By: ABP Desam | Updated at : 04 Mar 2022 02:43 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కురుపాం బీసీ హాస్టల్ లో విద్యార్థులకు పాము కాటు
BC Hostel snake Bite: విజయనగరం జిల్లా కురుపాం(Kurupam) ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో పాము కాటుకు విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటనపై బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ(Chelluboyina Srinivas Venugopala krishna) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్(BC Welface Residential School) లో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. పాము కాటుకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అసలేం జరిగిందంటే?
విజయనగరం జిల్లా కురుపాం మండలం కేంద్రంలో గురువారం అర్ధరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. బీసీ రెసిడెన్షియల్ హాస్టల్ లో పాముకాటుకు గురై ఓ విద్యార్థి చనిపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. మరో ఇద్దరు చిన్నారులు కూడా పాము కాటు(Snake Bite) గురయ్యారు. మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో రాత్రి పూట నిద్రపోతున్న ముగ్గురు విద్యార్థులను పాము కాటేసింది. పాము కాటుతో ఈ ముగ్గురు విద్యార్థులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది పాముకాటుకు గురైన విద్యార్థులను 108 అంబులెన్స్ సహాయంతో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విజయనగరం(Vizianagaram)లోని తిరుమల ఆస్పత్రికి తరలించారు. పాముకాటుకు గురైన ముగ్గురు విద్యార్థులు ఎనిమిదో తరగతి చదువుతున్న మంతిని రంజిత్, ఈదుబుల్లి వంశీ జీగారం, వంగపండు నవీన్ లుగా గుర్తించారు. ముగ్గురు విద్యార్థులు అపస్మారక స్థితిలో ఉండటంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Read Also : AP CM YS Jagan: పోలవరం పరిశీలనకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సీఎం జగన్
ఒక విద్యార్థి మృతి, మరో విద్యార్థి పరిస్థితి సీరియస్
పాము కాటుకు గురైన ముగ్గురు విద్యార్థుల్లో మంతిని రంజిత్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ చనిపోయినట్లు జాయింట్ కలెక్టర్ డా.మహేష్ కుమార్ పేర్కొన్నారు. పాముకాటుకు గురైన వారిలో మరో విద్యార్థిని వెంటిలెటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. మరో విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి(Pushpa Srivani) పరామర్శించారు.
Breaking News Live Updates: బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు, కేఏ పాల్ ఫైర్
Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
Mla Kotamreddy Sridhar Reddy : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఛాతిలో నొప్పి, చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు!
Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ - టీడీపీ నిర్ణయం !
NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
KTR Davos Tour : దావోస్ సదస్సు ద్వారా తెలంగాణకు రూ. 4200 కోట్ల పెట్టుబడులు - చివరి రోజూ కేటీఆర్ బిజీ మీటింగ్స్ !
AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !
US Monkeypox Cases : అమెరికాలో 9 మంకీపాక్స్ కేసులు - వేగంగా విస్తరిస్తోందని అగ్రరాజ్యం ఆందోళన