అన్వేషించండి

Tirumal Laddu Row: తిరుపతి లడ్డూ వివాదంతో అయోధ్య రామాలయ పూజారి సంచలన వ్యాఖ్యలు- ప్రధాన దేవాలయాల్లో బయట ప్రసాధాలు నిషేధం

Tirumala Laddu Tow: తిరుమల లడ్డూ కల్తీ కుట్ర వెనుక అంతర్జాతీయ శక్తులు ఉన్నాయని అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆరోపించారు. గుడుల్లో ప్రసాదం పూర్తిగా పూజారుల పర్యవేక్షణలో తయారు చేయాలని సూచించారు.

Ayodhya Ram temple Main Priest React On Tirumala Laddu Controversy: తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రసాదం తయారీపై చర్చకు దారి తీసింది. గుడుల్లో ఇచ్చే ప్రసాదాన్ని పూర్తిగా ఆలయ పూజారుల పర్యవేక్షణలోనే తయారు చేయాలని అయోధ్య రామాలయ పూజారి సత్యేంద్ర దాస్‌ డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని ఆలయాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని సూచించారు.

భారత్‌లోని ఆలయాలపై విదేశీ శక్తుల కుట్ర:

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆలయాల్లో ప్రసాదాల తయారీపై నిఘా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రసాదం తయారీ పంపిణీ విషయంలో మార్పులు తేవాల్సిన అవసరాన్ని పూజారులు గుర్తు చేస్తున్నారు. బయటి వ్యక్తులు లేదా ఏజెన్సీలు ఆలయాల్లో ప్రసాదం తయారు చేయడంపై పూర్తిగా నిషేధం విధించాలని అయోధ్య రామాలయ పూజారి సత్యేంద్ర దాస్‌ డిమాండ్ చేశారు. ఆలయాల్లో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ఆలయ పూజారుల పర్యవేక్షణలోనే ప్రసాదం రెడీ కావాలని అన్నారు. దేశవ్యాప్తంగా అమ్ముతున్న ఆయిల్‌, నెయ్యిపై కూడా తనిఖీలు జరగాలన్నారు. దేవేరులకు ఇచ్చే ప్రసాదాల్లో అన్య పదార్థాలు కలపడం ద్వారా గుడుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతున్నట్లు సత్యేంద్ర దాస్‌ అనుమానం వ్యక్తం చేశారు.

తిరుమల లడ్డు కల్తీ నేపథ్యంలో బయట తయారయ్యే ప్రసాదాలపై ఆంక్షలు:

తిరుమల లడ్డుకు వాడే నెయ్యిలో కల్తీ జరిగిన తరుణంలో మధుర ధర్మ రక్ష సంఘ్ కీలక నిర్ణయం తీసుకుంది. బయట తయారయ్యే స్వీట్లు లేదా ఇతర వంటకాలు ఏవీ దేవుడు దగ్గర ప్రసాదం ఇవ్వడానికి లేదని నిర్ణయించింది. సనాతన కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని తిరిగి పురుద్ధరిస్తున్నట్లు తెలిపింది. దేవేరులకు ఆలయంలో తయారైన ప్రసాదం మాత్రమే ఇవ్వాలని తీర్మానించింది. పూలు, పళ్లు కూడా ఆలయ పరిసర ప్రాంతాల్లో సేకరించాలని మాల్స్ లేదా షాపుల్లో కొన్నవి వాడడానికి లేకుండా నిషేధం విధిస్తున్నట్లు సంఘ్ నేషనల్ ప్రెసిడెంట్ సౌరభ్‌ గౌర్ తెలిపారు. ప్రసాదం తయారీలో ఈ విధమైన సంస్కరణలు తప్పవని అన్నారు. మత పెద్దల దగ్గర ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదిరిందని అన్నారు. ఇకపై మథుర ఆలయంలో సాత్విక ప్రసాదాలే అందిస్తారని ఆయన చెప్పారు.

ప్రయాగ్‌రాజ్‌లోని ఆలయాల్లోకి భక్తులు బయట నుంచి స్వీట్లు తేవడంపై నిషేధం:

ప్రయాగ్‌రాజ్‌ సంగమ్‌ సిటీలోని అలోప్‌ శక్తి దేవి, బడే హనుమాన్‌, మన్‌కామేశ్వర్ సహా అనేక ఆలయాల్లో భక్తులు బయట కొన్న స్వీట్లను ఆలయంలోకి తేవడంపై నిషేధం విధించారు. భక్తులు కేవలం టెంకాయలు, పూలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ మాత్రమే తేవాలని ఆలయ ట్రస్టు నిర్ణయం తీసుకున్నట్లు లలితా దేవి ఆలయ ప్రధాన పూజారి శివ్‌ మూరత్‌ మిశ్ర వివరించారు. సంగమ్‌ సిటీలోని టెంపుల్ కారిడార్‌ పూర్తైన తర్వాత ఆలయ ట్రస్టులే ప్రసాదంగా లడ్డూ-పెడా తయారు చేసేలా నిర్ణయం జరిగినట్లు బడే హనుమాన్ ఆలయ పూజారి తెలిపారు. లక్నో లోని కొన్ని ఆలయాల్లో ఇప్పటికే బయటన కొన్న ప్రసాదాలపై నిషేధం విధించారు. భక్తులు ఇళ్లల్లో తయారు చేసిన ప్రసాదాలనే ఆలయానికి తీసుకు రావాలని నిబంధన పెట్టారు.

తిరుమల లడ్డు కల్తీ అంశం బయట ప్రపంచానికి తెలిసిన తర్వాత దేశ వ్యాప్తంగా ఆలయాల్లో దేవుడుకి ఇస్తున్న ప్రసాదాలపై నిఘా పెరిగింది. బయట నుంచి తెస్తున్న ప్రసాదాల్లో వాడిన నెయ్యి నూనె తయారీపై ఆందోళన ఉండగా భక్తులు కూడా ఇళ్లలోనే ప్రసాదం తయారు చేసుకొని ఆలయానికి రావడానికి అలవాటు పడుతున్నారు.

Also Read: తిరుమల డిక్లరేషన్ చుట్టూ ఎందుకీ వివాదం? జగన్‌ నుంచి డిక్లరేషన్ తీసుకుంటారా?

టాప్ హెడ్ లైన్స్

AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget