అన్వేషించండి

YS Jagan: సైలెంట్‌గా యాక్టివ్ - జగన్ జిల్లాల టూర్లు ప్రారంభమయినట్లేనా ?

Andhra Pradesh: వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గా యాక్టివ్ అయ్యారు. బలప్రదర్శన మాదిరిగా ప్రజలలోకి వెళ్తూండటంతో సోషల్ మీడియా టీం కూడా దూకుడు చూపిస్తోంది.

YS Jaganmohan Reddy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటిపోయింది కానీ ప్రతిపక్ష నేతగా జగన్ తన మార్క్ చూపించడంలో విఫలమయ్యారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఆయనకు లేనప్పటికీ ఏపీలో ఉన్న ఏకైక ప్రతిపక్ష నేత మాత్రం ఆయనే. దానికి తగ్గట్లుగా పోరుబాట ఎంచుకుంటారని.. అనుకున్నారు కానీ ఆయన నింపాదిగా ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే వరకూ వేచి చూడాలని అనుకున్నారు. అందుకే కార్యకర్తలను పరామర్శించేందుకు ఆయన జిల్లాల టూర్ పెట్టుకున్నారు. కానీ దాని గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. కానీ ప్రజా సమస్యలపై మాత్రం మెల్లగా పర్యటనలు ప్రారంభించాలని డిసైడయ్యారు. 

రెండు రోజుల్లో విజయవాడ, గుంటూరుల్లో అలజడి

జగన్ రెండు రోజుల కిందట బెంగళూరు నుంచి వచ్చారు. రాగానే విజయవాడలో వంశీ ని జైలులో పరామర్శించారు. అక్కడ ఓ పాప ఆయన కోసం ఏడవడం.. ఆ పాపతో సెల్ఫీ దిగడం వంటి కార్యక్రమాలతో జగన్ మళ్లీ తన రాజకీయం  ప్రారంభించారని వైసీపీ నేతలు అర్థం చేసుకుననారు. వెంటనే గుంటూరులో మిర్చి రైతుల పరామర్శకు అని వెళ్లారు. ఎన్నికల కోడ్ ఉన్నా సరే లెక్క చేయలేదు. అనుమతి లేని పర్యటనకు పోలీసులు కూడాపెద్దగా బందోబస్తు ఏర్పాటు చేయలేదు. ఆక్కడ ఆవేశంగా చంద్రబాబుపై విమర్శలు చేశారు. మిర్చి కోరు కారణంగా ఇబ్బంది పడినప్పటికీ కొంత మంది రైతులతో మాట్లాడి వెళ్లారు. అక్కడ కూడా జగన్ మార్క్ కనిపించింది.  

ఇక సమస్యలపై జిల్లాల పర్యటనలు 

జగన ఇటీవలి కాలంలో ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు. వారానికి మూడు లేదా నాలుగు రోజులు తాడేపల్లిలో ఉంటున్నారు. దానికి సంబంధించి ఆయన కారణాలు ఆయనకు ఉండవచ్చు కానీ ఏపీకి వచ్చిన రోజుల్లో తాడేపల్లిలో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించేవారు. అయితే ఇక నుంచి ఓ జిల్లా పర్యటనకు వెళ్లాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రజాసమస్యలను తీసుకుని ఆ సమస్య పరిశీలనకు జగన్ ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తన ప్లాన ను బయట పెట్టలేదు కానీ అన్ ప్లాన్డ్ గానే ఆయన ప్రజల్లోకి వెళ్తే మంచి స్పందన వస్తుందని కొత్తగా వ్యూహకర్తలు ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 

అసెంబ్లీ సమావేశంల సమయంలో ఏం చేయబోతున్నారు ?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీకి హాజర్యయేందుకు సిద్ధంగా లేరు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి చంద్రబాబుతో సమానంగా మాట్లాడే అవకాశం ఇస్తేనే వస్తానని ఆయనంటున్నారు కాబట్టి హాజరయ్యే అవకాశం లేదు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయన సైలెంట్ గా ఉండే అవకాశం లేదు. ఏదో ఓ రాజకీయ కార్యక్రమం పెట్టుకుంటారు. గతంలో ఆయన మాక్ అసెంబ్లీ నిర్వహించాలని అనుకున్నారు. కానీ నిర్వహించలేదు. ఈ సారి జనాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీకి ఎందుకు వెళ్లలేదో తన వాదన వినిపిస్తూ..   అక్కడి నుంచి ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తానని ఆయన వ్యూహాన్ని ఖరారు చేసుకునే అవకాశం ఉంది.    

Also Read:  మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం - పోరాటమే ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా విజయ రహస్యం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy Quits Congress: కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్‌బై.. రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు
Cases against KTR: ఫార్ములా ఈ రేసు కేసుతో కేటీఆర్‌ను పక్కాగా ఇరికించారా? అరెస్టులు లేకుండా నేరుగా చార్జిషీటు వెనుక రేవంత్ వ్యూహం ఏమిటి?
ఫార్ములా ఈ రేసు కేసుతో కేటీఆర్‌ను పక్కాగా ఇరికించారా? అరెస్టులు లేకుండా నేరుగా చార్జిషీటు వెనుక రేవంత్ వ్యూహం ఏమిటి?
Jagan friendship with NDA: చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
చిత్తుగా ఓడించిన ప్రత్యర్థితోనే స్నేహం - వైసీపీ భవిష్యత్‌కు జగన్ పాలసీనే గండంగా మారిందా?
Kerala Assembly Elections2026: సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!
సర్పంచ్ ఎన్నికల మాదిరిగా కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌! గల్ఫ్‌ ఓటర్ల కోసం చార్టర్డ్ విమానాలు బుక్ చేస్తున్న పార్టీలు!

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Hero Vida VX2 Plus KKR Edition: కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Hyundai India : హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
Embed widget