Breaking News: భర్త పైశాచికం.. భార్య ఉరి వేసుకుంటే వీడియో తీసి బంధువులకు పంపించిన శాడిస్టు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 21న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
ఏపీ ప్రభుత్వ బడుల్లో బుధవారం పేరెంట్స్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, రెసిడెన్షియల్, కేజీబీవీ, ఏపీ మోడల్ స్కూల్స్, ప్రైవేట్ ఎయిడెడ్, పాఠశాలల్లో ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఫలితాలు ప్రకటన, 1.30 గంటలకు ఛైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, రెండు గంటలకు ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం మూడు నుంచి 3.30 గంటల మధ్య తొలి పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.
భర్త పైశాచికం.. భార్య ఉరి వేసుకుంటే వీడియో తీసి బంధువులకు పంపించిన శాడిస్టు
నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. భర్త కళ్లెదుటే ఓ భార్య ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ఆపాల్సిన భర్త మాత్రం ఆత్మహత్య ఘటనను వీడియో తీస్తూ పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఆ వివాహిత ఆత్మకూరు మెప్మాలో రిసోర్స్ పర్సన్గా పని చేస్తోంది. ఆమె పేరు కొండమ్మ. భార్య ఆత్మహత్య చేసుకున్న వీడియోను బంధువులకు సైతం షేర్ చేసి పైశాచిక ఆనందం పొందిన భర్త.
MAA ఎన్నికల హీట్.. రేపు ప్యానెల్ సభ్యులను ప్రకటించనున్న మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందడి మొదలైంది. రేపు తన ప్యానెల్ సభ్యులను నటుడు మంచు విష్ణు ప్రకటించనున్నారు. ఇప్పటివకే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా బాబు మోహన్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు.. మంచు విష్ణు ప్యానెల్ లో ఉన్నారు. అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించనున్నారు.





















