అన్వేషించండి

CAEV Expo 2023: ఇండియాలో మరో ఆటో ఎక్స్‌పో - ఆసియాలోనే అతి పెద్దది, ఎప్పుడు? ఎక్కడో తెలుసా?

కనెక్టెడ్, అటానమస్, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఆసియాలో అతిపెద్ద ఎగ్జిబిషన్ కర్నాటకలో ప్రారంభం కానుంది. CAEV EXPO 2023 పేరుతో ఏప్రిల్ 13, 14 తేదీల్లో KTPO బెంగళూరులో ఆటో ఎక్స్‌ పో నిర్వహించనుంది.

KTPO (కర్ణాటక ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో కర్నాటకలో ఆసియాలోనే అతిపెద్ద ఆటో ఎక్స్ పో నిర్వహించబోతోంది. కనెక్టెడ్, అటానమస్, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన CAEV EXPO 2023 పేరుతో ఆటో షో ఏర్పాటుకాబోతోంది. బెంగళూరు వేదికగా ఏప్రిల్ 13, 14 తేదీల్లో ఈ ఎక్స్ పో జరగనుంది. ఈ షోలో 5,000 మంది ఆయా కంపెనీల ప్రతినిధులు, 150 మంది ఎగ్జిబిటర్లు, 60 మంది వక్తలు పాల్గొనబోతున్నారు.  ఇందులో తొమ్మిది సెషన్‌లు ఉంటాయి. పలు కీలకాంశాలు, లీడ్ టాక్‌లు, ప్యానల్ డిస్కషన్‌లు నిర్వహించనున్నారు. కనెక్ట్డ్,  అటానమస్, షేర్డ్, ఎలక్ట్రిక్, స్మార్ట్ మొబిలిటీకి సంబంధించిన ఉత్పత్తులను ఇందులో ప్రదర్శించనున్నారు. 

CAEV EXPO 2023లో కీలక అంశాలపై చర్చ   

CAEV EXPO 2023లో కాన్ఫరెన్స్‌ లో పలు కీలక అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది. కనెక్టెడ్ వెహికల్స్, అటానమస్ వెహికల్స్,  స్మార్ట్ & షేర్డ్ మొబిలిటీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటోమోటివ్ సైబర్‌ సెక్యూరిటీ, వెహికల్ డేటా మేనేజ్‌మెంట్, ఆటోమోటివ్ కోసం ఇంటెలిజెంట్ క్లౌడ్, మ్యాప్‌లు, నావిగేషన్, వాహనం ఇన్ఫోటైన్‌మెంట్, ADAS, ఫ్లీట్ టెలిమాటిక్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఆటోమోటివ్ M2M & IoT సొల్యూషన్స్, కనెక్టెడ్ ఇన్సూరెన్స్, ఆటోమోటివ్ సిమ్యులేషన్ & టెస్టింగ్, సస్టైనబుల్ మొబిలిటీపై చర్చలు నిర్వహించనున్నారు.

ఈ ఆటో షోకు సంబంధించి టయోటా కనెక్టెడ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ GK సెంథిల్ కీలక విషయాలు వెల్లడించారు. “మేము కనెక్టెడ్ మొబిలిటీ కేవలం లగ్జరీ కోసం మాత్రమే కాకుండా సమర్థవంతమైన రవాణా,  వినియోగదారులు కోరుకునే ఎక్స్ పీరియెన్స్ కు జోడించాలి అనుకుంటున్నాం. CAEV  ఎక్స్‌పో కనెక్టెడ్ మొబిలిటీ స్పేస్‌ లో భారతీయ పర్యావరణ వ్యవస్థను కనెక్ట్ చేయడానికి గొప్ప వేదిక కాబోతోంది. సమర్థవంతమైన, పర్యావరణ అనుకూలమైన, సందర్భోచిత సేవలను అందించే ప్రిడిక్టివ్ & AI/ML-ఆధారిత సాంకేతికతల గురించి ఈ షోలో ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను” అన్నారు. 

ఆటోమోటివ్ పరిశ్రమకు సవాళ్లు, పరివర్తనకు సంబంధించిన వివరాలు CAEV EXPO 2023లో కనిపించే అవకాశం ఉందని అశోక్ లేలాండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కనకసబాపతి సుబ్రమణియన్ తెలిపారు. సస్టైనబుల్ మొబిలిటీ, కనెక్టెడ్ వాహనాలతో పాటు మరెన్నో అంశాల గురించి ఈ షోలో తెలుసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు.  అశోక్ లేలాండ్ క్లీన్, సేఫ్టీ, స్మార్ట్ వాణిజ్య వాహనాలను అందించే మంచి పొజిషన్ లో ఉందన్నారు. టెక్నాలజీ విషయంలో సరికొత్త ముందగుడులు వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

వాహన టెలిమాటిక్స్ తప్పనిసరి

అటు అన్ని వాణిజ్య, ప్రజా రవాణా వాహనాలు తప్పనిసరిగా వాహన టెలిమాటిక్స్ కలిగి ఉండాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ఇది కనెక్టెడ్ వాహనాల వినియోగాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుంది. భారత ప్రభుత్వం అన్ని కొత్త వాహనాలలో ADAS సిస్టమ్‌లను చేర్చడాన్ని తప్పనిసరి చేస్తోంది. ప్రభుత్వం నేషనల్ ఎలక్ట్రిక్ వెహికల్ మిషన్ 2030తో 2030 నాటికి భారతదేశం 100 శాతం EV దేశంగా మారాలని భావిస్తోంది. భారతదేశంలో 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. 5G కార్లు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్, మౌలిక సదుపాయాలతో కమ్యూనికేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. మరింత సురక్షితమైన డ్రైవింగ్ కు దోహదపడనుంది.

ఎలక్ట్రిక్ వాహనాల్లో క్లీన్ ఎనర్జీని విస్తృతి పెంచాలి  

క్లీన్ మొబిలిటీపై దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉందని వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ అగర్వాల్ వెల్లడించారు. క్లీన్ ఎనర్జీ టెక్నాలజీని  ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలను విస్తృత పర్చడానికి ఉపయోగించేలా చూస్తే బాగుంటుందన్నారు. CAEV EXPO ఆటో పరిశ్రమతో పాటు వినియోగదారులకు కనెక్టెడ్, స్వయంప్రతిపత్తమైన,  ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన చాలా విషయాలను ఇందులో తెలుసుకునే అవకాశం ఉందన్నారు. 

 Read Also: సామాన్యుల కోసం ‘బజాజ్ క్యూట్’ - మారుతీ ఆల్టోకు గట్టిపోటీ, ధర ఎంతంటే..

టాప్ హెడ్ లైన్స్

526 km లాంగ్‌ రేంజ్‌తో రాబోతున్న కియా సైరస్ ఎలక్ట్రిక్‌ కారు - తెలుగు రాష్ట్రాల్లో ధర, బ్యాటరీ ఆప్షన్లు, ఫీచర్లు తెలుసుకోండి
కియా సైరస్ EV వచ్చేస్తోంది - ఎన్ని వేరియంట్లు ఉన్నయి? వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఇస్తారు? పూర్తి వివరాలు
ఏథర్ రిజ్టాకు LFP బ్యాటరీ ఆప్షన్‌ - కొత్త బ్యాటరీ ప్యాక్‌లు, 900W ఛార్జర్‌తో కీలక అప్‌డేట్
యూత్‌ మెచ్చిన ఏథర్ స్కూటర్లకు ఫ్రెష్‌ అప్‌డేట్‌ - చిన్న బ్యాటరీలతోనే సేమ్‌ రేంజ్, ఛార్జింగ్‌లో మరింత వేగం!
మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ 2026లో ఏం కొత్తగా మారనుంది? కొత్త ఇంజిన్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు! రేటు ఎంత ఉండొచ్చు?
మారుతి బ్రెజ్జా 2026 మోడల్‌ ఎంట్రీకి మరో 10 రోజులు కూడా లేదు - కొత్త ఇంజిన్‌తో పాటు మిడిల్‌క్లాస్‌ మెచ్చే ఫీచర్లు!
మీ డ్రైవింగ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే 8 స్మార్ట్ కార్ గాడ్జెట్లు - వీటిని ఒక్కసారి ట్రై చేస్తే ఇక వదిలిపెట్టరు!
మీ కారులో ఈ స్మార్ట్ గాడ్జెట్లు ఉన్నాయా? సేఫ్టీ నుంచి స్టైల్ వరకు డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ మారిపోతుంది!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget