అన్వేషించండి

కార్‌ మార్కెట్‌లో కీలక మలుపు: యూరోపియన్‌ కార్లపై దిగుమతి సుంకాలు 40 శాతానికి తగ్గించే యోచనలో భారత్‌!

EUతో ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందంలో భాగంగా భారత్‌ దిగుమతి కార్లపై సుంకాలను 110 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాలనుకుంటోంది. దీని ప్రభావం ఆటో మార్కెట్‌పై ఎలా ఉండబోతోంది?

Imported Cars India: భారత ఆటో మార్కెట్‌లో కీలక మార్పులకు దారి తీసే ఒక పెద్ద నిర్ణయం త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరోపియన్‌ యూనియన్‌తో కుదుర్చుకోబోయే ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందంలో ‍‌(India EU Trade Deal) భాగంగా, దిగుమతి చేసుకునే కార్లపై ఉన్న భారీ సుంకాలను గణనీయంగా తగ్గించేందుకు భారత్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, కార్లపై 70 శాతం నుంచి 110 శాతం వరకు ఉన్న దిగుమతి పన్నులను, తొలి దశలోనే 40 శాతానికి తగ్గించే యోచనపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

రాయిటర్స్‌ రిపోర్ట్‌ ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయానికి అంగీకరించినట్లు చర్చల్లో భాగంగా ఉన్న వర్గాలు వెల్లడించాయి. యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన 27 దేశాల నుంచి దిగుమతి అయ్యే, 15,000 యూరోల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై ఈ తగ్గింపు వర్తించే అవకాశం ఉంది. కాలక్రమేణా ఈ సుంకాలను 10 శాతం వరకు మరింత తగ్గించే దిశగా కూడా ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తోంది.

‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌’గా ప్రచారం

భారత్‌ - EU మధ్య సాగుతున్న ఈ వాణిజ్య చర్చలను ఇప్పటికే ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ డీల్స్‌’గా వ్యవహరిస్తున్నారు. మంగళవారం నాటికి ఈ ఫ్రీ ట్రేడ్‌ ఒప్పందం పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఒప్పందం అమల్లోకి వస్తే, భారత్‌ - EU మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరిగే అవకాశం ఉంది.

అమెరికా విధించిన అధిక సుంకాల కారణంగా దెబ్బతిన్న వస్త్రాలు, ఆభరణాలు వంటి భారత ఎగుమతులకు కూడా ఈ ఒప్పందం ఊరట కలిగించే అవకాశం ఉంది.

భారత ఆటో మార్కెట్‌ ఇప్పటివరకు ఎలా ఉంది?

అమ్మకాల పరంగా, భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలో మూడవ అతి పెద్ద కార్ల మార్కెట్‌. అయినా సరే, దేశీయ ఆటో పరిశ్రమపై ఇప్పటివరకు భారీ రక్షణ ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై అధిక పన్నులు విధించడం వల్ల  యూరోపియన్‌ బ్రాండ్లు మన దేశంలో పెద్దగా విస్తరించలేకపోయాయి. టెస్లా CEO ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు ఆటో దిగ్గజాలు గతంలో ఈ అధిక సుంకాలపై విమర్శలు చేశారు.

కొత్త ప్రతిపాదన ప్రకారం, ఏటా సుమారు 2 లక్షల ఇంజిన్‌ కార్లపై 40 శాతం సుంకం మాత్రమే విధించే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు భారత్‌ తీసుకున్న అత్యంత దూకుడైన నిర్ణయం అవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఎలక్ట్రిక్‌ కార్లకు మాత్రం మినహాయింపు

దేశీయ కంపెనీలైన టాటా మోటార్స్‌, మహీంద్రా వంటి సంస్థలు ఎలక్ట్రిక్‌ వాహనాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, మొదటి ఐదేళ్ల పాటు ఎలక్ట్రిక్‌ కార్లను ఈ సుంకాల కోత నుంచి మినహాయించనున్నారు. ఐదేళ్ల తర్వాత EVలకూ ఇదే తరహా పన్ను తగ్గింపులు వర్తించే అవకాశం ఉంది.

ఎవరికి లాభం?

ఈ నిర్ణయంతో Volkswagen, Renault, Stellantis, అలాగే లగ్జరీ బ్రాండ్లు Mercedes-Benz, BMWకు పెద్ద ఊరట లభించనుంది. భారత్‌లో స్థానికంగా తయారీ ఉన్నప్పటికీ, అధిక దిగుమతి సుంకాల కారణంగా వీటి వృద్ధి పరిమితంగానే ఉంది.

సుంకాలు తగ్గితే, కార్ల ధరలు తగ్గే అవకాశం ఉండటంతో, ఈ కంపెనీలు కొత్త మోడళ్లను మన మార్కెట్‌లో పరీక్షించి, ఆపై స్థానిక తయారీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం, భారత కార్ల మార్కెట్‌లో యూరోపియన్‌ బ్రాండ్ల వాటా 4 శాతం కన్నా తక్కువే. అయితే 2030 నాటికి మార్కెట్‌ పరిమాణం 6 మిలియన్‌ యూనిట్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో Renault భారత్‌లో కొత్త వ్యూహంతో తిరిగి పుంజుకుంటుండగా, Volkswagen గ్రూప్‌ కూడా స్కోడా ద్వారా తదుపరి పెట్టుబడులకు సిద్ధమవుతోంది.

మొత్తంగా చూస్తే, EUతో ఈ వాణిజ్య ఒప్పందం భారత ఆటో మార్కెట్‌ను కొత్త దిశలోకి తీసుకెళ్లే కీలక మలుపుగా మారే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HF Deluxe vs Shine 100 vs Platina 100 : HF డీలక్స్,షైన్ 100, ప్లాటినా 100 బైక్స్‌లలో రోజువారీ వాడకానికి ఏది ఉత్తమం? తేడాను తెలుసుకోండి!
HF డీలక్స్,షైన్ 100, ప్లాటినా 100 బైక్స్‌లలో రోజువారీ వాడకానికి ఏది ఉత్తమం? తేడాను తెలుసుకోండి!
Car Care Tips in Summer: మండే ఎండల నుంచి కారును ఎలా కాపాడుకోవాలి? సింపుల్‌ టిప్స్ గురించి తెలుసుకోండి!
మండే ఎండల నుంచి కారును ఎలా కాపాడుకోవాలి? సింపుల్‌ టిప్స్ గురించి తెలుసుకోండి!
Kia India March 2026 Offers: కియా కార్లపై మార్చి ధమాకా ఆఫర్లు: సెల్టోస్, సోనెట్, కార్నివాల్‌పై రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్!
కియా కార్లపై మార్చి ధమాకా ఆఫర్లు: సెల్టోస్, సోనెట్, కార్నివాల్‌పై రూ. 1 లక్ష వరకు బెనిఫిట్స్!
Dhurandhar 2: ఢిల్లీ పోలీస్ సూపర్ ‘మీమ్’ ప్లాన్: ధురంధర్ 2 డైలాగ్‌తో హెల్మెట్ రూల్స్.. ఇంటర్నెట్‌లో రచ్చ
ఢిల్లీ పోలీస్ సూపర్ ‘మీమ్’ ప్లాన్: ధురంధర్ 2 డైలాగ్‌తో హెల్మెట్ రూల్స్.. ఇంటర్నెట్‌లో రచ్చ
Advertisement

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Embed widget