అన్వేషించండి

తిరుమలలో సీఎం జగన్ టూర్- ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం

Tirumala E-Busses: రాష్ట్ర ప్రభుత్వం తిరుమల-తిరుపతి మధ్య ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించింది. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బస్సులను ప్రారంభించారు.

తిరుపతి, తిరుమలలో ఏపి‌ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి రెండు‌ రోజుల‌ పర్యటనలో‌ భాగంగా ముందుగా తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ తల్లి వారిని దర్శించుకుని‌ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులు సీఎం జగన్మోహన్ రెడ్డిని పట్టు వస్త్రంతో సత్కరించి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. 

సాయంత్రం 6.40 గంటలకు శ్రీవారి పాదాల చెంత అలిపిరి వద్ద ఆర్టీసీ పర్యావరణ హిత విద్యుత్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈవే ట్రాన్స్ లిమిటెడ్ సంస్థ సరఫరా చేసిన ఈ -బస్ ను ఆర్టీసీ ఇప్పటికే విజయవంతంగా ట్రయన్ రన్ నిర్వహించింది. ఈ రోజు 9 ఈ - బస్సులను తిరుపతికి తీసుకు వచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలుత 10 ఈ-బస్సులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించారు. దశల వారీగా ఈ ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను 100కు పెంచనుంది ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ.

త్వరలోనే 100 బస్సులకు పెంపు..

అలిపిరి బస్ డిపో కేంద్రంగా ప్రజా రవాణా సంస్థ ఈ బస్సులను నడపనుంది. ఎలక్ట్రిక్ బస్సులు నడిపే కాంట్రాక్టు దక్కించుకున్న ఈవే ట్రాన్స్ లిమిటెడ్ కంపెనీ వీటిని 12ఏళ్ల పాటు నిర్వహించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 50 బస్సులను తిరుమల - తిరుపతి ఘాట్ రోడ్డు సర్వీసుల కోసం కేటాయించనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల కొండపైకి మరో 14 ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతారు. మరో 12 బస్సులను తిరుపతి నుంచి మదనపల్లికి, అలాగే.. తిరుపతి నుంచి కడపకు, నెల్లూరుకు 12సర్వీసులు చొప్పున నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. 

కిలోమీటరుకు కేవలం రూ.7.70 మాత్రమే

ఎలక్ట్రికల్ బస్సుల వల్ల కర్బన ఉద్గారాలు వెలువడవని ఉన్నత అధికారులు చెబుతున్నారు. దీని వల్ల కాలుష్యాన్ని పెద్ద ఎత్తున నియంత్రించవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ-బస్సుల నుంచి జీరో స్థాయిలో కర్బన ఉద్గారాలు వెలువడుతాయి. అంటే ఈ-బస్సుల నుంచి ఎలాంటి కర్బన ఉద్గారాలు వెలువడవు. 100 ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఏటా 5 వేల మెట్రిక్ టన్నులకుపైగా కర్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు ఎలక్ట్రికల్ బస్సుల వాడకం వల్ల కిలోమీటరుకు అయ్చే ఖర్చు భారీగా తగ్గుతుంది. ఏసీ ఇంద్ర బస్సుకు కిలోమీటరుకు రూ.28.75 ఇంధన వ్యయం అవుతుండగా.. అదే ఎలక్ట్రికల్ బస్సు వల్ల కిలోమీటరుకు కేవలం రూ.7.70 ఖర్చే అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఈ వ్యయం మరింత తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు.

రానున్న రోజుల్లో ఈవీ బ్యాటరీల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ బ్యాటరీల సాంకేతికత మెరుగు పడటంతోపాటు వాటి ధరలు దిగి వస్తాయి. దీని వల్ల రవాణా వ్యయం తగ్గుతుంది.

తిరుమల కొండపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంస్కరణలు అమలు చేస్తూ వస్తోంది. ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించింది. ఇప్పుడు అదే బాటలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించింది. తిరుమల-తిరుపతిని కేంద్రంగా చేసుకుని తొలిసారిగా ఎలక్ట్రికల్ బస్సు(ఈ- బస్సు)లను ప్రవేశ పెట్టింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirumala Vasanthotsavam 2026: శ్రీవారికి ఉపశమనం కలిగించే అద్భుత ఉత్సవం! భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి, చరిత్ర, విశేషాలు!
శ్రీవారికి ఉపశమనం కలిగించే అద్భుత ఉత్సవం! భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి, చరిత్ర, విశేషాలు!
Andhra Pradesh News:ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
ఏపీలో 2.50 లక్షల గృహప్రవేశాలు! ఏప్రిల్‌ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు సీఎం ప్రకటన
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anirudh Reddy: డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
LPG Cylinder Price Hike: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
Karimnagar Jeevan Reddy: బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
Rules From 1 April 2026: ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
Property Rights: భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
YSRCP Supports Amaravati Bill: అమరావతి బిల్లుకు వైసీపీ వ్యతిరేకం కాదు.. ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అమరావతి బిల్లుకు వైసీపీ వ్యతిరేకం కాదు.. ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget