అన్వేషించండి

తిరుమలలో సీఎం జగన్ టూర్- ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం

Tirumala E-Busses: రాష్ట్ర ప్రభుత్వం తిరుమల-తిరుపతి మధ్య ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించింది. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బస్సులను ప్రారంభించారు.

తిరుపతి, తిరుమలలో ఏపి‌ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి రెండు‌ రోజుల‌ పర్యటనలో‌ భాగంగా ముందుగా తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ తల్లి వారిని దర్శించుకుని‌ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులు సీఎం జగన్మోహన్ రెడ్డిని పట్టు వస్త్రంతో సత్కరించి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. 

సాయంత్రం 6.40 గంటలకు శ్రీవారి పాదాల చెంత అలిపిరి వద్ద ఆర్టీసీ పర్యావరణ హిత విద్యుత్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈవే ట్రాన్స్ లిమిటెడ్ సంస్థ సరఫరా చేసిన ఈ -బస్ ను ఆర్టీసీ ఇప్పటికే విజయవంతంగా ట్రయన్ రన్ నిర్వహించింది. ఈ రోజు 9 ఈ - బస్సులను తిరుపతికి తీసుకు వచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలుత 10 ఈ-బస్సులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించారు. దశల వారీగా ఈ ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను 100కు పెంచనుంది ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ.

త్వరలోనే 100 బస్సులకు పెంపు..

అలిపిరి బస్ డిపో కేంద్రంగా ప్రజా రవాణా సంస్థ ఈ బస్సులను నడపనుంది. ఎలక్ట్రిక్ బస్సులు నడిపే కాంట్రాక్టు దక్కించుకున్న ఈవే ట్రాన్స్ లిమిటెడ్ కంపెనీ వీటిని 12ఏళ్ల పాటు నిర్వహించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 50 బస్సులను తిరుమల - తిరుపతి ఘాట్ రోడ్డు సర్వీసుల కోసం కేటాయించనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల కొండపైకి మరో 14 ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతారు. మరో 12 బస్సులను తిరుపతి నుంచి మదనపల్లికి, అలాగే.. తిరుపతి నుంచి కడపకు, నెల్లూరుకు 12సర్వీసులు చొప్పున నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. 

కిలోమీటరుకు కేవలం రూ.7.70 మాత్రమే

ఎలక్ట్రికల్ బస్సుల వల్ల కర్బన ఉద్గారాలు వెలువడవని ఉన్నత అధికారులు చెబుతున్నారు. దీని వల్ల కాలుష్యాన్ని పెద్ద ఎత్తున నియంత్రించవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ-బస్సుల నుంచి జీరో స్థాయిలో కర్బన ఉద్గారాలు వెలువడుతాయి. అంటే ఈ-బస్సుల నుంచి ఎలాంటి కర్బన ఉద్గారాలు వెలువడవు. 100 ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఏటా 5 వేల మెట్రిక్ టన్నులకుపైగా కర్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు ఎలక్ట్రికల్ బస్సుల వాడకం వల్ల కిలోమీటరుకు అయ్చే ఖర్చు భారీగా తగ్గుతుంది. ఏసీ ఇంద్ర బస్సుకు కిలోమీటరుకు రూ.28.75 ఇంధన వ్యయం అవుతుండగా.. అదే ఎలక్ట్రికల్ బస్సు వల్ల కిలోమీటరుకు కేవలం రూ.7.70 ఖర్చే అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఈ వ్యయం మరింత తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు.

రానున్న రోజుల్లో ఈవీ బ్యాటరీల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ బ్యాటరీల సాంకేతికత మెరుగు పడటంతోపాటు వాటి ధరలు దిగి వస్తాయి. దీని వల్ల రవాణా వ్యయం తగ్గుతుంది.

తిరుమల కొండపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంస్కరణలు అమలు చేస్తూ వస్తోంది. ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించింది. ఇప్పుడు అదే బాటలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించింది. తిరుమల-తిరుపతిని కేంద్రంగా చేసుకుని తొలిసారిగా ఎలక్ట్రికల్ బస్సు(ఈ- బస్సు)లను ప్రవేశ పెట్టింది.

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Sri Sundararaja Swamy: తిరుచానూరులో వార్షిక అవతారోత్సవాలు.. జులై 5 నుంచి 3 రోజుల పాటు ఆధ్యాత్మిక వైభవం!
తిరుచానూరులో వార్షిక అవతారోత్సవాలు.. జులై 5 నుంచి 3 రోజుల పాటు ఆధ్యాత్మిక వైభవం!
Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
Embed widget