అన్వేషించండి

తిరుమలలో సీఎం జగన్ టూర్- ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం

Tirumala E-Busses: రాష్ట్ర ప్రభుత్వం తిరుమల-తిరుపతి మధ్య ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించింది. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బస్సులను ప్రారంభించారు.

తిరుపతి, తిరుమలలో ఏపి‌ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి రెండు‌ రోజుల‌ పర్యటనలో‌ భాగంగా ముందుగా తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ తల్లి వారిని దర్శించుకుని‌ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులు సీఎం జగన్మోహన్ రెడ్డిని పట్టు వస్త్రంతో సత్కరించి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. 

సాయంత్రం 6.40 గంటలకు శ్రీవారి పాదాల చెంత అలిపిరి వద్ద ఆర్టీసీ పర్యావరణ హిత విద్యుత్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈవే ట్రాన్స్ లిమిటెడ్ సంస్థ సరఫరా చేసిన ఈ -బస్ ను ఆర్టీసీ ఇప్పటికే విజయవంతంగా ట్రయన్ రన్ నిర్వహించింది. ఈ రోజు 9 ఈ - బస్సులను తిరుపతికి తీసుకు వచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలుత 10 ఈ-బస్సులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించారు. దశల వారీగా ఈ ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను 100కు పెంచనుంది ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ.

త్వరలోనే 100 బస్సులకు పెంపు..

అలిపిరి బస్ డిపో కేంద్రంగా ప్రజా రవాణా సంస్థ ఈ బస్సులను నడపనుంది. ఎలక్ట్రిక్ బస్సులు నడిపే కాంట్రాక్టు దక్కించుకున్న ఈవే ట్రాన్స్ లిమిటెడ్ కంపెనీ వీటిని 12ఏళ్ల పాటు నిర్వహించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 50 బస్సులను తిరుమల - తిరుపతి ఘాట్ రోడ్డు సర్వీసుల కోసం కేటాయించనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల కొండపైకి మరో 14 ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతారు. మరో 12 బస్సులను తిరుపతి నుంచి మదనపల్లికి, అలాగే.. తిరుపతి నుంచి కడపకు, నెల్లూరుకు 12సర్వీసులు చొప్పున నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. 

కిలోమీటరుకు కేవలం రూ.7.70 మాత్రమే

ఎలక్ట్రికల్ బస్సుల వల్ల కర్బన ఉద్గారాలు వెలువడవని ఉన్నత అధికారులు చెబుతున్నారు. దీని వల్ల కాలుష్యాన్ని పెద్ద ఎత్తున నియంత్రించవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ-బస్సుల నుంచి జీరో స్థాయిలో కర్బన ఉద్గారాలు వెలువడుతాయి. అంటే ఈ-బస్సుల నుంచి ఎలాంటి కర్బన ఉద్గారాలు వెలువడవు. 100 ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఏటా 5 వేల మెట్రిక్ టన్నులకుపైగా కర్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు ఎలక్ట్రికల్ బస్సుల వాడకం వల్ల కిలోమీటరుకు అయ్చే ఖర్చు భారీగా తగ్గుతుంది. ఏసీ ఇంద్ర బస్సుకు కిలోమీటరుకు రూ.28.75 ఇంధన వ్యయం అవుతుండగా.. అదే ఎలక్ట్రికల్ బస్సు వల్ల కిలోమీటరుకు కేవలం రూ.7.70 ఖర్చే అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఈ వ్యయం మరింత తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు.

రానున్న రోజుల్లో ఈవీ బ్యాటరీల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ బ్యాటరీల సాంకేతికత మెరుగు పడటంతోపాటు వాటి ధరలు దిగి వస్తాయి. దీని వల్ల రవాణా వ్యయం తగ్గుతుంది.

తిరుమల కొండపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంస్కరణలు అమలు చేస్తూ వస్తోంది. ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించింది. ఇప్పుడు అదే బాటలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించింది. తిరుమల-తిరుపతిని కేంద్రంగా చేసుకుని తొలిసారిగా ఎలక్ట్రికల్ బస్సు(ఈ- బస్సు)లను ప్రవేశ పెట్టింది.

టాప్ హెడ్ లైన్స్

JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
VB GRAM G Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!
ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!
Prasna Ravan Bail and Arrest: అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ మళ్లీ అరెస్టు! 2025 నాటి కేసులో చర్యలు!
అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ మళ్లీ అరెస్టు! 2025 నాటి కేసులో చర్యలు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Polavaram MLA Attacked: ​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
​ఏలూరు జనసేన ఆఫీస్‌ వద్ద ఎమ్మెల్యేపై దాడికి యత్నం! సొంత పార్టీ నేతలపైనే చిర్రి బాలరాజు ఫైర్‌!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Embed widget