అన్వేషించండి

Amaravati : అమరావతిదే అంతిమ గెలుపు - శంకుస్థాపనకు ఏడేళ్లు ! చంద్రబాబు స్పందన ఇదే

అమరావతే ఎప్పటికైనా గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శంకుస్థాపన చేసి ఏడేళ్లయిన సందర్భంగా భావోద్వేగ ట్వీట్ చేశారు.

 

Amaravati :     ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి శంఖుస్ధాపన చేసి నేటికి ఏడేళ్లు పూర్తయ్యాయి. 2015లో ఇదే రోజు అమరావతిని రాజధానిగా సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో కలిసి శంఖుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణాన్ని గుర్తుచేసుకుంటూ ఇవాళ వరుస ట్వీట్లు చేశారు. వీటిలో చంద్రబాబు అమరావతి రాజధాని ఎలా ప్రారంభమై, ఎలా ఆగిపోయిందో గుర్తుచేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందని, కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామని, పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అమరావతి నిలుస్తుందని..గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. 

రాష్ట్ర విభజన తర్వాత 2014  సెప్టెంబరు 3న  రాజధాని అమరావతి ప్రాంతాన్ని నిర్ణయిస్తూ అసెంబ్లీలో తీర్మానం  చేశారు. ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. మా ప్రాంతానికి రాజీనామా కావాలని ఏ ప్రాంతం వారూ ఆందోళన చేయలేదు. ట్టంలో పేర్కొన్నట్లే సీఆర్డీఏను ఏర్పాటు చేసి.. 7317 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కేపిటల్ రీజియన్ ను.. 217.23 చదరపుకిలోమీటర్లలో రాజధాని నగరాన్ని నోటిఫై చేసింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని ఎంపిక చేయటం.. దానిని రైతుల వద్ద నుంచి తీసుకోవాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాజధాని పరిధిలోని రైతులు స్పందించారు. అమరావతి భావనకు ఒక దారి ఏర్పడింది. రెండు నెలల వ్యవధిలో అమరావతి ప్రాంతానికి చెందిన 20510మంది రైతులు 32469 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు. ఏడేళ్ల క్రితం అక్టోబరు 22న ఉద్ధండరాయునిపాలెం వద్ద రాజధాని నిర్మణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.   

   
అయితే 2019లో  జగన్ ముఖ్యమంత్రి కావడంతో రాజధాని నిర్మాణం ఆగిపోయింది.  అదే ఏడాది డిసెంబరు 17న అమరావతికి బదులుగా మూడు రాజధానుల ప్రతిపాదనను అసెంబ్లీలో సీఎం జగన్ చేశారు   ఏపీ రాజధానిగా నిర్ణయించిన అమరావతి కోసం వేలాది ఎకరాలు ఇచ్చిన రైతులు ఒక్కసారిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో షాక్ తిన్నారు. మూడు ప్రాంతాల్ని సమంగా చూడాలన్న పేరుతో మొదలైన మూడు రాజధానుల కాన్సెప్టు కొత్త గందరగోళానికి తెర తీసింది. రైతులు ఉద్యమబాట పట్టారు. ఇప్పుడు ఏపీ అధికారికంగా అమరావతే రాజధాని. కానీ ప్రభుత్వం అంగీకరించడం లేదు. అందుకే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Araku Special Trains: అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
Embed widget