అన్వేషించండి

ఏపీ విద్యార్థులకు సిలబస్​ కుదింపు.. సర్క్యులర్‌ జారీ చేసిన ప్రభుత్వం

పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 2021-22 ఏడాదికి సంబంధించి సిలబస్ తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది.

పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 2021-22 ఏడాదికి సంబంధించి సిలబస్ తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. 3 నుంచి 10 తరగతులకు సిలబస్​ను తగ్గించినట్లు పేర్కొంది. 3 నుంచి 9 తరగతులకు 15 శాతం.. 10వ తరగతికి 20 శాతం సిలబస్ తగ్గించినట్లు తెలిపింది. దీంతో పాటుగా.. పాఠశాల పని దినాల అకడమిక్ కేలండర్‌ సైతం కుదించింది. కేలండర్‌ను 31 వారాల నుంచి 27 వారాలకు తగ్గించినట్లు పేర్కొంది. ఈసారి 2 భాగాలుగా అకడమిక్ కేలండర్​ను రూపొందించినట్లు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు వెల్లడించారు. కోవిడ్ కారణంగా పాఠశాలలు ఆలస్యంగా తెరుచుకున్న నేపథ్యంలో సిలబస్ కుదించినట్లు తెలుస్తోంది. 

ఏపీలో కోవిడ్ తీవ్రత కారణంగా ఏడాదిన్నక క్రితం మూతపడిన పాఠశాలలు.. ఆగస్ట్ 16 నుంచి పున:ప్రారంభమైన విషయం తెలిసిందే. పాఠశాలల్లో కోవిడ్‌ 19 నిబంధనలను కచ్చితంగా పాటించడంతో పాటు విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి మాస్క్ తప్పనిసరి అనే నిబంధన కూడా విధించారు. అయితే పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు పలువురు విద్యార్థులు, టీచర్ల కోవిడ్ మహమ్మారి బారినపడ్డారు. దీనిపై ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. కేసులు నమోదైన పాఠశాలలపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు. కోవిడ్ కేసులు వచ్చిన పాఠశాలల్లో విడతల వారీగా క్లాసులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 

పదో తరగతి విద్యార్థులకు ఇకపై మార్కులే..
ఏపీలో 10వ తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఉండవని ప్రభుత్వం వెల్లడించింది. ఇకపై టెన్త్ విద్యార్థులకు గ్రేడ్ల స్థానంలో మళ్లీ మార్కుల విధానమే ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 2010లో తీసుకొచ్చిన గ్రేడింగ్‌ విధానానికి స్వస్తి పలికినట్లు పేర్కొంది. ప్రవేశాలు, నియామకాల్లో ప్రతిభను గుర్తించేందుకు 2020 నుంచి మార్కులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఒకే గ్రేడ్ ఎక్కువ మందికి వచ్చినప్పుడు ప్రవేశాలు, నియామకాల్లో సమస్యలు వస్తున్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో గ్రేడ్ల స్థానంలో మార్కులు ఇవ్వాలనే ప్రతిపాదనలను తీసుకొచ్చినట్లు తెలిపింది.  

Also Read: Weather Updates: ఏపీకి మరో 3 రోజులు వర్షాలే.. ఈ జిల్లాల వారికి అలర్ట్, తెలంగాణలో వానలు ఈ ప్రాంతాల్లో..

Also Read: Pavan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ బర్త్‌ డే స్పెషల్.. జనంలో ఉంటాడు.. జనంలా ఉంటాడు, ఇదీ పవర్ స్టారంటే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
BR Naidu Deepfake Videos: టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు
టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు డీప్ ఫేక్ వీడియోలు.. సైబర్ క్రైమ్‌కు బీఆర్ నాయుడు ఫిర్యాదు

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Embed widget