అన్వేషించండి

ఏపీలో ఇసుక, మద్యం విక్రయాలు కేంద్రానికి కనిపించట్లేదా? వాటాలు అందుతున్నాయా - కేవీపీ

మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు, మద్యం విక్రయాలు జరుగుతుంటే...కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అన్నారు.

Kvp Ramachandra Rao Fires On Bjp : మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ (Congress)సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు (Kvp Ramachandra Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విచ్చలవిడిగా ఇసుక (sand)అక్రమాలు, మద్యం (Wine) విక్రయాలు జరుగుతుంటే...కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బీజేపీయేతర రాష్ట్రాలన్నింటిలో మంత్రులను అరెస్టు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్...ఆంధ్రప్రదేశ్ లో మంత్రులను ఎందుకు వదిలేసిందని నిలదీశారు. ఏపీలో జరుగుతున్న అక్రమాల్లో కాషాయ పార్టీకి వాటాలు అందుతున్నాయా అని కేవీపీ రామచంద్రరావు అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ సహకారం లేకుండా...ఏపీ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయగలదా అని ప్రశ్నించారు.

ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగనే...
ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగనే అన్నారు కేవీపీ రామచంద్రరావు. ఇసుక, మద్యం కుంభకోణాల్లో దేశంలో చాలా మంది నేతలను అరెస్టు చేశారని. ఏపీలోని నేతలను అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏంటన్నారు. బీజేపీ దృష్టిలో దేశంలో ఎలాంటి మరక లేని ప్రభుత్వం ఏపీ ఒక్కటే అనుకుంటా ? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలోని ఏ మంత్రి పైనా, ఎంపీలపైనా కేసులు, అరెస్టులు ఎందుకు పెట్టలేదో బీజేపీ చెప్పాలని కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు దేశం అంతా నగదు రహిత లావాదేవీలు ఉన్నా...ఏపీలో మాత్రం అంతా నగదుతోనే విక్రయాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలిసినా..చూసి చూడనట్లు వ్యవహరిస్తోందన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే.. సీఎం జగనే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలిశారని విమర్శించారు. 

వైసీపీ పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుంది
ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దర్శనం దొరికినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అభినందించాలంటూ కేవీపీ రామచంద్రరావు సెటైర్లు వేశారు. వైఎస్ బొమ్మ పెట్టుకుని ఓట్లు అడగడానికి వెళ్తున్న వైసిపి నేతలకు సిగ్గు లేదన్నారు. పోలవరం పూర్తి అయితే చాలా ఎత్తిపోతల పథకాలు నిర్మించుకునే అవకాశం ఉంటుందని,  పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో అర్ఠం కావడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని భావితరాలు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని, గత టీడీపీ ప్రభుత్వాన్ని క్షమించవన్నారు. పోలవరం నిర్మాణాన్ని పక్కన పెట్టేసిన వైసీపీ ప్రభుత్వం...ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటోందన్నారు. పోలవరం బ్యారేజీలా మిగిలిపోకూడదన్న ఆయన, ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్... కేంద్రం నుంచి ఏం సాధించుకొని వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

తల్లి, చెల్లిని సంరక్షించలేని అసమర్థులు
సొంత తల్లి, చెల్లిని కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు కేవీపీ రామచంద్రరావు. తల్లి, చెల్లిని సంరక్షించలేని వారి కంటే అసమర్థులు ఇంకెవరూ ఉండరని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్ల పంపకం, స్వీట్లు పంచుకోవడం, వాటాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి....ఈ రెండు పార్టీలు పట్టించుకోవన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలిగే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్న ఆయన. నిరుద్యోగం పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు కేవీపీ రామచంద్రరావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు...రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లలేదని..స్వప్రయోజనాల కోసమే వెళ్లారని విమర్శించారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: కాంగ్రెస్ వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా తెలంగాణ: మాజీ మంత్రి హరీశ్ రావు
కాంగ్రెస్ వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా తెలంగాణ: మాజీ మంత్రి హరీశ్ రావు
PM Children Care Scheme: మీ పిల్లలకు దేశ ప్రధాని సంరక్షణ - ఈ స్కీమ్‌ ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే అప్లై చేస్తారు
మీ పిల్లలకు దేశ ప్రధాని సంరక్షణ - PM CARES స్కీమ్‌ ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే అప్లై చేస్తారు
Balakrishna Thaman: తమన్‌కు పోర్షే గిఫ్ట్ ఇచ్చిన బాలకృష్ణ... ఆ కారు రేటు ఎన్ని కోట్లు ఉందో తెల్సా?
తమన్‌కు పోర్షే గిఫ్ట్ ఇచ్చిన బాలకృష్ణ... ఆ కారు రేటు ఎన్ని కోట్లు ఉందో తెల్సా?
Prayagraj Road Accident: మహా కుంభమేళా యాత్రలో విషాదం, బస్సును ఢీకొన్న బొలెరో - 10 మంది భక్తులు మృతి
కుంభమేళా యాత్రలో విషాదం, బస్సును ఢీకొన్న బొలెరో - 10 మంది భక్తులు మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Deputy CM Pawan Kalyan Palani Temple | షష్ఠ షణ్ముఖ యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ | ABP DesamPM Modi Gifts to Elon Musk Children | మస్క్ పిల్లలకు మోదీ ఇచ్చిన గిఫ్టులేంటంటే | ABP DesamTrump Met PM Modi White House | వైట్ హౌస్ లో మోదీకి అదిరిపోయే స్వాగతం | ABP DesamCaste Census Re Survey in Telangana |  ఫిబ్రవరి 16నుంచి తెలంగాణలో కుల గణనకు మరో అవకాశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కాంగ్రెస్ వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా తెలంగాణ: మాజీ మంత్రి హరీశ్ రావు
కాంగ్రెస్ వైఫల్యంతో నీటి సంక్షోభం దిశగా తెలంగాణ: మాజీ మంత్రి హరీశ్ రావు
PM Children Care Scheme: మీ పిల్లలకు దేశ ప్రధాని సంరక్షణ - ఈ స్కీమ్‌ ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే అప్లై చేస్తారు
మీ పిల్లలకు దేశ ప్రధాని సంరక్షణ - PM CARES స్కీమ్‌ ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే అప్లై చేస్తారు
Balakrishna Thaman: తమన్‌కు పోర్షే గిఫ్ట్ ఇచ్చిన బాలకృష్ణ... ఆ కారు రేటు ఎన్ని కోట్లు ఉందో తెల్సా?
తమన్‌కు పోర్షే గిఫ్ట్ ఇచ్చిన బాలకృష్ణ... ఆ కారు రేటు ఎన్ని కోట్లు ఉందో తెల్సా?
Prayagraj Road Accident: మహా కుంభమేళా యాత్రలో విషాదం, బస్సును ఢీకొన్న బొలెరో - 10 మంది భక్తులు మృతి
కుంభమేళా యాత్రలో విషాదం, బస్సును ఢీకొన్న బొలెరో - 10 మంది భక్తులు మృతి
Tirumala Alert: చిరుత సంచారంతో టీటీటీ అలర్ట్, అలిపిరి నడకదారిలో ఈ మార్పులు గమనించారా!
చిరుత సంచారంతో టీటీటీ అలర్ట్, అలిపిరి నడకదారిలో ఈ మార్పులు గమనించారా!
Thala Movie Review: అమ్మ రాజశేఖర్ కొడుకు హీరోగా పరిచయమైన 'తల' సినిమా ఎలా ఉందంటే?
అమ్మ రాజశేఖర్ కొడుకు హీరోగా పరిచయమైన 'తల' సినిమా ఎలా ఉందంటే?
AP CM Chandrababu: వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై విచారణకు ప్రత్యేక కమిషన్ - ఏపీ సీఎం చంద్రబాబు
వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై విచారణకు ప్రత్యేక కమిషన్ - ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Congress:  తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ -  దీపాదాస్ మున్షికి ఉద్వాసన
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ - దీపాదాస్ మున్షికి ఉద్వాసన
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.