అన్వేషించండి

Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయం క్యూ లైన్లో కొట్టుకున్న భక్తులు, వీడియో వైరల్

Andhra Pradesh News | కలియుగ దైవం తిరుమల శ్రీవారి క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. వేసవి కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. శనివారం క్యూ లైన్లో భక్తులు కొట్టుకున్నారు.

Devotees clash in queue in front of Tirumala Srivari Temple | తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం ముందు క్యూ లైన్ లో అపశ్రుతి జరిగింది. భక్తులు గొడవకు దిగి కొట్టుకున్నారు. శనివారం సాయంత్రం క్యూలైన్లో చిన్న పిల్లలతో వస్తున్న మహిళలను తోటి భక్తులు తోసి వేశారు. దాంతో గొడవ మొదలైంది. పిల్లలతో వస్తున్న మహిళను ఎలా తోసివేస్తావంటూ తోటి భక్తులతో ఈమె బంధువులు గొడవకు దిగారు. అక్కడే ఉన్న విజిలెన్స్, పోలీస్ సిబ్బంది వారిని అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా భక్తులు వినకుండా క్యూ లైన్లోనే భక్తులు కొట్టుకున్నారు. శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణ భక్తులకి ఎంత సర్ది చెప్పినా వినకుండా గొడవకు దిగారు. వెంటనే విజిలెన్స్ అధికారులు క్యూలైన్ వద్దకి చేరుకొని భక్తుల్ని పక్కకు తీసుకెళ్లి సర్దిచెప్పడంతో గొడవ సద్దమణిగింది.


Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయం క్యూ లైన్లో కొట్టుకున్న భక్తులు, వీడియో వైరల్

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రానికి భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగతోంది. అసలే స్కూళ్లు, కాలేజీలకు సైతం వేసవి సెలవులు ఇవ్వడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇటీవల ఏపీ, తెలంగాణలో టెన్త్, ఇంటర్ ఫలితాలు కూడా విడుదల అనంతరం తిరుమలలో రద్దీ పెరిగింది. తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం చిన్నపిల్లలతో వస్తున్న మహిళను పొరపాటున వేరే భక్తులు తోసివేయడంతో గొడవ జరిగింది. మహిళను తోసేస్తారా అంటూ ఆమె తరఫు వారు గొడవపడ్డారు. భక్తులు కొట్టుకోవడంతో వెంటనే పోలీసులు, విజిలెన్స్ అధికారులు వారిని వారించి క్యూ లైన్ వద్ద పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. 

అసలే వీకెండ్ కావడంతో శనివారం, ఆదివారాల్లో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఓ వైపు వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ పెరుగుతుందని, వీఐపీ బ్రేక్ దర్శనాలలో టీటీడీ ఇటీవల మార్పులు చేసింది. మే 01 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాల్లో కొంచెం టైమింగ్ మారింది. వేసవి సెలవుల రద్దీ కారణంగా తిరుమలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే మే 1వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేసింది టీటీడీ. ఈ మేరకు టీటీడీ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది.   

అసలే తల్లిదండ్రులతో కలిసి పిల్లలు వేసవిలో శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున వస్తుంటారు. తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించాలని టీటీడీ బోర్డు భావించింది. మే 1 నుంచి జూలై 15 వరకు తిరుమలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు పరిమితం చేశారు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 6 నుంచి అమలు చేస్తోంది టీటీడీ. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

RK Roja: మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు.. ఈ 30న విచారణ
మాజీ మంత్రి ఆర్‌కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు.. ఈ 30న విచారణ
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Tirumala Laddu Ghee Adulteration Case: తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు! అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశం!
తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు! అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశం!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget