అన్వేషించండి

Srikakulam News: మరో రైలు ఉద్యమానికి సిద్ధమవుతున్న నౌపడ వాసులు- ఇంతకీ నాడు ఏం జరిగింది? నేడు ఎందుకీ పోరుబాట?

Srikakulam: సిక్కోలు గడ్డపై జరిగిన పోరాటాలు ప్రజా పోరాటాలకు దిశానిర్దేశం చేశాయి. పలు పోరాటాలు శ్రీకాకుళం చరిత్ర పుటల్ని పోరు కథలతో ఎరుపెక్కించాయి. అలాంటి మరో ఉద్యానికి ఆందోళనకారులు సిద్ధమవుతున్నారు.

Srikakulam News: వామపక్షాలు, విప్లవ పార్టీలు కలిపి ఇతర అన్ని రాజకీయపక్షాల్ని, ప్రజాసంఘాల్ని కలుపుకొని విజయపథంలో నిలిచిన ఉద్యమం నౌపడా రైలు ఉద్యమం. నౌపడా- గుణుపూర్ బ్రాడ్ గేజ్ మార్గం నిర్మాణంతోపాటు నౌపడ రైల్వేస్టేషన్లో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లూ నిలుపుదల చేయాలని కొనసాగిన మహా ఉద్యమం ఐదు సంవత్సరాల కాలంలో మహోద్యమంగా మారింది.

నౌపడ రైలు ఉద్యమం ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల ఐక్యతను చాటి చెప్పింది. నౌపడ గుణుపూర్ మార్గంలో ఎత్తివేసిన నేరోగేజ్ రైలు మార్గాన్ని బ్రాడ్జ్ గా మార్చింది. నౌపడాలో మెయిల్, ఈస్ట్కోస్ట్, హీరాఖండ్ రైళ్ల హాల్డ్‌ని తీసుకొచ్చింది. శ్రీకాకుళంలో ఆగిపోయే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను పలాస వరకూ పరుగెత్తించింది. (ఆ తరువాత భువనేశ్వర్ వరకు పొడిగించారు). అన్నింటి కంటే ముఖ్యంగా పాలక రాజకీయ పక్షాల స్వార్థం కోసం ప్రజాఉద్యమాలను ఫణంగా పెట్టకుండా, ప్రజాతంత్ర ఉద్యమాల్ని నడపగలిగే నాయకత్వముంటే. ఆ ఉద్యమాలు విజయం సాధించి తీరుతాయని రుజువు చేసింది. పోలీసుల క్రూర విధానాలు, లాఠీల ఖర్కశత్వం ప్రజల్ని అణచలేవని భవిష్యత్తు తరానికి చాటి చెప్పింది. ఇన్ని ఘనమైన పాఠాల్ని ప్రజలకందించిన చారిత్రక రైలు ఉద్యమాన్ని 1989-1994 మధ్య ఆంధ్రా-ఒడిశా ఐక్య కార్యాచరణ సమితి అడుగడుగునా అణచివేతను ఎదుర్కొంటూ ముందుకు తీసుకువెళ్లింది..

Srikakulam News: మరో రైలు ఉద్యమానికి సిద్ధమవుతున్న నౌపడ వాసులు- ఇంతకీ నాడు ఏం జరిగింది? నేడు ఎందుకీ పోరుబాట?

కనీస సౌకర్యాలు నిల్
ప్రస్తుతం నౌపడ - గుణుపూర్ మార్గంలో నడుస్తున్న రైళ్లను ఒకవైపు పూరీ, మరోవైపు విశాఖ వరకూ పొడిగించారు. నష్టాలొస్తాయనే సాకుతో ఎత్తివేసిన ఈ మార్గం ప్రస్తుతం నెలకు రూ.26 లక్షలు ఆదాయం తెస్తూ ప్రధాన ఆదాయ ఉపమార్గంగా నిలిచింది. నౌపడా జంక్షన్ ప్రస్తుతం జిల్లాలో అతి రద్దీ అయిన ఏకైక కూడలి స్టేషన్‌గా మారిపోయింది. 

నౌపడా గుణుపూర్ మార్గం స్టేషన్లలో కనీస సౌకర్యాలు కొరవడ్డాయని, అనేక స్టేషన్లకు ప్లాట్‌ఫారాలు నిర్మించలేదని ఆంధ్రా-ఒడిశా ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ పేడాడ పరమేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుణుపూర్-రాయఘడమార్గంలో సర్వే చేసినప్పటికీ పనులు ప్రారంభించలేదని, తక్షణమే గుణుపూర్ మార్గాన్ని రాయగడకు పొడిగించాలని ఎఒజెఎసి డిమాండ్ చేస్తోంది. 

పాలకపక్షం తమ గోడు వినకపోతే మరోసారి రైలు ఉద్యమానికి సిద్ధమవుతామని ఎఒజెఎసి కన్వీనర్ పేడాడ పరమేశ్వరరావు హెచ్చరించారు. ప్రయాణికుల సౌకర్యాల దృష్ట్యా రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

అసలు అప్పుడు ఏం జరిగింది

నౌపడా రైలు ఉద్యమాన్ని కాకాలు తీరిన పోరాట యోధులు మహోద్యమంగా పేర్కొన్నారు. 1991 జనవరి నెలలో ఆంధ్రా-ఒడిశా ప్రముఖులు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యంతో ఆంధ్రా-ఒడిశా ఐక్య కార్యాచరణ సమితి ఏర్పడింది. కార్యాచరణ సమితికి అప్పటికే ఎపిసిఎల్సి జిల్లా అధ్యక్షునిగా ఉన్న పేడాడ పరమేశ్వరరావు కన్వీనర్గా ఎన్నికయ్యారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బిజెపి, సిపిఐ, సిపిఎం (ఎంఎల్), తెలుగుదేశం పార్టీ, ప్రజామిత్ర, ఎపిసిఎల్సి, ఒపిడిఆర్లతోపాటు అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పోరాట పంథాను ఎంచుకున్నాయి. వేలాదిమంది ప్రజలు ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు రైలు పట్టాలెక్కారు.. ఊహించని ఈ పరిణామానికి ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అయింది. రోజులు తరబడి రైలు ఉద్యమం కొనసాగించారు. 

Srikakulam News: మరో రైలు ఉద్యమానికి సిద్ధమవుతున్న నౌపడ వాసులు- ఇంతకీ నాడు ఏం జరిగింది? నేడు ఎందుకీ పోరుబాట?

1992 ఏప్రిల్ 14న నౌపడా స్టేషన్‌కు మూకుమ్మడిగా సుమారు 20వేల మంది ఆంధ్రా-ఒడిశా ఉద్యమకారులు చేరుకున్నారు. రైలు పట్టాలపై 'టెంట్లు' వేసి వంటలు చేసుకుంటూ ఉద్యమాన్ని సాగించారు. అప్పటికే ఉద్యమ నాయకులపై పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసి జైల్లోకి నెట్టిన పాలక పక్షం ఆ రోజు మరోసారి కన్నెర్ర చేసింది. హౌరా-చెన్నై మార్గంలో 24 గంటలపాటు రైళ్లు రద్దయ్యాయి. 

నౌపడాలో ఏమి జరుగుతోంది, ఆందోళనకారులు రైలు సమస్యల పరిష్కారానికి 24 గంటలూ పట్టాలపై కూర్చొని, వంటలు చేస్తూ నిరవధిక రోకో సిద్ధం కావడం వెనుక మీ వైఫల్యం ఏంటని ప్రతిపక్షాలు పార్లమెంట్లో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీని ఉతికి ఆరేశాయి. దీంతో రెచ్చిపోయిన కేంద్రం నౌపడా స్టేషన్‌లో కర్ఫ్యూ ప్రకటించింది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రభుత్వం తీరుతో జనం మరింత రెచ్చిపోయారు. వారికి అండగా నాయకులు ముందు వరుసలో నిల్చొన్నారు. స్థానిక రైల్వే ఆర్పిఎఫ్. రిజర్వ్ సిఆర్పిఎఫ్ సిబ్బంది కూడా ఆందోళనకారులపై విరుచుకుపడి లారీఛార్జీ జరిపాయి. ఈ ఘటనలో వందల మంది గాయపడగా, సమితి కన్వీనర్ పేడాడ పరమేశ్వరరావు, కార్యదర్శి వర్గం సభ్యుడు ఉప్పాడరామారావులకు బలమైన గాయాలయ్యాయి.వీరితోపాటు ఒడిశాకు చెందిన రాంగోపాల్, జొన్నసుభాష్ చంద్రబోస్, గోపీనాథ్ పండా తదితర 18 మంది. ప్రముఖులపై 307 (ఐపిసి) వంటి బలమైన సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. 

Also Read: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం

ఉద్యమకాలంలో సమితి కన్వీనర్ పరమేశ్వరరావుతోసహా 36 మందిపై నాలుగు బలమైన కేసుల్ని పోలీసులు నమోదు చేశారు. పరమేశ్వరరావు నాలుగు సార్లు అరెస్టయి 148 రోజులు జైలులో గడిపారు. 1993 జనవరి 25న రాత్రి అతన్ని పోలీసులు అనధికారికంగా అదుపులోకి తీసుకున్న వెంటనే రాత్రి 2 గంటలకు ప్రజానీకం రైలు పట్టాలెక్కి ఉద్యమ శంఖం పూరించారు. చేసేది లేక జనవరి 26న సాయంత్రం పోలీసులు పరమేశ్వరరావును విడుదల చేశారు. 1993 ఏప్రిల్లో రైల్వే అధికారులు నౌపడా రైల్వేస్టేషన్లో ఎత్తి వేసిన ట్రైన్లకు హాల్ట్‌లు పునరుద్ధరించారు. ఆ తరువాత ఉద్యమ సెగలు తగ్గినందున 1994 అక్టోబర్లో నౌపడా గుణుపూర్ మార్గాన్ని బ్రాడ్ గేజ్ గా మార్చు చేస్తామని కేంద్రం పార్లమెంట్లో స్పష్టమైన ప్రకటన చేసింది.

నౌపడ గుణుపూర్ మార్గం చరిత్ర
1898లో తన సొంత వినియోగం కోసం అప్పటి పర్లాఖిమిడి రాజు కృష్ణచంద్ర గజపతి నౌపడా- గుణుపూర్ రైలు మార్గాన్ని నిర్మించారు. మైసూరు రాజులకు సామంత రాజ్యంగా కొనసాగే పర్లాఖిమిడి సంస్థానం నుంచి ఆయన నౌపడా వచ్చి, అక్కడ తన అతిథిగృహంలో విశ్రాంతి తీసుకొని హౌరా-చెన్నై రైలు మార్గంలో మైసూరు వెళ్లేవారు. ఆవిరి యంత్రాన్ని పోలిన నౌపడా పర్లాఖిమిడి రైలు ఇంజన్లో ముందుగా సకల సౌకర్యాలతో రాజు కుటుంబీకు లు ప్రయాణించేందుకు ఒక సెలూన్ (కంపార్ట్మెంట్), తన పరివారం, వంట సిబ్బంది ప్రయాణించేందుకు రెండు సెలూన్లు ఉండేవి. రైలు ఇంజనుతోపాటు సెలూన్లు. నౌపడాలో ఆయన అతిథి గృహానికి వెళ్లిపోయే విధంగా రైలు పట్టాలుండేవి. ఈ ఇంజను. నడిచేందుకు పర్లాభిమిడి- నౌపడా మధ్య 226 మంది కూలీలు తమ శ్రమని ధారపోసేవారు. వారు రైల్లు బయల్దేరే వర్తమానం వచ్చేసరికి మార్గమధ్యలో తమకు కేటాయించిన ప్రాంతంలో అడవి కలప, నీరుతో సిద్ధంగా ఉండేవారు. కలపతో మంటను మండించి మరిగించిన నీరు ఆవిరయితే నేరోగేజ్ రైలు కొండల నడుమ నుంచి పరుగులు తీసేది. 

Also Read: సినిమా చూసి థియేటర్‌లోనే చోరీకి ప్లాన్ చేసే ముఠా- 3 రాష్ట్రాల్లో తప్పించుకొని తిరిగే కేటుగాళ్లను పట్టుకున్న శ్రీకాకుళం పోలీసులు

1898 నుంచి 1903 వరకూ ఈ రైలు ఇంజన్ డ్రైవర్లగా ఇంగ్లండ్ వారే కొనసాగేవారు. సెలూన్ నిర్మాణం, రైలు పట్టాలు వేయడం, వాటి పర్యవేక్షణ బాధ్యతల్ని కూడా బ్రిటీష్ ఇంజినీర్లు చూసుకున్నారు. ప్రజా రవాణాకు, ఆటవీ ఉత్పత్పులకు అందుబాటుగా రైలు మార్గాన్ని వినియోగిస్తే జనరంజకంగా ఉంటుందని కృష్ణచంద్ర గజపతి భావించి 1906లో పర్లాఖిమిడి నుంచి గుణుపూర్ వరకూ ఈ మార్గాన్ని పొడిగించారు.1906లో గుణుపూర్-నౌపడామధ్య నేరోగేజ్ మార్గంలో ప్రజా రవాణా ప్రారంభమైంది. కృష్ణచంద్ర గజపతి చేసిన ఈ మహాత్కార్యంతో ఆయన ఈ ప్రాంత ప్రజలకు దేవుడయ్యారు.

గుణుపూర్- నౌపడా మధ్య విరివిగా లభించే అటవీ ఉత్పత్తులను ప్రజలు రవాణా చేస్తూ రైళ్లపై ఆధారపడి బతికే పరిస్థితి బలపడింది. 1911 నుంచి ఈ మార్గంలో అప్పటి రాజ సంస్థానం సరుకులు రవాణా కోసం పార్సిల్ సర్వీసును అదనంగా ప్రారంభించి ప్రజలకు మరింత చేరువైంది. స్వాతంత్య్రం అనంతరం పరిస్థితులు మారిపోయాయి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Andhra King Taluka Collections : 'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
I Bomma Ravi Piracy Sites Issue Explained | మనం చూసే ఒక్క సినిమాతో.. లక్షల కోట్ల నేర సామ్రాజ్యం బతికేస్తోంది | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Andhra King Taluka Collections : 'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
SUVs to launch in December 2025: మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
Pilla Song - Dhandoraa: లవర్ బాయ్‌గా రవికృష్ణ... మనికా చిక్కాలతో స్టెప్పులు... 'దండోరా'లో 'పిల్లా...' సాంగ్ చూశారా?
లవర్ బాయ్‌గా రవికృష్ణ... మనికా చిక్కాలతో స్టెప్పులు... 'దండోరా'లో 'పిల్లా...' సాంగ్ చూశారా?
Most Sixes In ODIs Rohit Sharma: సిక్సర్ల కింగ్ రోహిత్ శర్మ.. వన్డేలలో అత్యధిక సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు
సిక్సర్ల కింగ్ రోహిత్ శర్మ.. వన్డేలలో అత్యధిక సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు
Jobs: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
Embed widget