అన్వేషించండి

ఏపీ విద్యార్థులకు సిలబస్​ కుదింపు.. సర్క్యులర్‌ జారీ చేసిన ప్రభుత్వం

పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 2021-22 ఏడాదికి సంబంధించి సిలబస్ తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది.

పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 2021-22 ఏడాదికి సంబంధించి సిలబస్ తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. 3 నుంచి 10 తరగతులకు సిలబస్​ను తగ్గించినట్లు పేర్కొంది. 3 నుంచి 9 తరగతులకు 15 శాతం.. 10వ తరగతికి 20 శాతం సిలబస్ తగ్గించినట్లు తెలిపింది. దీంతో పాటుగా.. పాఠశాల పని దినాల అకడమిక్ కేలండర్‌ సైతం కుదించింది. కేలండర్‌ను 31 వారాల నుంచి 27 వారాలకు తగ్గించినట్లు పేర్కొంది. ఈసారి 2 భాగాలుగా అకడమిక్ కేలండర్​ను రూపొందించినట్లు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు వెల్లడించారు. కోవిడ్ కారణంగా పాఠశాలలు ఆలస్యంగా తెరుచుకున్న నేపథ్యంలో సిలబస్ కుదించినట్లు తెలుస్తోంది. 

ఏపీలో కోవిడ్ తీవ్రత కారణంగా ఏడాదిన్నక క్రితం మూతపడిన పాఠశాలలు.. ఆగస్ట్ 16 నుంచి పున:ప్రారంభమైన విషయం తెలిసిందే. పాఠశాలల్లో కోవిడ్‌ 19 నిబంధనలను కచ్చితంగా పాటించడంతో పాటు విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి మాస్క్ తప్పనిసరి అనే నిబంధన కూడా విధించారు. అయితే పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు పలువురు విద్యార్థులు, టీచర్ల కోవిడ్ మహమ్మారి బారినపడ్డారు. దీనిపై ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. కేసులు నమోదైన పాఠశాలలపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు. కోవిడ్ కేసులు వచ్చిన పాఠశాలల్లో విడతల వారీగా క్లాసులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 

పదో తరగతి విద్యార్థులకు ఇకపై మార్కులే..
ఏపీలో 10వ తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఉండవని ప్రభుత్వం వెల్లడించింది. ఇకపై టెన్త్ విద్యార్థులకు గ్రేడ్ల స్థానంలో మళ్లీ మార్కుల విధానమే ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 2010లో తీసుకొచ్చిన గ్రేడింగ్‌ విధానానికి స్వస్తి పలికినట్లు పేర్కొంది. ప్రవేశాలు, నియామకాల్లో ప్రతిభను గుర్తించేందుకు 2020 నుంచి మార్కులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఒకే గ్రేడ్ ఎక్కువ మందికి వచ్చినప్పుడు ప్రవేశాలు, నియామకాల్లో సమస్యలు వస్తున్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో గ్రేడ్ల స్థానంలో మార్కులు ఇవ్వాలనే ప్రతిపాదనలను తీసుకొచ్చినట్లు తెలిపింది.  

Also Read: Weather Updates: ఏపీకి మరో 3 రోజులు వర్షాలే.. ఈ జిల్లాల వారికి అలర్ట్, తెలంగాణలో వానలు ఈ ప్రాంతాల్లో..

Also Read: Pavan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ బర్త్‌ డే స్పెషల్.. జనంలో ఉంటాడు.. జనంలా ఉంటాడు, ఇదీ పవర్ స్టారంటే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gorantla Madhav arrest:  పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
Mega Star Chiranjeevi On Mark Shankar:
"మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు" హ్యాపీ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి 
CSK Captain MS Dhoni: చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైన రుతురాజ్‌
చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైన రుతురాజ్‌
Revanth Reddy:  యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB vs DC Match Preview IPL 2025 | పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొదమ సింహాల ఢీSai Sudharsan Batting IPL 2025 | 30 మ్యాచులుగా వీడిని డకౌట్ చేసిన మగాడే లేడుShubman Gill vs Jofra Archer  | జోఫ్రా ఆర్చర్ ను ఆడలేకపోతున్న శుభ్ మన్ గిల్GT vs RR Match Highlights IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ పై 58 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gorantla Madhav arrest:  పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
పోలీసు కస్టడీలో ఉన్న కిరణ్‌పై దాడికి యత్నం - గోరంట్ల మాధవ్ అరెస్ట్
Mega Star Chiranjeevi On Mark Shankar:
"మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు" హ్యాపీ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి 
CSK Captain MS Dhoni: చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైన రుతురాజ్‌
చెన్నై కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ, గాయం కారణంగా టోర్నీకి దూరమైన రుతురాజ్‌
Revanth Reddy:  యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
యంగ్ ఇండియా నా బ్రాండ్ - ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్‌పై రేవంత్ కీలక వ్యాఖ్యలు
NIA First Statement: ముంబై ఉగ్రదాడుల బాధితులకు న్యాయం అందించే దిశగా ముందడుగు - తహవూర్ రాణాపై ఎన్‌ఐఏ ఫస్ట్ స్టేట్‌మెంట్
ముంబై ఉగ్రదాడుల బాధితులకు న్యాయం అందించే దిశగా ముందడుగు - తహవూర్ రాణాపై ఎన్‌ఐఏ ఫస్ట్ స్టేట్‌మెంట్
Itdp Arrest: గీత దాటితే ఏ పార్టీ అయినా ఒకటే - వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త అరెస్టు
గీత దాటితే ఏ పార్టీ అయినా ఒకటే - వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త అరెస్టు
Chhaava OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తోన్న వీరుడి కథ - 'ఛావా' స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో తెలుసా?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న వీరుడి కథ - 'ఛావా' స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో తెలుసా?
Manchu Manoj: 'మాది ఆస్తి తగాదా కాదు' - అలా జరగకపోయి ఉంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదన్న మంచు మనోజ్
'మాది ఆస్తి తగాదా కాదు' - అలా జరగకపోయి ఉంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదన్న మంచు మనోజ్
Embed widget