అన్వేషించండి

Power Restoration in AP :మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ఎప్పుడు? మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ప్రకటన

Power Restoration :తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణపై మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సమీక్ష నిర్వహించారు. సీఎండీలతో మాట్లాడారు. విద్యుత్ పునరుద్ధరణపై కీలక ప్రకటన చేశారు.

Power Restoration in Cyclone-Affected Areas: ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను ప్రభావంతో ఊళ్లకు ఊళ్లే అల్లాడి పోయాయి. గాలి వానలకు జనజీవనం స్తంభించి పోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణ నష్టం నివారించారు. కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉంది. ముందు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేశారు. మరికొన్ని ప్రాంతాల్లో స్తంభాలు విరిగిపడి, చెట్లు నేల కూలి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నా వర్షం కారణంగా పనులు ఆగుతూ సాగుతున్నాయి. దీనిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులతో చర్చించారు. 

విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, సీఎండీతో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష నిర్వహించారు. మొంథా తుపాను తీరం దాటిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సమస్యలపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సమస్య పై మంత్రి గొట్టిపాటి ఆరా తీశారు. తుపాను ధాటికి గాలులు వేగంగా వీయడంతో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపి వేసినట్లు అధికారుల మంత్రికి వివరించారు. పోల్ టూ పోల్ పెట్రోలింగ్ చేస్తూ సమస్య లేని చోట విద్యుత్ పునరుద్ధరణ చేయాలి అధికారులను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ఇప్పటికే ఎస్ పీడీసీఎల్ నుంచి తీసుకొచ్చిన అదనపు సిబ్బందితో క్షేత్రస్థాయిలో పునరుద్దరణ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అవసరమైన సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగులంతా పునరుద్ధరణ చర్యల్లో అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదాలను అరికట్టేలా చూడాలని కోరారు. అయితే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షం పడుతున్న కారణంగా పునరుద్ధరణకు సమయం పడుతుందని అధికారులు మంత్రి గొట్టిపాటికి వివరించారు. 

విద్యుత్ పునరుద్ధరణ పనులపై మంత్రి గొట్టిపాటికి లోకేశ్ ఫోన్ 

ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌కు మంత్రి నారా లోకేశ్ ఫోన్ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. విద్యుత్ సమస్యపై మంత్రి గొట్టిపాటితో మాట్లాడారు. ఇవాళ్టికి వంద శాతం విద్యుత్ పునరుద్ధరణ పూర్తి చేస్తామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. కొన్ని చోట్ల ప్రమాదాల నివారణకు విద్యుత్ నిలిపివేసినట్లు మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారులు, సీఎండీలు కూడా క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైనట్లు లోకేశ్ కు వివరించారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని నారా లోకేశ్ సూచించారు.

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget