అన్వేషించండి

FASTag Rules India :ఫాస్ట్‌ట్యాగ్ వినియోగంలో ఈ నియమాలు మీకు తెలుసా? ఈ పొరపాట్లు చేస్తే రెట్టింపు బాదుడే!

FASTag Rules India :జాతీయ రహదారులపై ప్రయాణించే వారు ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం. ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు గమనించాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలివే.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విండ్‌స్క్రీన్‌కు ఫాస్ట్‌ట్యాగ్ అంటించకపోతే రెట్టింపు టోల్ వసూలు.
  • రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు సగం టోల్ మాత్రమే చెల్లించాలి.
  • యూపీఐ చెల్లింపులకు ప్రోత్సాహకంగా కొంత రాయితీ ఇస్తారు.
  • సమస్యలు, ఫిర్యాదుల కోసం 1033 నంబర్‌కు కాల్ చేయండి.

FASTag Rules India :జాతీయ రహదారులపై ప్రయాణించే వారు ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం. ట్యాగ్ అంటించకపోయినా, రోడ్డు పనులు జరుగుతున్నా టోల్ ధరల్లో మార్పులు ఉంటాయి.  ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులు గమనించాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలివే.

ఇండియాలోని జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు ఫాస్ట్‌ ట్యాగ్ ఇప్పుడు అనివార్యంగా మారింది. ఆర్‌ఎఫ్‌ఐడీ (RFID) సాంకేతికతతో పనిచేసే ఈ ట్యాగ్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. టోల్ ప్లాజా మీదుగా వాహనం వెళ్లేటప్పుడు ఆటోమేటిక్‌గా అమౌంట్ కట్ అవుతుంది. ప్రతి లావాదేవీకి సంబంధించి మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. అయితే చాలా మందికి తెలియని కొన్ని కీలక నిబంధనల గురించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) క్లారిటీ ఇచ్చింది.

విండ్‌స్క్రీన్‌కు ట్యాగ్ అంటించకపోతే రెట్టింపు ఫీజు

చాలామంది ఫాస్ట్‌ట్యాగ్‌ను కారు ముందు అద్దానికి అంటించకుండా చేతితో చూపిస్తుంటారు. ఇలా చేయడం వల్ల టోల్ ప్లాజాల వద్ద స్కానింగ్ ఆలస్యమవుతుంది. దీనిని అరికట్టేందుకు NHAI కఠిన నిబంధన తెచ్చింది. వాహనం లోపలి వైపు నుంచి అద్దానికి ట్యాగ్‌ను సరిగ్గా అంటించకపోతే, ఆ వాహనం నుంచి రెట్టింపు టోల్ ఫీజు వసూలు చేస్తారు. ఈ నిబంధన వల్ల ఇతర వాహనదారులకు అనవసరమైన ఆలస్యం కలగకుండా ఉంటుంది.

నిర్మాణ సమయంలో సగం టోల్ మాత్రమే

జాతీయ రహదారులపై మరమ్మతులు లేదా రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నప్పుడు ప్రయాణీకులకు కలిగే అసౌకర్యాన్ని కేంద్ర రహదారి రవాణా శాఖ గుర్తించింది. రహదారిని నాలుగు లేదా ఆరు లేన్లుగా మార్చే పనులు సాగుతున్న సమయంలో, పాత టోల్ ధరలో కేవలం 50 శాతం మాత్రమే వసూలు చేయాలి. ఉదాహరణకు అక్కడ టోల్ ధర రూ.50 ఉంటే, నిర్మాణం పూర్తయ్యే వరకు వాహనదారులు రూ.25 చెల్లిస్తే సరిపోతుంది.

యూపీఐ చెల్లింపులపై డిస్కౌంట్

ఫాస్ట్‌ట్యాగ్ లేకుండా టోల్ లేన్‌లోకి ప్రవేశించే వాహనాలకు నగదు రూపంలో చెల్లిస్తే రెట్టింపు ధర వసూలు చేస్తారు. ఒకవేళ వాహనదారులు యూపీఐ (UPI) ద్వారా చెల్లించాలని భావిస్తే, అప్పుడు వర్తించే ఫీజులో 1.25 రెట్లు అధికంగా వసూలు చేస్తారు. నగదు లావాదేవీలను తగ్గించి డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఫిర్యాదుల కోసం ప్రత్యేక సదుపాయం

ప్రయాణంలో తలెత్తే సమస్యలు లేదా ఫిర్యాదుల కోసం వాహనదారులు 1033 హెల్ప్‌లైన్ నంబర్‌కు డయల్ చేయవచ్చు. అలాగే 'రాజ్‌మార్గ్‌యాత్ర' యాప్ ప్రయాణీకులకు డిజిటల్ తోడుగా నిలుస్తుంది. ఇందులో రహదారి వివరాలు, సమీపంలోని ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, వాతావరణ సమాచారం వంటి వివరాలు లభిస్తాయి. రహదారి భద్రత, పారదర్శకత కోసం ఈ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించడం అవసరం.

Frequently Asked Questions

ఫాస్ట్‌ట్యాగ్‌ను విండ్‌స్క్రీన్‌కు సరిగ్గా అంటించకపోతే ఏమి జరుగుతుంది?

వాహనం లోపలి వైపు నుంచి విండ్‌స్క్రీన్‌కు ట్యాగ్‌ను సరిగ్గా అంటించకపోతే, రెట్టింపు టోల్ ఫీజు వసూలు చేస్తారు.

రోడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎంత టోల్ చెల్లించాలి?

రోడ్డు విస్తరణ లేదా మరమ్మతులు జరుగుతున్నప్పుడు, పాత టోల్ ధరలో కేవలం 50 శాతం మాత్రమే వసూలు చేస్తారు.

యూపీఐ (UPI) ద్వారా చెల్లింపులపై ఏదైనా డిస్కౌంట్ ఉందా?

ఫాస్ట్‌ట్యాగ్‌ లేనివారు యూపీఐ ద్వారా చెల్లిస్తే, వర్తించే ఫీజులో 1.25 రెట్లు అధికంగా వసూలు చేస్తారు.

ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన ఫిర్యాదులను ఎక్కడ చేయాలి?

ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన సమస్యల కోసం 1033 హెల్ప్‌లైన్ నంబర్‌కు డయల్ చేయవచ్చు లేదా 'రాజ్‌మార్గ్‌యాత్ర' యాప్‌ను ఉపయోగించవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

526 km లాంగ్‌ రేంజ్‌తో రాబోతున్న కియా సైరస్ ఎలక్ట్రిక్‌ కారు - తెలుగు రాష్ట్రాల్లో ధర, బ్యాటరీ ఆప్షన్లు, ఫీచర్లు తెలుసుకోండి
కియా సైరస్ EV వచ్చేస్తోంది - ఎన్ని వేరియంట్లు ఉన్నయి? వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఇస్తారు? పూర్తి వివరాలు
ఏథర్ రిజ్టాకు LFP బ్యాటరీ ఆప్షన్‌ - కొత్త బ్యాటరీ ప్యాక్‌లు, 900W ఛార్జర్‌తో కీలక అప్‌డేట్
యూత్‌ మెచ్చిన ఏథర్ స్కూటర్లకు ఫ్రెష్‌ అప్‌డేట్‌ - చిన్న బ్యాటరీలతోనే సేమ్‌ రేంజ్, ఛార్జింగ్‌లో మరింత వేగం!
మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ 2026లో ఏం కొత్తగా మారనుంది? కొత్త ఇంజిన్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు! రేటు ఎంత ఉండొచ్చు?
మారుతి బ్రెజ్జా 2026 మోడల్‌ ఎంట్రీకి మరో 10 రోజులు కూడా లేదు - కొత్త ఇంజిన్‌తో పాటు మిడిల్‌క్లాస్‌ మెచ్చే ఫీచర్లు!
మీ డ్రైవింగ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే 8 స్మార్ట్ కార్ గాడ్జెట్లు - వీటిని ఒక్కసారి ట్రై చేస్తే ఇక వదిలిపెట్టరు!
మీ కారులో ఈ స్మార్ట్ గాడ్జెట్లు ఉన్నాయా? సేఫ్టీ నుంచి స్టైల్ వరకు డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ మారిపోతుంది!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget