అన్వేషించండి

Power Restoration in AP :మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన

Power Restoration :తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణపై మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సమీక్ష నిర్వహించారు. సీఎండీలతో మాట్లాడారు. విద్యుత్ పునరుద్ధరణపై కీలక ప్రకటన చేశారు.

Power Restoration in Cyclone-Affected Areas: ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను ప్రభావంతో ఊళ్లకు ఊళ్లే అల్లాడి పోయాయి. గాలి వానలకు జనజీవనం స్తంభించి పోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణ నష్టం నివారించారు. కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉంది. ముందు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేశారు. మరికొన్ని ప్రాంతాల్లో స్తంభాలు విరిగిపడి, చెట్లు నేల కూలి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నా వర్షం కారణంగా పనులు ఆగుతూ సాగుతున్నాయి. దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులతో చర్చించారు. 

విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, సీఎండీతో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష నిర్వహించారు. మొంథా తుపాను తీరం దాటిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సమస్యలపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సమస్య పై మంత్రి గొట్టిపాటి ఆరా తీశారు. తుపాను ధాటికి గాలులు వేగంగా వీయడంతో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపి వేసినట్లు అధికారుల మంత్రికి వివరించారు. పోల్ టూ పోల్ పెట్రోలింగ్ చేస్తూ సమస్య లేని చోట విద్యుత్ పునరుద్ధరణ చేయాలి అధికారులను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ఇప్పటికే ఎస్ పీడీసీఎల్ నుంచి తీసుకొచ్చిన అదనపు సిబ్బందితో క్షేత్రస్థాయిలో పునరుద్దరణ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అవసరమైన సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగులంతా పునరుద్ధరణ చర్యల్లో అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదాలను అరికట్టేలా చూడాలని కోరారు. అయితే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షం పడుతున్న కారణంగా పునరుద్ధరణకు సమయం పడుతుందని అధికారులు మంత్రి గొట్టిపాటికి వివరించారు. 

విద్యుత్ పునరుద్ధరణ పనులపై మంత్రి గొట్టిపాటికి లోకేశ్ ఫోన్ 

ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌కు మంత్రి నారా లోకేశ్ ఫోన్ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. విద్యుత్ సమస్యపై మంత్రి గొట్టిపాటితో మాట్లాడారు. ఇవాళ్టికి వంద శాతం విద్యుత్ పునరుద్ధరణ పూర్తి చేస్తామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. కొన్ని చోట్ల ప్రమాదాల నివారణకు విద్యుత్ నిలిపివేసినట్లు మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారులు, సీఎండీలు కూడా క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైనట్లు లోకేశ్ కు వివరించారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని నారా లోకేశ్ సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Advertisement

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Alluri Road Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేట్ ట్రావెల్స్, 9 మంది మృతి! సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Akhanda 3 Title : 'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
'అఖండ 2' క్లైమాక్స్‌లో బిగ్ సర్ ప్రైజ్ - ఫ్యాన్స్‌కు బోయపాటి బిగ్ ట్రీట్ కన్ఫర్మ్
Maharashtra News: కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Sasivadane OTT : మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
మరో ఓటీటీలోకి విలేజ్ క్యూట్ లవ్ స్టోరీ 'శశివదనే' - రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్
Investment Tips: పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీటిలో రిస్క్ తక్కువ, మీకు ఏది బెస్ట్
Kaantha OTT : ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి వచ్చేసిన దుల్కర్ 'కాంత' - 5 భాషల్లో స్ట్రీమింగ్
Embed widget