అన్వేషించండి

YS Jagan Latest News: వైసీపీ అధినేత జగన్‌పై కేసు నమోదు - నిందితులుగా  కొడాలి నాని, అంబటి రాంబాబు సహా ఏడుగురు

YS Jagan Latest News: గుంటూరు మిర్చి యార్డులో పర్యటించిన వైఎస్‌ జగన్ సహా ఏడుగురిపై కేసులు నమోదు అయ్యాయి. ఎలాంటి అనుమతి లేకుండా వచ్చినందుకు అధికారులు కేసులు పెట్టారు.

YS Jagan Latest News: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బుధవారం గుంటూరులోని మిర్చియార్డ్‌ను సందర్శించారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దాన్ని ఉల్లంఘించి ఎలాంటి అనుమతి తీసుకుండానే భారీ జనసందోహంతో మిర్చియార్డును సందర్శించారు. దీనిపై ఎన్నికల సంఘం అధికారులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు జగన్‌ సహా ఏడుగురిపై కేసు పెట్టారు. 

గుంటూరులో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరుగతున్న జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అక్కడ ఏం చేసినా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి. ఇప్పుడ జగన్ పర్యటించిన గుంటూరులో కూడా కోడ్ అమలులో ఉంది. అయితే ఎన్నికల సంఘం అధికారుల అనుమతి తీసుకోకుండా జగన్ పర్యటించారు. 

Image

జగన్ సహా ఏడుగురు

ఈసీ అనుమతి లేకుండా గుంటూరులో పర్యటించడాన్ని అధికారులు తప్పుపట్టారు. కోడ్ నియమాలను ఉల్లంఘించినందుకు జగన్‌పై అధికారులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు జగన్‌పై కేసు పెట్టారు. ఆయనతోపాటు వైసీపీ నేతలు కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి,లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపపాల్‌ రెడ్డి, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌నాయుడుని కూడా నిందితుల లిస్ట్‌లో చేర్చారు. 

Image

ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇవే

జగన్‌తోపాటు వీళ్లంతా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించడమే కాకుండా అమలులో ఉన్న పోలీస్‌ యాక్ట్‌ను కూడా పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండానే కనీసం మిర్చి యార్డు సెక్రటరీ పర్మిషన్ కూడా తీసుకోలేదని ఫిర్యాదులో అధికారులు పేర్కొన్నారు. దీని వల్ల స్థానిక ప్రజలు, మిర్చి రైతులు ఇబ్బంది పడ్డారని తెలిపారు. పెద్ద సంఖ్యలో వచ్చిన వైసీపీ నేతల వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. ముందస్తు పర్మషన్ తీసుకోకుండా వచ్చి ప్రజలకు ఇబ్బంది పెట్టినందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు.  

ఈ కేసులో పేర్ని నానిని చేర్చడంపై వైసీపీ విమర్శలు చేస్తోంది. అసలు ఆ పర్యనటకు రాని నానిని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చారని ప్రశ్నించారు అంబటి రాంబాబు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన... ప్రభుత్వం కుట్ర అర్థమవుతుందని మండిపడ్డారు. 

Also Read: ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం

ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

బుధవారం మిర్చియార్డ్‌లో పర్యటించిన జగన్ అక్కడి రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉదయం పది గంటలకు వచ్చిన జగన్ దాదాపు గంట పాటు అక్కడ ఉన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మిర్చి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులంతా ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. 

వైసీపీ హయాంలో రైతులకు మేలు చేసే పథకాలు, సంస్కరణకు తీసుకొచ్చామని వాటిని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు జగన్. మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల తరఫున వైసీపీ ప్రత్యక్ష పోరాటాలకు దిగుతుందన్నారు. ఎప్పుడూ లేనంతగా మిర్చి ధర పడిపోతే కనీస మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. 

Also Read: సైలెంట్‌గా యాక్టివ్ - జగన్ జిల్లాల టూర్లు ప్రారంభమయినట్లేనా ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Power Restoration in AP :మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
Minister Azharuddin: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
Tamilnadu ED: క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్
క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్
Alert for train passengers: రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ -  తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో
టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ - తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో
Advertisement

వీడియోలు

Montha Effect | అర్థరాత్రి కుప్పకూలిన వీరబ్రహ్మేంద్రస్వామి చారిత్రక గృహం | ABP Desam
Hurricane Melissa batters Jamaica | జ‌మైకాను నాశనం చేసిన మెలిసా హరికేన్ | ABP Desam
US Airforce Records Inside Hurricane Melissa | హరికేన్ మెలిస్సా ఎంత ఉద్ధృతంగా ఉందో చూడండి | ABP Desam
Cyclone Montha Landfall | తీరం దాటిన మొంథా తుఫాన్
What is Digital Arrest | డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటీ ? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Power Restoration in AP :మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన
Minister Azharuddin: జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ సంచలన నిర్ణయం - మంత్రిగా అజహద్దీన్ - ప్రమాణం ఎప్పుడంటే ?
Tamilnadu ED: క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్
క్యాష్ ఫర్ జాబ్స్ - తమిళనాడు సీఎం స్టాలిన్ లంచాలు తీసుకున్నారు - ఈడీ సంచలన రిపోర్ట్
Alert for train passengers: రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ -  తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో
టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ - తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో
New districts in AP: ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లపై తుది  దశకు కసరత్తు - మరోసారి కెబినెట్ సబ్ కమిటీ భేటీ
ఏపీలో కొత్త జిల్లాలు, పేర్లపై తుది దశకు కసరత్తు - మరోసారి కెబినెట్ సబ్ కమిటీ భేటీ
Amazon layoff: ఉద్యోగుల్ని విచ్చలవిడిగా  తీసేస్తున్న అమెజాన్ - ఏఐనే కారణమా?
ఉద్యోగుల్ని విచ్చలవిడిగా తీసేస్తున్న అమెజాన్ - ఏఐనే కారణమా?
Hero Splendor Price : హీరో స్ప్లెండర్ ఢిల్లీలో కొనడం మంచిదా? హైదరాబాద్‌లో కొనడం బెటరా? ఎక్కడ చౌకగా లభిస్తుంది?
హీరో స్ప్లెండర్ ఢిల్లీలో కొనడం మంచిదా? హైదరాబాద్‌లో కొనడం బెటరా? ఎక్కడ చౌకగా లభిస్తుంది?
Komatireddy Venkata Reddy: సినిమాటోగ్రఫీ మంత్రి లేకుండానే సినీ కార్మికుల అభినందన సభ - సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి అసంతృప్తి ?
సినిమాటోగ్రఫీ మంత్రి లేకుండానే సినీ కార్మికుల అభినందన సభ - సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి అసంతృప్తి ?
Embed widget