అన్వేషించండి

First E85 Fuel Station: ఢిల్లీలో దేశంలోనే తొలి E85 ఫ్యూయల్ స్టేషన్ ప్రారంభం! లీటర్ పెట్రోల్‌పై 20 రూపాయలు ఆదా!

First E85 Fuel Station:ఢిల్లీలో దేశంలోనే తొలి E85 ఇంధన కేంద్రం ప్రారంభమైంది. లీటరుకు రూ. 20 వరకు ఆదా చేసే ఈ ఫ్లెక్స్‌ ఫ్యూయల్ పూర్తి వివరాలు చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దేశ తొలి E85 ఫ్యూయల్ స్టేషన్ న్యూఢిల్లీలో ప్రారంభమైంది.
  • E85లో 85% ఇథనాల్; లీటరుకు రూ.20 తక్కువ ధర.
  • పాత వాహనాలకు E85 సరిపోదు, ప్రత్యేక ఇంజిన్ అవసరం.
  • మారుతి ఇప్పటికే ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగన్ ఆర్ మోడల్ విడుదల చేసింది.

First E85 Fuel Station: భారత్‌ ఇంధన మార్కెట్‌లో సరికొత్త శకం మొదలైంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని పూసా రోడ్‌లో దేశంలోనే మొదటి E85 ఫ్యూయల్ స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. 

అసలు ఏంటీ E85 ఫ్యాయల్

సాధారణంగా పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా వస్తున్న ఈ ఇంధనం ఒక మిశ్రమం. E85 అంటే ఇందులో 85 శాతం ఇథనాల్, కేవలం 15 శాతం మాత్రమే పెట్రోల్ ఉంటుంది. ప్రస్తుతం మనం వాడుతున్న E20 పెట్రోల్‌లో కేవలం 20 శాతం ఇథనాల్ మాత్రమే ఉంటుంది. ఇథనాల్ శాతం పెరగడం వల్ల ఇంధన ధర గణనీయంగా తగ్గుతోంది. 

Image

లీటర్‌కు 20 రూపాయలు ఆదా

ఈ సరికొత్త E85 ఇంధన ధరను లీటర్కు 82.12 రూపాయలుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ20 పెట్రోల్‌ ధరలతో పోలిస్తే ఇది దాదాపు ఇరవై రూపాయలు తక్కువకు వస్తుంది. రోజువారి ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి, ముఖ్యంగా ట్యాక్సీలు, డెలివరీ వాహనదారులకు ఇది వరమని చెప్పవచ్చు. 
Image

పాత వాహనాలకు పనికిరాదు 

మీ దగ్గర పాత పెట్రోల్ కారులో నేరుగా E85 ఇంధనాన్ని పోయలేరు దీని కోసం ప్రత్యేకమైన ఫ్లెక్స్‌ ఫ్యూయల్ ఇంజన్ అవసరం. E85 ఇంధనం వాడే కార్లలో ప్రత్యేకమైన ఫ్యూయల్ ట్యాంకులు, కొత్త రకమైన ఫ్యూయల్ లైన్లు, రీ ప్రోగ్రామ్ చేసిన ఎలక్ట్రానికి కంట్రోల్ యూనిట్‌ ఉండాలి. 

Image

ఇథనాల్‌లో పెట్రోల్‌ కంటే తక్కువ శక్తి ఉంటుంది. దీని వల్ల కారు మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ కారణంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల ధర సాధారణం కార్ల కంటే కొంత ఎక్కువగా ఉండవచ్చు. 

Image

మారుతి ముందడుగు 

భారత్‌ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇప్పటికే ఫ్లెక్స్ ఫ్యూయల్ వ్యాగన్ ఆర్ మోడల్‌ను తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఇది కమర్షియల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇంధన కేంద్రాల నెట్‌వర్క్ పెరిగిన తర్వాత సాధారణ ప్రజలకు విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

Image

వాహనాన్ని ఎక్కువగా వాడే వారికి మాత్రమే E85కార్లు లాభసాటిగా ఉంటాయి. కారు కొనుగోలు చేసేటప్పుడు పెట్టే అదనపు ఖర్చును ప్రతి లీటరుపై ఆదా అయ్యే 20 రూపాయలతో భర్తీ చేసుకోవాలంటే నిరంతరం వినియోగం అవసరం తక్కువగా వాడే వారికి దీని వల్ల పెద్దగా ఆర్థిక ప్రయోజనం ఉండకపోవచ్చు. బ్రెజిల్ వంటి దేశాల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు చాలా పాపులర్. E85 వాడకం వల్ల కార్బన్ ఉద్గారాలు, కాలుష్యం తగ్గుతాయి. 

Image

Frequently Asked Questions

E85 ఇంధనం అంటే ఏమిటి?

E85 ఇంధనం అనేది పెట్రోల్ మరియు ఇథనాల్ మిశ్రమం. ఇందులో 85 శాతం ఇథనాల్, 15 శాతం మాత్రమే పెట్రోల్ ఉంటాయి. ఇది ఇథనాల్ శాతం పెరగడం వల్ల తక్కువ ధరకే లభిస్తుంది.

భారతదేశంలో మొదటి E85 ఫ్యూయల్ స్టేషన్ ఎక్కడ ప్రారంభమైంది?

దేశ రాజధాని న్యూఢిల్లీలోని పూసా రోడ్‌లో భారతదేశంలోనే మొదటి E85 ఫ్యూయల్ స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన ధరల ఉపశమనానికి కేంద్రం వేసిన కీలక అడుగు.

E85 ఇంధనం వల్ల ఎంత ధర ఆదా అవుతుంది?

E85 ఇంధన ధర లీటర్‌కు 82.12 రూపాయలు. ప్రస్తుతం E20 పెట్రోల్‌తో పోలిస్తే ఇది దాదాపు ఇరవై రూపాయలు తక్కువకు వస్తుంది.

పాత పెట్రోల్ వాహనాలకు E85 ఇంధనం పని చేస్తుందా?

లేదు, పాత పెట్రోల్ కార్లలో నేరుగా E85 ఇంధనాన్ని వాడలేరు. దీనికి ప్రత్యేకమైన ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్, ఫ్యూయల్ ట్యాంకులు మరియు కొత్త రకమైన ఫ్యూయల్ లైన్లు అవసరం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
కియా సైరోస్ EV లాంచ్‌ - 526 km రేంజ్‌, ADAS, వెంటిలేటెడ్ రియర్ సీట్లు, BaaS స్కీమ్‌తో తక్కువ రేటు!
కొత్త కియా సైరోస్ EV మన మార్కెట్‌లోకి వచ్చేసింది - కేవలం కేవలం రూ.8 లక్షలకే 526 km రేంజ్!
2026 మారుతి బ్రెజ్జా సేఫ్టీలో ఫస్ట్‌ - పెద్దలు, పిల్లల భద్రతలో 5 స్టార్ భారత్ NCAP రేటింగ్
సేఫ్టీలో 5-స్టార్‌ రేటింగ్‌ సాధించిన 2026 మారుతి బ్రెజ్జా - మీ ఫ్యామిలీ భద్రతకు భరోసా!
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
Advertisement

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget