అన్వేషించండి

తిరుమలలో సీఎం జగన్ టూర్- ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభం

Tirumala E-Busses: రాష్ట్ర ప్రభుత్వం తిరుమల-తిరుపతి మధ్య ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించింది. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బస్సులను ప్రారంభించారు.

తిరుపతి, తిరుమలలో ఏపి‌ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి రెండు‌ రోజుల‌ పర్యటనలో‌ భాగంగా ముందుగా తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ తల్లి వారిని దర్శించుకుని‌ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులు సీఎం జగన్మోహన్ రెడ్డిని పట్టు వస్త్రంతో సత్కరించి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. 

సాయంత్రం 6.40 గంటలకు శ్రీవారి పాదాల చెంత అలిపిరి వద్ద ఆర్టీసీ పర్యావరణ హిత విద్యుత్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈవే ట్రాన్స్ లిమిటెడ్ సంస్థ సరఫరా చేసిన ఈ -బస్ ను ఆర్టీసీ ఇప్పటికే విజయవంతంగా ట్రయన్ రన్ నిర్వహించింది. ఈ రోజు 9 ఈ - బస్సులను తిరుపతికి తీసుకు వచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలుత 10 ఈ-బస్సులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించారు. దశల వారీగా ఈ ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను 100కు పెంచనుంది ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ.

త్వరలోనే 100 బస్సులకు పెంపు..

అలిపిరి బస్ డిపో కేంద్రంగా ప్రజా రవాణా సంస్థ ఈ బస్సులను నడపనుంది. ఎలక్ట్రిక్ బస్సులు నడిపే కాంట్రాక్టు దక్కించుకున్న ఈవే ట్రాన్స్ లిమిటెడ్ కంపెనీ వీటిని 12ఏళ్ల పాటు నిర్వహించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 50 బస్సులను తిరుమల - తిరుపతి ఘాట్ రోడ్డు సర్వీసుల కోసం కేటాయించనున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల కొండపైకి మరో 14 ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతారు. మరో 12 బస్సులను తిరుపతి నుంచి మదనపల్లికి, అలాగే.. తిరుపతి నుంచి కడపకు, నెల్లూరుకు 12సర్వీసులు చొప్పున నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. 

కిలోమీటరుకు కేవలం రూ.7.70 మాత్రమే

ఎలక్ట్రికల్ బస్సుల వల్ల కర్బన ఉద్గారాలు వెలువడవని ఉన్నత అధికారులు చెబుతున్నారు. దీని వల్ల కాలుష్యాన్ని పెద్ద ఎత్తున నియంత్రించవచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ-బస్సుల నుంచి జీరో స్థాయిలో కర్బన ఉద్గారాలు వెలువడుతాయి. అంటే ఈ-బస్సుల నుంచి ఎలాంటి కర్బన ఉద్గారాలు వెలువడవు. 100 ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఏటా 5 వేల మెట్రిక్ టన్నులకుపైగా కర్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు ఎలక్ట్రికల్ బస్సుల వాడకం వల్ల కిలోమీటరుకు అయ్చే ఖర్చు భారీగా తగ్గుతుంది. ఏసీ ఇంద్ర బస్సుకు కిలోమీటరుకు రూ.28.75 ఇంధన వ్యయం అవుతుండగా.. అదే ఎలక్ట్రికల్ బస్సు వల్ల కిలోమీటరుకు కేవలం రూ.7.70 ఖర్చే అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఈ వ్యయం మరింత తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు.

రానున్న రోజుల్లో ఈవీ బ్యాటరీల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ బ్యాటరీల సాంకేతికత మెరుగు పడటంతోపాటు వాటి ధరలు దిగి వస్తాయి. దీని వల్ల రవాణా వ్యయం తగ్గుతుంది.

తిరుమల కొండపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా సంస్కరణలు అమలు చేస్తూ వస్తోంది. ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించింది. ఇప్పుడు అదే బాటలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించింది. తిరుమల-తిరుపతిని కేంద్రంగా చేసుకుని తొలిసారిగా ఎలక్ట్రికల్ బస్సు(ఈ- బస్సు)లను ప్రవేశ పెట్టింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Khaleda Zia Net Worth: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
Mohan lal : మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
Priyanka Gandhi Son Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..

వీడియోలు

Monty Panesar about Gautam Gambhir | గంభీర్ పై మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill Highest Scorer in Test Format | టెస్టుల్లో టాప్‌ స్కోరర్‌గా గిల్
Hardik, Bumrah out of Ind vs NZ ODI Series | న్యూజిలాండ్ సిరీస్ కు సీనియర్లు దూరం ?
Abhishek Sharma 45 Sixes in 60 Minutes | ప్రపంచ కప్‌ ముందు అభిషేక్ విధ్వంసం
The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Khaleda Zia Net Worth: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
Mohan lal : మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
Priyanka Gandhi Son Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
Mysore: ఇలా వచ్చారు..అలా పది కోట్ల బంగారం దోచుకెళ్లారు - మైసూరులో సినిమాటిక్ రాబరీ ! వైరల్ వీడియో
ఇలా వచ్చారు..అలా పది కోట్ల బంగారం దోచుకెళ్లారు - మైసూరులో సినిమాటిక్ రాబరీ ! వైరల్ వీడియో
New Year South OTT Releases: 'ఎకో' నుంచి 'మోగ్లీ' వరకూ... ఈ వారం ఓటీటీలో సౌత్ సినిమాల సందడి - ఎందులో ఏవి స్ట్రీమింగ్‌ అవుతాయంటే?
'ఎకో' నుంచి 'మోగ్లీ' వరకూ... ఈ వారం ఓటీటీలో సౌత్ సినిమాల సందడి - ఎందులో ఏవి స్ట్రీమింగ్‌ అవుతాయంటే?
Beauty Movie OTT : 3 నెలల తర్వాత ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్ - 'ది రాజా సాబ్' డైరెక్టర్ నిర్మించిన 'బ్యూటీ'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
3 నెలల తర్వాత ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్ - 'ది రాజా సాబ్' డైరెక్టర్ నిర్మించిన 'బ్యూటీ'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Hottest Place on Earth : భూమిపై అత్యంత ప్రమాదకరమైన వేడి ప్రాంతం ఇదే.. 49 డిగ్రీల వేడితో పాటు విష వాయువులు కూడా
భూమిపై అత్యంత వేడి ప్రదేశం ఇదే.. అక్కడ చలి ఎప్పుడూ ఉండదట, విషపూరితమైనది కూడా
Embed widget