ఈ దిశగా 'ఆపరేషన్ కగార్' ప్రారంభమైంది. తెలంగాణ పోలీసులు ఈ ఆపరేషన్లో భాగంగా పటిష్ఠమైన ఇంటెలిజెన్స్, పాలసీని అమలు చేస్తున్నారు. 2025లో ఇప్పటికే 427 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ లొంగుబాటు మావోయిస్టు ఐడియాలజీ ఇక ఉనికిలో ఉండదని , క్యాడర్లు మెయిన్స్ట్రీమ్లో చేరాలనే భావన పెరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ 37 మంది మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వ రిహాబిలిటేషన్ పాలసీ ప్రకారం సహాయం అందిస్తున్నారు. ఆర్థిక సహాయం , ఉపాధి అవకాశాలు, వైద్య సౌకర్యాలు కల్పిస్తారు. మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు, ఆరోగ్య సమస్యలు, భద్రతా బలగాల ఒత్తిడి కారణంగా మరిన్ని లొంగుబాట్లు ఉంటాయని డీజీపీ తెలిపారు.
అనారోగ్యంతో పాటు మారిన పరిస్థితులతో తాము జనజీవన స్రవంతిలో కలవాలనుకున్నట్లుగా లొంగిపోయిన మావోయిస్టులు ప్రకటించారు. కేంద్ర కమిటీలో ఇంకా ఇద్దరు ఉన్నారని వారు కూడా లొంగిపోవాలని సలహా ఇచ్చారు. పార్టీకి చెప్పే తాము లొంగిపోాయమన్నారు.





















