అన్వేషించండి

Amaravati : అమరావతిదే అంతిమ గెలుపు - శంకుస్థాపనకు ఏడేళ్లు ! చంద్రబాబు స్పందన ఇదే

అమరావతే ఎప్పటికైనా గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శంకుస్థాపన చేసి ఏడేళ్లయిన సందర్భంగా భావోద్వేగ ట్వీట్ చేశారు.

 

Amaravati :     ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి శంఖుస్ధాపన చేసి నేటికి ఏడేళ్లు పూర్తయ్యాయి. 2015లో ఇదే రోజు అమరావతిని రాజధానిగా సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో కలిసి శంఖుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణాన్ని గుర్తుచేసుకుంటూ ఇవాళ వరుస ట్వీట్లు చేశారు. వీటిలో చంద్రబాబు అమరావతి రాజధాని ఎలా ప్రారంభమై, ఎలా ఆగిపోయిందో గుర్తుచేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందని, కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామని, పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అమరావతి నిలుస్తుందని..గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. 

రాష్ట్ర విభజన తర్వాత 2014  సెప్టెంబరు 3న  రాజధాని అమరావతి ప్రాంతాన్ని నిర్ణయిస్తూ అసెంబ్లీలో తీర్మానం  చేశారు. ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. మా ప్రాంతానికి రాజీనామా కావాలని ఏ ప్రాంతం వారూ ఆందోళన చేయలేదు. ట్టంలో పేర్కొన్నట్లే సీఆర్డీఏను ఏర్పాటు చేసి.. 7317 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కేపిటల్ రీజియన్ ను.. 217.23 చదరపుకిలోమీటర్లలో రాజధాని నగరాన్ని నోటిఫై చేసింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని ఎంపిక చేయటం.. దానిని రైతుల వద్ద నుంచి తీసుకోవాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాజధాని పరిధిలోని రైతులు స్పందించారు. అమరావతి భావనకు ఒక దారి ఏర్పడింది. రెండు నెలల వ్యవధిలో అమరావతి ప్రాంతానికి చెందిన 20510మంది రైతులు 32469 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు. ఏడేళ్ల క్రితం అక్టోబరు 22న ఉద్ధండరాయునిపాలెం వద్ద రాజధాని నిర్మణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.   

   
అయితే 2019లో  జగన్ ముఖ్యమంత్రి కావడంతో రాజధాని నిర్మాణం ఆగిపోయింది.  అదే ఏడాది డిసెంబరు 17న అమరావతికి బదులుగా మూడు రాజధానుల ప్రతిపాదనను అసెంబ్లీలో సీఎం జగన్ చేశారు   ఏపీ రాజధానిగా నిర్ణయించిన అమరావతి కోసం వేలాది ఎకరాలు ఇచ్చిన రైతులు ఒక్కసారిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో షాక్ తిన్నారు. మూడు ప్రాంతాల్ని సమంగా చూడాలన్న పేరుతో మొదలైన మూడు రాజధానుల కాన్సెప్టు కొత్త గందరగోళానికి తెర తీసింది. రైతులు ఉద్యమబాట పట్టారు. ఇప్పుడు ఏపీ అధికారికంగా అమరావతే రాజధాని. కానీ ప్రభుత్వం అంగీకరించడం లేదు. అందుకే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Congress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABPCM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Embed widget