అన్వేషించండి

Maoists surrender: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !

Telangana DGP :తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఆజాద్ కూడా ఉన్నారు.

37 Maoists surrender before Telangana DGP:  మావోయిస్టులు తెలంగాణలో మరో తీవ్రమైన  ఎదురు దెబ్బ తగిలింది.   రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి ముందు మొత్తం 37 మంది మావోయిస్టులు శనివారం లొంగుబాటు చేశారు. వీరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ వంటి కీలక నేతలు కూడా ఉన్నారు.  మావోయిస్టు పార్టీ ప్రభావం తగ్గుతోందని, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలనే భావన పెరుగుతోందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.
 
తెలంగాణ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ లొంగుబాటు జరిగింది. 37 మందిలో 25మంది మహిళలు, 12 మంది పురుషులు ఉన్నారు. వీరు అజాద్, అప్పాసి నారాయణ (రమేష్) వంటి స్టేట్ కమిటీ నేతలు, అలాగే ఏవోబీ  ప్రాంతాల్లో పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినవారు. ఆజాద్‌కు మావోయిస్టు పార్టీలో 25 సంవత్సరాల అనుభవం ఉంది. అతను ఏవోబీ ప్రాంతంలో ఆయుధాలు, రిక్రూట్‌మెంట్, ప్రచార విభాగాల్లో ముఖ్య బాధ్యతలు నిర్వహించాడు. రమేష్ కూడా స్టేట్ కమిటీలో కీలక సభ్యుడిగా పనిచేశాడు.

పోలీసులు ఈ లొంగుబాటు తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వివరాలు వెల్లడించారు. వీరు తీసుకొచ్చిన ఆయుధాల్లో 303 రైఫిల్, G3 రైఫిల్, SLR, AK-47 రైఫిల్‌లు, వేలాది బుల్లెట్లు, క్యార్ట్రిజ్ సీజ్‌లు ఉన్నాయి. ఈ ఆయుధాలు మావోయిస్టు ఆపరేషన్లకు ఉపయోగపడేవి. డీ ఈ లొంగుబాటు మావోయిస్టు పార్టీకి భారీ నష్టం. 2025లో మొత్తం 427 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. 

కొయ్యాడ సాంబయ్య (ఆజాద్) మావోయిస్టు పార్టీలో 2000ల నుంచి ఉన్నాయి.   అతను ఏవోబీ ప్రాంతంలో  పార్టీ సెక్రటారీగా పనిచేశాడు. ఆయుధాల పంపిణీ, క్యాడర్ రిక్రూట్‌మెంట్, ప్రచార కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాడు. పోలీసుల పటిష్ఠమైన ఆపరేషన్లు, ఆరోగ్య సమస్యలు, పార్టీలో అంతర్గత విభేదాలు కారణంగా ఆజాద్ లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు  

కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని సంకల్పించింది. ఈ దిశగా 'ఆపరేషన్ కగార్' ప్రారంభమైంది. తెలంగాణ పోలీసులు ఈ ఆపరేషన్‌లో భాగంగా పటిష్ఠమైన ఇంటెలిజెన్స్,   పాలసీని అమలు చేస్తున్నారు. 2025లో ఇప్పటికే 427 మంది మావోయిస్టులు లొంగిపోయారు.   ఈ లొంగుబాటు మావోయిస్టు ఐడియాలజీ ఇక ఉనికిలో ఉండదని , క్యాడర్లు మెయిన్‌స్ట్రీమ్‌లో చేరాలనే భావన పెరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ 37 మంది మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వ రిహాబిలిటేషన్ పాలసీ ప్రకారం సహాయం అందిస్తున్నారు.  ఆర్థిక సహాయం , ఉపాధి అవకాశాలు, వైద్య సౌకర్యాలు కల్పిస్తారు.  మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు, ఆరోగ్య సమస్యలు, భద్రతా బలగాల ఒత్తిడి కారణంగా మరిన్ని లొంగుబాట్లు ఉంటాయని డీజీపీ తెలిపారు.     

అనారోగ్యంతో పాటు మారిన పరిస్థితులతో తాము  జనజీవన స్రవంతిలో కలవాలనుకున్నట్లుగా లొంగిపోయిన మావోయిస్టులు ప్రకటించారు.  కేంద్ర కమిటీలో ఇంకా ఇద్దరు ఉన్నారని వారు కూడా లొంగిపోవాలని సలహా ఇచ్చారు. పార్టీకి చెప్పే తాము లొంగిపోాయమన్నారు.                

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS leaders rebellion against Kaushik Reddy: హుజూరాబాద్ బీఆర్ఎస్‌లో ముదురుతున్న సెగ - పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నేతల తిరుగుబాటు
హుజూరాబాద్ బీఆర్ఎస్‌లో ముదురుతున్న సెగ - పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నేతల తిరుగుబాటు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Congress Jeevan Reddy: జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?
జీవన్ రెడ్డిని బుజ్జగించిన మంత్రులు -తగ్గని సీనియర్ నేత - 25న గుడ్ బై?

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Karimnagar SI Chandrasekhar Suicide : కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Trump Iran War:ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
Creta లేదా కొత్త Duster? ధర, ఫీచర్లు, మైలేజ్ పరంగా ఏది బెస్ట్ ? తెలుసుకున్నాకే కొనండి
Creta లేదా కొత్త Duster? ధర, ఫీచర్లు, మైలేజ్ పరంగా ఏది బెస్ట్ ? తెలుసుకున్నాకే కొనండి
Gold Price Trends India: ఉగాది, గుడిపడ్వా వేళ పసిడి విపణికి కొత్త కళ! శుక్రవారం ఒక్కరోజే 22 వేల కోట్ల వ్యాపారం!
ఉగాది, గుడిపడ్వా వేళ పసిడి విపణికి కొత్త కళ! శుక్రవారం ఒక్కరోజే 22 వేల కోట్ల వ్యాపారం!
Devansh Birthday:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు ఫ్యామిలీ! దేవాన్ష్ పుట్టిన రోజున తిరుమలలో అన్నదాన కార్యక్రమం! స్వయంగా వడ్డించిన సీఎం!
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన! రెండు రోజులు బీభత్సం! పిడుగులతో జనం బెంబేలు!
Embed widget