అన్వేషించండి

Shani Gochar 2025: 2025 ఏప్రిల్ నుంచి ఈ 3 రాశులవారికి కొత్త కష్టాలు మొదలు!

Saturn Transit in Pisces: కొత్త ఏడాదిలో శని మీనరాశిలో ప్రవేశించబోతున్నాడు.. ఈ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. మూడు రాశులవారికి కొత్త కష్టాలు మొదలవుతాయి

Shani Gochar 2025: రెండున్నరేళ్లకోసారి రాశి మారే శని 2024 మొత్తం కుంభ రాశిలోనే పరివర్తనం చెందాడు. 2025లో కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్యశాస్త్రంలో శని సంచారాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తారు.

శని మంచి స్థానంలో ఉంటే అన్నీ శుభాలే..కానీ.. శని జన్మంలో, నాలుగు, ఎనిమిది, దశమం స్థానాల్లో ఉంటే ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అని చెబుతారు. ఈ సమయంలో ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు ఉండవు, ఏదో ఒక అనారోగ్యం వెంటాడుతూనే ఉంటుంది. చేపట్టిన పనులన్నీ పూర్తైనట్టే ఉంటాయి కానీ ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోతాయి. సమయానికి డబ్బు చేతిలో లేకపోవడం, ఊహించని ఖర్చులు ఉంటాయి. మంచి మాట్లాడినా చెడుగానే మారుతుంది. కుటుంబంలో, ఉద్యోగం, వ్యాపారంలో చికాకులుంటాయి. అయితే శని సంచారం శుభస్థానంలో లేనప్పటికీ శుక్రుడు, బృహస్పతి సంచారం బావుంటే శని ప్రభావం ఉన్నప్పటికీ సక్సెస్ మీ సొంతం అవుతుంది, ఇబ్బందులను ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు.  

2025 మార్చి వరకూ కుంభ రాశిలో సంచరించే శని ఆ తర్వాత నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం చాలా రాశులవారికి మంచి చేస్తుంది. మకర రాశివారికి శని నుంచి విముక్తి లభిస్తుంది. మేషం, సింహం, ధనస్సు రాశులవారికి కొన్ని ఇబ్బందులు తీసుకొస్తోంది.

Also Read: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!

మేష రాశి

2025లో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.  శని మీనంలోకి ప్రవేశించిన తర్వాత ఆ ప్రభావం మీపై తీవ్రంగానే ఉంటుంది. మీకు 12వ స్థానంలో శని సంచారం వల్ల వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదొడుకులు తప్పవు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులుంటాయి. నిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటుంది. మిత్రులే శత్రువులు అవుతారు. ప్రత్యర్థులపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి.  వివాదాలకు దూరంగా ఉండాలి. 

సింహ రాశి

2025 మార్చి తర్వాత సింహరాశి వారికి కొత్త కష్టాలు మొదలవుతాయి. మీ రాశినుంచి శని అష్టమంలో సంచరిస్తున్నాడు. ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లినప్పటికీ శని ప్రభావం మిమ్మల్ని వెనక్కు లాగుతుంది. ఆర్థిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలుంటాయి. ఉద్యోగంలో సవాళ్లు తప్పవు. వ్యాపారం ఒడిదొడుకుల మధ్య సాగుతుంది. శత్రుబాధలు, ఊహించని నష్టాలు తప్పవు.

Also Read:  ధనస్సు రాశిలోకి సూర్యుడు.. ఈ 3 రాశులవారికి అన్నింటా విజయం, ఐశ్వర్యం, ఆరోగ్యం!

ధనస్సు రాశి

ధనస్సు రాశివారిపై కూడా 2025లో శని ప్రభావం ఉంటుంది. మీ రాశి నుంచి నాలుగో స్థానంలో శని సంచారం ఉంటోంది. ఈ సమయంలో ఊహించని సమస్యలు చుట్టుముడతాయి. న్యాయపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉండవు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

శని నుంచి ఎవరూ తప్పించుకోలేరు..కానీ ఆ ప్రభావం తగ్గించుకోవచ్చు. శనివారం రోజు శనికి తైలాభిషేకం, జపాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా శని శ్రమకారకుడు..సోమరితనం, బద్ధకాన్ని అస్సలు సహించడు. అందుకే కష్టపడడం, శ్రమకారకులైన చీమలకు ఆహారం వేయడం , మూగజీవాలకు నీటిని అందించడం ద్వారా శని ప్రభావం తగ్గుతుందని పండితులు చెబుతారు 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు

వీడియోలు

Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam
Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
Virat Kohli:విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
AP CM Chandrababu: పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
Guntur Latest News:గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
Embed widget