అన్వేషించండి

ఏపీలో ఇసుక, మద్యం విక్రయాలు కేంద్రానికి కనిపించట్లేదా? వాటాలు అందుతున్నాయా - కేవీపీ

మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు, మద్యం విక్రయాలు జరుగుతుంటే...కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అన్నారు.

Kvp Ramachandra Rao Fires On Bjp : మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ (Congress)సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు (Kvp Ramachandra Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విచ్చలవిడిగా ఇసుక (sand)అక్రమాలు, మద్యం (Wine) విక్రయాలు జరుగుతుంటే...కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బీజేపీయేతర రాష్ట్రాలన్నింటిలో మంత్రులను అరెస్టు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్...ఆంధ్రప్రదేశ్ లో మంత్రులను ఎందుకు వదిలేసిందని నిలదీశారు. ఏపీలో జరుగుతున్న అక్రమాల్లో కాషాయ పార్టీకి వాటాలు అందుతున్నాయా అని కేవీపీ రామచంద్రరావు అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ సహకారం లేకుండా...ఏపీ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయగలదా అని ప్రశ్నించారు.

ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగనే...
ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగనే అన్నారు కేవీపీ రామచంద్రరావు. ఇసుక, మద్యం కుంభకోణాల్లో దేశంలో చాలా మంది నేతలను అరెస్టు చేశారని. ఏపీలోని నేతలను అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏంటన్నారు. బీజేపీ దృష్టిలో దేశంలో ఎలాంటి మరక లేని ప్రభుత్వం ఏపీ ఒక్కటే అనుకుంటా ? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలోని ఏ మంత్రి పైనా, ఎంపీలపైనా కేసులు, అరెస్టులు ఎందుకు పెట్టలేదో బీజేపీ చెప్పాలని కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు దేశం అంతా నగదు రహిత లావాదేవీలు ఉన్నా...ఏపీలో మాత్రం అంతా నగదుతోనే విక్రయాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలిసినా..చూసి చూడనట్లు వ్యవహరిస్తోందన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే.. సీఎం జగనే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలిశారని విమర్శించారు. 

వైసీపీ పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుంది
ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దర్శనం దొరికినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అభినందించాలంటూ కేవీపీ రామచంద్రరావు సెటైర్లు వేశారు. వైఎస్ బొమ్మ పెట్టుకుని ఓట్లు అడగడానికి వెళ్తున్న వైసిపి నేతలకు సిగ్గు లేదన్నారు. పోలవరం పూర్తి అయితే చాలా ఎత్తిపోతల పథకాలు నిర్మించుకునే అవకాశం ఉంటుందని,  పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో అర్ఠం కావడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని భావితరాలు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని, గత టీడీపీ ప్రభుత్వాన్ని క్షమించవన్నారు. పోలవరం నిర్మాణాన్ని పక్కన పెట్టేసిన వైసీపీ ప్రభుత్వం...ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటోందన్నారు. పోలవరం బ్యారేజీలా మిగిలిపోకూడదన్న ఆయన, ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్... కేంద్రం నుంచి ఏం సాధించుకొని వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

తల్లి, చెల్లిని సంరక్షించలేని అసమర్థులు
సొంత తల్లి, చెల్లిని కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు కేవీపీ రామచంద్రరావు. తల్లి, చెల్లిని సంరక్షించలేని వారి కంటే అసమర్థులు ఇంకెవరూ ఉండరని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్ల పంపకం, స్వీట్లు పంచుకోవడం, వాటాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి....ఈ రెండు పార్టీలు పట్టించుకోవన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలిగే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్న ఆయన. నిరుద్యోగం పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు కేవీపీ రామచంద్రరావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు...రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లలేదని..స్వప్రయోజనాల కోసమే వెళ్లారని విమర్శించారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati News: అమరావతిలో తొలిదశ భూసేకరణ వేగవంతం.. విడివిడిగా CRDA నోటిఫికేషన్లు - రైతులకు మరో ఛాన్స్ !
అమరావతిలో తొలిదశ భూసేకరణ వేగవంతం.. విడివిడిగా CRDA నోటిఫికేషన్లు - రైతులకు మరో ఛాన్స్ !
Breaking News: భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్
Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
Petrol Price Hike May 2026: పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?
పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Heatwave Heart Care : వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
వేసవిలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్(Heart Attack) రిస్క్.. ఎండల్లో గుండెను కాపాడే ఫుడ్స్ ఇవే
Film Development Corporation : AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
AP FDC ఛైర్మన్‌, డైరెక్టర్స్ నియామకం - సుమన్, శివాజీ, ఝాన్సీలకు ఛాన్స్
Hyderabad News: క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
క్యాన్సర్ బాధితుల కోసం జుట్టు డొనేట్ చేసిన హైదరాబాద్ బాలిక.. నెటిజన్ల ప్రశంసలు
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Guntur Crime News: పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి మహిళ ఆత్మహత్య.. గుంటూరులో ఘటన
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
Embed widget