అన్వేషించండి

Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం

సీఎం చంద్రబాబు ఆదేశాలతో డ్రోన్లను వినియోగించి గంజాయి సాగును గుర్తించారు. అక్కడికి వెళ్లిన అధికారులు 8 ఎకరాల గంజాయి తోటను ధ్వంసం చేసి వారికి అవగాహన కల్పించారు.

Alluri Sitharama RajuDistrict | పెదబయలు: ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి తోట కనిపిస్తే కొట్టేయండి లేదా కాల్చేయండి అని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా (ASR District) సాగు చేస్తున్న 8 ఎకరాల గంజాయి తోటల్ని అధికారులు ధ్వంసం చేశారు. అల్లూరి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చుతామని పోలీసులు చెబుతున్నారు. ఎక్కడైనా గంజాయి (Cannabis) సాగు చేస్తున్నట్లు కనిపించినా, గంజాయి అక్రమ రవాణా గురించి తెలిసినా, డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించినా వెంటనే 1972 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. 

డ్రోన్ల ద్వారా గుర్తించిన పోలీసులు
నేరాల నియంత్రణకు డ్రోన్లు, టెక్నాలజీ వినియోగించాలని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అధికారులకు సూచించారు. ఈ క్రమంలో పెదబయలు మండలంలోని కంతుర్లకు చేరుకున్న అధికారులు డ్రోన్ల సాయంతో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. గంజాయి సాగు నివారించేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ ఐజీ రవికృష్ణ, ఎస్పీ అమిత్ బర్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, అటవీశాఖ అధికారులు పాతపాడు గ్రామంలో 8 ఎకరాల్లో సాగవుతున్న గంజాయి (కానబిస్) తోటను ధ్వంసం చేశారు. జిల్లాలో కొన్ని రోజుల కిందట సైతం డ్రోన్ల ద్వారా పలుచోట్ల గంజాయి సాగు గుర్తించిన అధికారులు తోటల్ని ధ్వంసం చేశారు.


Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం

ఇది అక్రమ సాగు నియంత్రణ కోసం చేపట్టిన ఆపరేషన్. ఈ ఆపరేషన్లో డ్రోన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేవలు, A1 టూల్స్ ను ఉపయోగించి ఈ గంజా సాగులను గుర్తించి, వాటిని నాశనం చేయడంలో సహకరించాయని రవికృష్ణ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకూ మొత్తం 2,000 ఎకరాలను డ్రోన్ సర్వే బృందం పర్యవేక్షించింది. డ్రోన్ల ద్వారా గంజాయి సాగును గుర్తించి, గంజాయి తోటల్ని నాశనం చేయడం తమ లక్ష్యమన్నారు. అనంతరం వ్యక్తిగతంగా పాతపాడు గ్రామ ప్రజలతో సమావేశమై గంజాయి సాగువల్ల కలిగే దుష్ప్రరిణామాలు వివరించారు. వీటి కేసులలో ఇరుక్కుని జైలుకు వెళితే జీవితం నాశనం అవుతుందని వారికి నష్టాలపై అవగాహన కల్పించారు.

గిరిజనులతో ప్రతిజ్ఞ చేయించిన అధికారులు

గిరిజనులు చేసే గంజా సాగు వల్ల గ్రామంతో పాటు సమాజం భవిష్యత్తుకు ఏర్పడే హానిని ప్రస్తావించారు. గిరిజనులు, గ్రామస్తులు ఇక నుంచి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా ప్రతిజ్ఞ చేయించారు. వారికి ప్రత్యామ్నాయ పంటలను అందించడానికి పోలీసులు, రెవెన్యూ, అటవీశాఖలు సాయం చేస్తాయని హామీ ఇచ్చారు. ఈ ఏడాది పాతపాడులో కింగ్ బీన్స్, రాజ్మ, మిల్లెట్ వంటి ప్రత్యామ్నాయ పంటలను అందజేసినట్లు తెలిపారు.

అల్లూరి సీతారామరాజు పోలీస్ విభాగం, స్థానిక గ్రామాలతో కలిసి మరింత శాశ్వతమైన, చట్టబద్ధమైన వ్యవసాయ పద్ధతుల వైపు మారేందుకు సహాయం చేస్తామన్నారు. మెరుగైన భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలని వారికి సూచించారు.  ఈ ఆపరేషన్ లో భాగంగా ఈగల్ ఐజీ రవి కృష్ణ, ఈగల్ ఎస్పీ నాగేశ్ బాబు, జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, డీఎస్పీ ప్రమోద్, డీఈవో బ్రహ్మాజీరావు, ఫారెస్ట్ అధికారులు, జల్లా పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.  

Also Read: Crime News: కన్నతండ్రి కాదు కామాంధుడు, భార్య లేని టైం చూసి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget