అన్వేషించండి

TDP Manifesto: ఈసారి సంక్షేమం- అభివృద్ది ప్లస్‌, రేపే టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో: చంద్రబాబు

TDP Manifesto: మహానాడు సందర్భంగా మే 28 ఆదివారం రోజు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అందరూ మెచ్చేదిగా, భవిష్యత్తుకు ఆదర్శంగా ఉంటుందని తెలిపారు.

TDP Manifesto: సంక్షేమం, అభివృద్ధి ప్లస్సే తెలుగు దేశం పార్టీ లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు పేర్కొన్నారు. మహానాడు సందర్భంగా రేపు(మే 28 ఆదివారం) మొదటి ఎన్నికల మేనిఫెస్టో ఫేజ్ -1ను విడుదల చేస్తామన్నారు. ప్రజలు మెచ్చేదిగా, భవిష్యత్తుకు ఆదర్శంగా ఉంటుందని చంద్రబాబు వెల్లడించారు. 

'ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సైకిల్ సిద్ధంగా ఉంది'

తెలంగాణలో చేసిన పనుల వల్ల, టీడీపీ వేసిన ఫౌండేషన్ వల్ల ఆ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థాయికి చేరే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఈ నాలుగేళ్లలో వైసీపీ హయాంలో చేసిన విధ్వంసం వల్ల ఏపీ చివరికి వెళ్లే పరిస్థితి వచ్చిందని బాబు విమర్శించారు. 'మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత, అన్ని రాష్ట్రాలతో సమానంగా, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకటీ, రెండూ స్థానాల్లో ఉండేలా కార్యక్రమాలు రూపొందిస్తాం. ఆ శక్తి, సత్తా తెలుగుదేశానికి ఉంది.  రేపు రాజమహేంద్రవరం దద్దరిల్లిపోతుంది. రాష్ట్రంలోని అన్ని చూపులు రాజమహేంద్రవరం వైపే ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సైకిల్ సిద్ధంగా ఉంది' అని బాబు అన్నారు. 

'మొదటి ఎన్నికల మేనిఫెస్టో ద్వారా అదరగొడదాం'

'పేదల సంక్షేమానికి ఏం చేయాలో, రాష్ట్రాభివృద్ధికి ఏం చేయాలో ప్రణాళికలు తయారు చేద్దాం. మొదటి ఎన్నికల మేనిఫెస్టో రేపు విడుదల చేద్దాం. దాంతోనే అదరగొడదాం. నిరంతరం సంపద సృష్టిద్దాం.. ఆ సంపదను పేదవాళ్లకు పంచి పెడదాం. పేదవాడు ధనికుడు కావాలన్నా ఆశయాన్ని అందరం కలిసి చేద్దాం. జగన్.. తానొక్కడే ధనికుడిగా ఉండాలని అనుకుంటారు, మిగిలిన వాళ్లంతా పేదవాళ్లుగా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రజలు ధనికులుగా ఉండన్నాలదే నా సంకల్పం. దాని కోసం అందరం కలిసి పని చేద్దాం. తెలుగు దేశం పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల రుణం రాబోయే రోజుల్లో తీర్చుకుంటా. ఎన్నికలు 2024లో వచ్చినా అంతకు ముందే వచ్చినా మేం సిద్ధం' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

'కౌరవులను వధించి అసెంబ్లీని గౌరవ సభ చేస్తాం'

ప్రజలతో అనుసంధానం కావాలని, పేద వారితో మమేకం కావాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్రను కూడా విజయవంతం చేస్తున్నారని అన్నారు. యువగళం పాదయాత్రలో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల పనితనాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో అజాగ్రత్త పనికిరాదని సూచించారు. నౌ ఆర్ నెవర్ అనేలా.. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామా లేదా అనేది ప్రధానమన్నారు. ఈ రాష్ట్రాన్ని, భావితరాల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యతను అందరం తీసుకోవాలని బాబు పిలుపునిచ్చారు.  కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను వధించి, అసెంబ్లీని గౌరవ సభ చేస్తామని అప్పటి వరకు అసెంబ్లీకి వెళ్లబోనని మరోసారి చెప్పుకొచ్చారు. 

'నాలుగేళ్లలో రూ.2.47 లక్షల కోట్ల అవినీతి'

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రూ.2.47 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఏపీలో సంపద దోడిపీ ఎక్కువ, ధరల బాదుడు ఎక్కువ అని చంద్రబాబు విమర్శించారు. స్కాముల్లో జగన్ మాస్టర్ మైండ్ అని, జగన్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని, కోడికత్తి డ్రామా, మద్య నిషేధం వంటివన్నీ డ్రామాలేనని ఎద్దేవా చేశారు. రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్లు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లు వేయిచుకున్నారని బాబు విమర్శించారు. రూ. 2వేల నోట్లు అన్నీ జగన్ దగ్గరే ఉన్నాయన్నారు. పెద్ద నోట్ల రద్దుకు టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సంక్షేమం తెలుసు.. సంపద సృష్టి తెలుసని, అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టిందే టీడీపీ అని గుర్తు చేశారు. 

'ప్రభుత్వ స్పాన్సర్ టెర్రరిజం పెరిగింది'

అన్ని వ్యవస్థలను జగన్ మోహన్ రెడ్డి నాశనం చేశారని, ప్రపంచ చరిత్రలో ఎక్కడా రాజధాని లేని రాష్ట్రం లేదని చంద్రబాబు అన్నారు. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని, రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా మారాయని విమర్శించారు. ప్రభుత్వ స్పాన్సర్ టెర్రరిజం పెరిగిందని ఆరోపించారు. పెట్టుబడులు లేవని, జాబ్ క్యాలెండర్ లేదని, నిరుద్యోగులకు దిక్కు తోచడం లేదని అన్నారు. పుట్టబోయే బిడ్డపైనా అప్పులు వేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget