అన్వేషించండి

Maoists surrender: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !

Telangana DGP :తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఆజాద్ కూడా ఉన్నారు.

37 Maoists surrender before Telangana DGP:  మావోయిస్టులు తెలంగాణలో మరో తీవ్రమైన  ఎదురు దెబ్బ తగిలింది.   రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి ముందు మొత్తం 37 మంది మావోయిస్టులు శనివారం లొంగుబాటు చేశారు. వీరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ వంటి కీలక నేతలు కూడా ఉన్నారు.  మావోయిస్టు పార్టీ ప్రభావం తగ్గుతోందని, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలనే భావన పెరుగుతోందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.
 
తెలంగాణ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ లొంగుబాటు జరిగింది. 37 మందిలో 25మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారు. వీరు అజాద్, అప్పాసి నారాయణ (రమేష్) వంటి స్టేట్ కమిటీ నేతలు, అలాగే ఏవోబీ  ప్రాంతాల్లో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినవారు. ఆజాద్‌కు మావోయిస్టు పార్టీలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. అతను ఏవోబీ ప్రాంతంలో ఆయుధాలు, రిక్రూట్‌మెంట్, ప్రచార విభాగాల్లో ముఖ్య బాధ్యతలు నిర్వహించాడు. రమేష్ కూడా స్టేట్ కమిటీలో కీలక సభ్యుడిగా పనిచేశాడు.

పోలీసులు ఈ లొంగుబాటు తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వివరాలు వెల్లడించారు. వీరు తీసుకొచ్చిన ఆయుధాల్లో 303 రైఫిల్, G3 రైఫిల్, SLR, AK-47 రైఫిల్‌లు, వేలాది బుల్లెట్లు, క్యార్ట్రిజ్ సీజ్‌లు ఉన్నాయి. ఈ ఆయుధాలు మావోయిస్టు ఆపరేషన్లకు ఉపయోగపడేవి. డీ ఈ లొంగుబాటు మావోయిస్టు పార్టీకి భారీ నష్టం. 2025లో మొత్తం 427 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. 

కొయ్యాడ సాంబయ్య (ఆజాద్) మావోయిస్టు పార్టీలో 2000ల నుంచి ఉన్నాయి.   అతను ఏవోబీ ప్రాంతంలో  పార్టీ సెక్రటారీగా పనిచేశాడు. ఆయుధాల పంపిణీ, క్యాడర్ రిక్రూట్‌మెంట్, ప్రచార కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాడు. పోలీసుల పటిష్ఠమైన ఆపరేషన్లు, ఆరోగ్య సమస్యలు, పార్టీలో అంతర్గత విభేదాలు కారణంగా ఆజాద్ లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు  

కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని సంకల్పించింది. ఈ దిశగా 'ఆపరేషన్ కగార్' ప్రారంభమైంది. తెలంగాణ పోలీసులు ఈ ఆపరేషన్‌లో భాగంగా పటిష్ఠమైన ఇంటెలిజెన్స్,   పాలసీని అమలు చేస్తున్నారు. 2025లో ఇప్పటికే 427 మంది మావోయిస్టులు లొంగిపోయారు.   ఈ లొంగుబాటు మావోయిస్టు ఐడియాలజీ ఇక ఉనికిలో ఉండదని , క్యాడర్లు మెయిన్‌స్ట్రీమ్‌లో చేరాలనే భావన పెరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ 37 మంది మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వ రిహాబిలిటేషన్ పాలసీ ప్రకారం సహాయం అందిస్తున్నారు.  ఆర్థిక సహాయం , ఉపాధి అవకాశాలు, వైద్య సౌకర్యాలు కల్పిస్తారు.  మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు, ఆరోగ్య సమస్యలు, భద్రతా బలగాల ఒత్తిడి కారణంగా మరిన్ని లొంగుబాట్లు ఉంటాయని డీజీపీ తెలిపారు.     

అనారోగ్యంతో పాటు మారిన పరిస్థితులతో తాము  జనజీవన స్రవంతిలో కలవాలనుకున్నట్లుగా లొంగిపోయిన మావోయిస్టులు ప్రకటించారు.  కేంద్ర కమిటీలో ఇంకా ఇద్దరు ఉన్నారని వారు కూడా లొంగిపోవాలని సలహా ఇచ్చారు. పార్టీకి చెప్పే తాము లొంగిపోాయమన్నారు.                

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Soyam Bapu Rao: ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
India Tour of Bangladesh: శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
శ్రీలంక టూర్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌ వెళ్తుందా? కేంద్రం ఓకే చెబుతుందా? 
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
Embed widget