అన్వేషించండి

Andhra Pradesh: స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్‌లో మీరు కూడా భాగస్వాములు కావొచ్చు

Swarnandhra @2047: స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన తర్వాత విజన్ డాక్యుమెంట్ పేజ్ తో లింక్ ఓపెన్ అవుతుంది. అక్కడ మన వివరాలు అప్ లోడ్ చేసిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ మొదలవుతుంది.

Chandra Babu: ఏపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ ఓ కొత్త కార్యక్రమం చేపట్టింది. స్వర్ణాంధ్ర@2047 పేరుతో ఓ సర్వే చేపట్టింది. మీ విజన్ - మా మిషన్.. కలసికట్టుగా ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మిద్దామంటూ ప్రజల నుంచి సలహాలు సూచనలను ఆహ్వానిస్తోంది. దీనికోసం http://swarnandhra.ap.gov.in వెబ్ సైట్ లో ఓ లాగిన్ పేజ్ రూపొందించారు. మొబైల్ ఫోన్ లో క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే విజన్ డాక్యుమెంట్ లోకి నేరుగా ఎంటర్ అవుతాం. అక్కడ మిగతా వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. 


Andhra Pradesh: స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్‌లో మీరు కూడా భాగస్వాములు కావొచ్చు

స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన తర్వాత నేరుగా విజన్ డాక్యుమెంట్ పేజ్ తో లింక్ ఓపెన్ అవుతుంది. అక్కడ మన పేరు, ఫోన్ నెంబర్, జిల్లా, వయసు, వృత్తి, ఈమెయిల్.. తదితర వివరాలు అప్ లోడ్ చేసిన తర్వాత స్వర్ణాంధ్ర-2047 ప్రజాభిప్రాయ సేకరణ మొదలవుతుంది. 
1. 2047 నాటికి ఆంధ్రప్రదేశం కోసం విజన్
2.  ఆర్థికాభివృద్ధికి కీలక రంగాలు
3. జీవన ప్రమాణాల పెంపు
4. సుస్థిర, పర్యావరణానుకూల వృద్ధి
5. భవిష్యత్తు నైపుణ్యాలు, ఉద్యోగావకాశాలు
6. పాలన మెరుగుపరచడం
7. మహిళా సాధికారత
8. రైతుల ఆకాంక్షలు
9. బలహీన వర్గాల ఆకాంక్షలు
10. భారత దేశం మరియు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ నిర్వహించాల్సిన పాత్ర..

ఇలా ఇందులో 10 ప్రశ్నలు ఉంటాయి. ఆయా ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను మనం నేరుగా అందులో పొందుపరచాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే కొన్ని ఆప్షన్లను ఇచ్చింది. ప్రతి ప్రశ్నకు ఆ ఆప్షన్లనుంచి మూడింటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 

ఆయా ప్రశ్నలతోపాటు అదనపు సూచనలు ఇవ్వడానికి కూడా అవకాశం కల్పించారు. దాని తర్వాత ఒక తీర్మానం ఉంటుంది. బాధ్యతాయుతమైన పౌరుడిగా భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంవైపు వెళ్లేందుకు నా వంతు క్రియాశీలక భూమిక పోషిస్తానంటూ ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా తీర్మానం ఉంటుంది. దాని తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మనం కూడా స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ లో భాగస్వామ్యులం అయినట్టు. 

ఇక ఈ విజన్ డాక్యుమెంట్ లో ప్రతి ఒక్కరినీ భాగస్వాముల్ని చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలందాయి. సామాన్య ప్రజలతో ఈ విజన్ డాక్యుమెంట్ పూర్తి చేయించాలని, వారికి అవగాహన కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి కావడంతో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ విజన్ డాక్యుమెంట్స్ కూడా పూర్తి చేయిస్తున్నారు. గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా స్వర్ణాంధ్ర 2047 విజన్ కార్యాచరణ ప్రణాళికను ఇంటింటికీ చేరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విజన్ డాక్యుమెంట్ కార్యక్రమంలో పాల్గొని సూచనలు ఇచ్చిన వారికి సీఎం చంద్రబాబు ఫొటో, సంతకంతో కూడిన డిజిటల్ సర్టిఫికెట్‌ ఇస్తారు. 

ఈ కార్యక్రమానికి సంబంధించి ఈనెల 27 నుంచి 29 వరకు స్కూళ్లు, కాలేజీలలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 5 వరకు జిల్లా కలెక్టర్లు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. రైతులు, వ్యాపారులు, ఇతర అసోసియేషన్ల ప్రతినిధులు.. అన్ని వర్గాల వారితో కూడా సమావేశాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 30 నాటికి మండల స్థాయిలో, అక్టోబరు 15 నాటికి జిల్లా స్థాయిలో.. స్వర్ణాంధ్ర 2047 విజన్ సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశించింది.

Also Read: స్వచ్ఛందంగా తప్పుకోండి, లేదంటే కఠిన చర్యలు- మరో కీలక నిర్ణయం దిశగా సీఎం చంద్రబాబు అడుగులు

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Vijayawada Airport ATC Tower: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ - అత్యాధునిక ఏటీసీ టవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ - అత్యాధునిక ఏటీసీ టవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు!
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget