అన్వేషించండి

Andhra Pradesh: స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్‌లో మీరు కూడా భాగస్వాములు కావొచ్చు

Swarnandhra @2047: స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన తర్వాత విజన్ డాక్యుమెంట్ పేజ్ తో లింక్ ఓపెన్ అవుతుంది. అక్కడ మన వివరాలు అప్ లోడ్ చేసిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ మొదలవుతుంది.

Chandra Babu: ఏపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ ఓ కొత్త కార్యక్రమం చేపట్టింది. స్వర్ణాంధ్ర@2047 పేరుతో ఓ సర్వే చేపట్టింది. మీ విజన్ - మా మిషన్.. కలసికట్టుగా ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మిద్దామంటూ ప్రజల నుంచి సలహాలు సూచనలను ఆహ్వానిస్తోంది. దీనికోసం http://swarnandhra.ap.gov.in వెబ్ సైట్ లో ఓ లాగిన్ పేజ్ రూపొందించారు. మొబైల్ ఫోన్ లో క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే విజన్ డాక్యుమెంట్ లోకి నేరుగా ఎంటర్ అవుతాం. అక్కడ మిగతా వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. 


Andhra Pradesh: స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్‌లో మీరు కూడా భాగస్వాములు కావొచ్చు

స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన తర్వాత నేరుగా విజన్ డాక్యుమెంట్ పేజ్ తో లింక్ ఓపెన్ అవుతుంది. అక్కడ మన పేరు, ఫోన్ నెంబర్, జిల్లా, వయసు, వృత్తి, ఈమెయిల్.. తదితర వివరాలు అప్ లోడ్ చేసిన తర్వాత స్వర్ణాంధ్ర-2047 ప్రజాభిప్రాయ సేకరణ మొదలవుతుంది. 
1. 2047 నాటికి ఆంధ్రప్రదేశం కోసం విజన్
2.  ఆర్థికాభివృద్ధికి కీలక రంగాలు
3. జీవన ప్రమాణాల పెంపు
4. సుస్థిర, పర్యావరణానుకూల వృద్ధి
5. భవిష్యత్తు నైపుణ్యాలు, ఉద్యోగావకాశాలు
6. పాలన మెరుగుపరచడం
7. మహిళా సాధికారత
8. రైతుల ఆకాంక్షలు
9. బలహీన వర్గాల ఆకాంక్షలు
10. భారత దేశం మరియు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ నిర్వహించాల్సిన పాత్ర..

ఇలా ఇందులో 10 ప్రశ్నలు ఉంటాయి. ఆయా ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను మనం నేరుగా అందులో పొందుపరచాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే కొన్ని ఆప్షన్లను ఇచ్చింది. ప్రతి ప్రశ్నకు ఆ ఆప్షన్లనుంచి మూడింటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 

ఆయా ప్రశ్నలతోపాటు అదనపు సూచనలు ఇవ్వడానికి కూడా అవకాశం కల్పించారు. దాని తర్వాత ఒక తీర్మానం ఉంటుంది. బాధ్యతాయుతమైన పౌరుడిగా భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంవైపు వెళ్లేందుకు నా వంతు క్రియాశీలక భూమిక పోషిస్తానంటూ ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా తీర్మానం ఉంటుంది. దాని తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మనం కూడా స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ లో భాగస్వామ్యులం అయినట్టు. 

ఇక ఈ విజన్ డాక్యుమెంట్ లో ప్రతి ఒక్కరినీ భాగస్వాముల్ని చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలందాయి. సామాన్య ప్రజలతో ఈ విజన్ డాక్యుమెంట్ పూర్తి చేయించాలని, వారికి అవగాహన కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి కావడంతో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ విజన్ డాక్యుమెంట్స్ కూడా పూర్తి చేయిస్తున్నారు. గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా స్వర్ణాంధ్ర 2047 విజన్ కార్యాచరణ ప్రణాళికను ఇంటింటికీ చేరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విజన్ డాక్యుమెంట్ కార్యక్రమంలో పాల్గొని సూచనలు ఇచ్చిన వారికి సీఎం చంద్రబాబు ఫొటో, సంతకంతో కూడిన డిజిటల్ సర్టిఫికెట్‌ ఇస్తారు. 

ఈ కార్యక్రమానికి సంబంధించి ఈనెల 27 నుంచి 29 వరకు స్కూళ్లు, కాలేజీలలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 5 వరకు జిల్లా కలెక్టర్లు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. రైతులు, వ్యాపారులు, ఇతర అసోసియేషన్ల ప్రతినిధులు.. అన్ని వర్గాల వారితో కూడా సమావేశాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 30 నాటికి మండల స్థాయిలో, అక్టోబరు 15 నాటికి జిల్లా స్థాయిలో.. స్వర్ణాంధ్ర 2047 విజన్ సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశించింది.

Also Read: స్వచ్ఛందంగా తప్పుకోండి, లేదంటే కఠిన చర్యలు- మరో కీలక నిర్ణయం దిశగా సీఎం చంద్రబాబు అడుగులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Diesel Shortage in AP: డీజిల్ అయిపోయిందని ప్రయాణికుల్ని నడిరోడ్డుపై వదిలేసిన ట్రావెల్స్.. ఇంధన కష్టాలకు ఇదే నిదర్శనం!
డీజిల్ అయిపోయిందని ప్రయాణికుల్ని నడిరోడ్డుపై వదిలేసిన ట్రావెల్స్.. ఇంధన కష్టాలకు ఇదే నిదర్శనం!
Fuel Crisis in Andhra Pradesh: ఏపీలో నో స్టాక్ బోర్డులు, మరోవైపు కిలోమీటర్ల మేర క్యూ.. పెట్రోల్, డీజిల్ కష్టాలు తీరవా!
ఏపీలో నో స్టాక్ బోర్డులు, మరోవైపు కిలోమీటర్ల మేర క్యూ.. పెట్రోల్, డీజిల్ కష్టాలు తీరవా!
Andhra Pradesh News: వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ శిఖరాగ్రాన విజయకేతనం.. ఏపీ విద్యార్థుల చారిత్రాత్మక విజయం
వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ శిఖరాగ్రాన విజయకేతనం.. ఏపీ విద్యార్థుల చారిత్రాత్మక విజయం
AP CM Chandrababu: నో స్టాక్ బోర్డులు కనిపించొద్దు.. ఇంధన కొరతపై టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్: సీఎం చంద్రబాబు 
నో స్టాక్ బోర్డులు కనిపించొద్దు.. ఇంధన కొరతపై టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్: సీఎం చంద్రబాబు 

వీడియోలు

Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
SRH vs RR IPL 2026 Highlights | టేబుల్ టాపర్‌గా SRH
Prabhsimran Singh Hits 6 Fours in an Over IPL 2026 | ప్రభ్‌సిమ్రన్ సిక్సర్ల రికార్డ్
KL Rahul 152 Runs vs PBKS IPL 2026 | సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్
Pat Cummins about Vaibhav Suryavanshi IPL 2026 | కమిన్స్‌కే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Rahul: కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
Andhra University:
"శతాయుష్మాన్ భవ" ఏయూను దీవించిన ప్రముఖులు! ఘనంగా ముగిసిన శతాబ్ది వసంతాల వేడుకలు! ప్రత్యేక ఆకర్షణగా సచిన్, త్రివిక్రమ్
Hyderabad IT Corridor: హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
live in relationship: సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?
సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?
Mumbai News: బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
Tips for Child Sleep : పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే.. తల్లిదండ్రులు తప్పకుండా పాటించాల్సిన టిప్స్
పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే.. తల్లిదండ్రులు తప్పకుండా పాటించాల్సిన టిప్స్
Social Post : మోడ్రన్ డ్రెస్‌లో వామికా - నేచర్ ఎంజాయ్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ... ఫోటోస్ వైరల్
మోడ్రన్ డ్రెస్‌లో వామికా - నేచర్ ఎంజాయ్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ... ఫోటోస్ వైరల్
KCR : కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు తెలంగాణ పౌరుషం లేదా? - బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ నిప్పులు
కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు తెలంగాణ పౌరుషం లేదా? బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ నిప్పులు
Embed widget