YCP Vs TDP: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడ ముత్యాలంపాడులో TDP, YCP వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. వైసీపీ టెంట్ ను టీడీపీ వర్గీయులు తీసేయడంతో వివాదం తీవ్రమైంది.

Vijayawada : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద వైసీపీ వర్గాలు నిర్వహిస్తున్న ధర్నాను స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తలు ప్రింటింగ్ ప్రెస్ సమీపంలో టెంట్లు వేసి ధర్నా చేపట్టారు. ఇది అనధికారికమని, ధర్నా చౌక్ వదిలి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్డుపై టెంట్లు వేశారని ఎమ్మెల్యో బోండా ఉమ మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలు వైసీపీ టెంట్లను తొలగించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ సెంట్రల్ సహా యాడికి, పొన్నూరులోనూ వైసీపీ ధర్నా చేస్తున్న టెంట్లు తొలగించారు. ఇరు వర్గాలు కుర్చీలు, టమాటాలు, కోడిగుడ్లు విసురుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మల్లాది విష్ణు
ప్రజాస్వామ్యంలో దీక్ష చేసే హక్కు లేదా? తమపై దాడులు ఎంత వరకు సబబు, రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డాపు వైసీపీ నేత మల్లాది విష్ణు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణించాయని కేంద్ర ప్రభుత్వం జ్యోక్యం చేసుకుని తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈ దాడులేంటని ప్రశ్నించారు.
బోండా ఉమ
ధర్నా చేసేందుకు ఇక్కడ అనుమతి లేదు, రోడ్డుపై టెంట్ వేసి ధర్నాలు ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే బోండా ఉమ. ముఖ్యమంత్రి చంద్రబాబుపై, మంత్రి లోకేష్ పై అనవసర విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు బోండా ఉమ. గత ప్రభుత్వం యువతను మోసం చేసింది..వాళ్లు కల్పించలేని ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చిందని స్పష్టం చేశారు బోండా ఉమ.
ట్రెండింగ్ వార్తలు























