అన్వేషించండి

Alert for train passengers: రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అలర్ట్ - తుఫాను ప్రభావంతో రైళ్ల షెడ్యూల్‌లో మార్పు, చేర్పుల పూర్తి వివరాలు ఇవిగో

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే రైళ్ల రాకపోకలపై కీలక ప్రకటనలు చేసింది. రెండు రైళ్లను క్యాన్సిల్ చేశారు.

South Central Railway has made key announcements regarding trains:  తీవ్ర తుఫాను  ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైల్వే ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. దీని కారణంగా దక్షిణ మధ్య రైల్వే  రైళ్ల షెడ్యూల్‌లో ముఖ్యమైన మార్పులు ప్రకటించింది. రైళ్ల క్యాన్సిలేషన్‌లు, డైవర్షన్ రూట్లు, రీషెడ్యూలింగ్‌లు  ప్రకటించారు.  ప్రయాణికులు టికెట్లను రద్దు చేసుకోవడానికి లేదా  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి రైల్వే అధికారులు అవకాశం కల్పించారు. 

తుఫాను కారణంగా రెండు ముఖ్య రైళ్లను పూర్తిగా క్యాన్సిల్ చేశారు.  

1.  ట్రైన్ నెం. 22204 సికింద్రాబాద్-విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్: అక్టోబర్ 29, 2025న సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు పూర్తిగా క్యాన్సిల్ చేశారు.   ఈ రైలు సాధారణంగా విశాఖపట్నం వరకు సూపర్‌ఫాస్ట్ సర్వీస్‌ను అందిస్తుంది.

2. ట్రైన్ నెం. 12703 హౌరా-సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్‌ప్రెస్: అక్టోబర్ 30, 2025న హౌరా నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు కూడా క్యాన్సిల్ అయింది. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కనెక్టివిటీకి కీలకమైనది.

 డైవర్షన్ రూట్లు: మూడు రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం
ప్రభావిత ప్రాంతాల నుంచి వెళ్లే అవకాశం లేకపోవడంతో  రైళ్లను ప్రత్యామ్నాయ రూట్లలో  నడుపుతున్నారు.  ఇందులో కొన్ని స్టేషన్లలో ఆగకుండా ప్రయాణం చేస్తాయి.

1.  ట్రైన్ నెం. 20833 విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్: అక్టోబర్ 29, 2025న విశాఖపట్నం నుంచి బయలుదేరే ఈ రైలు విజయవాడ,  గుంటూరు, పగిడిపల్లి రూట్‌లో డైవర్ట్ అవుతుంది. వరంగల్ స్టేషన్‌లో ఆగకుండా ప్రయాణం చేస్తుంది.

2.  ట్రైన్ నెం. 11019 ముంబై సిఎస్‌టీ-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్: అక్టోబర్ 28, 2025న ముంబై సిఎస్‌టీ నుంచి బయలుదేరిన ఈ రైలు మహబూబాబాద్, కాజీపేట, పగిడిపల్లి, భువనగిరి , గుంటూరు,  విజయవాడ రూట్‌లో డైవర్ట్ అవుతుంది. ఖమ్మం, మధిర స్టేషన్లలో ఆగకుండా ముందుకు వెళ్తుంది.

3.  ట్రైన్ నెం. 18046 చర్లపల్లి-శాలిమార్ ఎక్స్‌ప్రెస్: అక్టోబర్ 29, 2025న చర్లపల్లి నుంచి బయలుదేరే ఈ రైలు వరంగల్, కాజీపేట, పగిడిపల్లి,  భువనగిరి, గుంటూరు,  విజయవాడ రూట్‌లో డైవర్ట్ అవుతుంది. మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో ఆగకుండా ప్రయాణం చేస్తుంది.

 రీషెడ్యూలింగ్: వందే భారత్ రైలు  షెడ్యూల్‌లో మార్పు చేసి, ఆలస్యంగా బయలుదేరేలా ఏర్పాటు చేశారు.

1.  ట్రైన్ నెం. 20834 సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్: అక్టోబర్ 29, 2025న సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు షెడ్యూల్డ్ టైం 15.00 గంటలకు బదులుగా 20.00 గంటలకు రీషెడ్యూల్ చేశారు.  

# రైల్వే సలహా: ప్రయాణికులు జాగ్రత్త
దక్షిణ మధ్య రైల్వే ప్రకటన ప్రకారం, ప్రయాణికులు IRCTC వెబ్‌సైట్ లేదా 139 హెల్ప్‌లైన్‌ను సంప్రదించి తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించారు. క్యాన్సిల్డ్ రైళ్ల టికెట్లు పూర్తి రీఫండ్‌గా అందిస్తారు.  తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.   

ఈ మార్పులు రైల్వే భద్రత, ప్రయాణికుల సురక్షితత్వం కోసం తీసుకున్న చర్యలు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై నీళ్లు నిలబడిపోవడం , ట్రాకులు కొట్టుకుపోవడం వంటివి జరిగాయి.ి  ప్రభుత్వం, రైల్వే అధికారులు కలిసి పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Nutrition vs ideology in Bengal School Meals : బెంగాల్ మిడ్-డే మీల్స్ వివాదం - చేపల రాజకీయం నుంచి గుడ్డు రద్దు వరకు.. బీజేపీ వ్యూహం బెడసికొడుతుందా?
బెంగాల్ మిడ్-డే మీల్స్ వివాదం - చేపల రాజకీయం నుంచి గుడ్డు రద్దు వరకు.. బీజేపీ వ్యూహం బెడసికొడుతుందా?
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
Hyderabad Real Estate: అక్కడ ఇళ్లన్నీ కమర్షియల్ ! మాస్ వర్సెస్ క్లాస్ కాలనీలతో ఎల్.బి నగర్‌లో వింత రియల్ భూమ్
అక్కడ ఇళ్లన్నీ కమర్షియల్ ! మాస్ వర్సెస్ క్లాస్ కాలనీలతో ఎల్.బి నగర్‌లో వింత రియల్ భూమ్

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
Morning Phone Habit : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
Ambati Arjun: బుల్లితెర, బిగ్ బాస్ టు వెండి తెర.. మిస్టర్ పర్ఫెక్ట్ అంబటి అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు
బుల్లితెర, బిగ్ బాస్ టు వెండి తెర.. మిస్టర్ పర్ఫెక్ట్ అంబటి అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు
Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Embed widget