By: ABP Desam | Updated at : 29 Sep 2023 03:52 PM (IST)
మోత మోగిద్దామంటూ సోషల్ మీడియాలో టీడీపీ కొత్త ప్రచారం
TDP News : మోతమోగిద్దాం పేరుతో టీడీపీ ఓ కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చింది. నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదని.. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందేనని టీడీపీ తెలిపింది. చంద్రబాబు గారికి మద్దతుగా... సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుండి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్ లో ఉన్న సైకో జగన్ కి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మీరు ఏం చేసినా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని టీడీపీ సూచించింది.
అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా 30 వ తేదీ… pic.twitter.com/K0J6bo5RBY
— Lokesh Nara (@naralokesh) September 29, 2023
అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా 30 వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలకు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్ధం వినిపిద్దామని నారా లోకేష్ పిలుపునిచ్చారు.
🧟♂️నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే 🔊. చంద్రబాబు గారికి మద్దతుగా... సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుండి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్ లో ఉన్న సైకో జగన్ కి వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించండి📢🎤. మీరు ఏం చేసినా దాన్ని వీడియో… pic.twitter.com/3WMuhPdw8P
— Telugu Desam Party (@JaiTDP) September 29, 2023
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున సోషల్ మీడియలో ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని ప్రచారం చేస్తున్నరు. స్కిల్ కేసులో ఉన్న నిజాలు అంటూ అన్ని డాక్యుమెంట్లతో వెబ్ సైట్ కూడా ప్రారంభించారు. న్యాయస్థానాల్లో సీఐడీ తరపు లాయర్ల వాదనల సారాంశాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఎక్కడా అవినీతి జరగకపోయినా నిధుల దుర్వినియోగం అని.. డబ్బు మళ్లింపు అని రకరకాల మాటలు మార్చుతూ.. రాజకీయ కుట్రతో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
ఇప్పుడు వైసీపీ ఆరోపణలపై నేరుగా ఎదురుదాడికి దిగుతున్నారు. సోషల్ మీడియో వేదికగా మోతమోగిద్దామని పిలుపనివ్వడంతో పార్టీ శ్రేణులన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.
American Telugu Association: తెలుగు రాష్ట్రాల్లో ఆటా ఆధ్వర్యంలో 20 రోజులు సేవా కార్యక్రమాలు
Top Headlines Today: టికెట్ ఇవ్వకుంటే ఆప్షన్ బి ఉందన్న బుద్ధా వెంకన్న! ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Buddha Venkanna: 'విజయవాడ పశ్చిమ నుంచే పోటీ చేస్తా' - టికెట్ ఇవ్వకుంటే ఆప్షన్ బి ఉందంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?
ఛత్తీస్గఢ్ సీఎం అభ్యర్థిపై త్వరలోనే క్లారిటీ,తుది నిర్ణయం తీసుకోనున్న హైకమాండ్!
Singareni Elections: సింగరేణి ఎన్నికల కోసం రాహుల్ గాంధీ, పోలింగ్ తేదీ ఖరారు - మంత్రి వెల్లడి
India vs England Women : సిరీస్ ఇంగ్లాండ్ మహిళలదే, రెండో టీ 20లోనూ భారత్ చిత్తు
/body>