అన్వేషించండి

Raghurama: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ నామినేషన్ - గురువారం ఏకగ్రీవ ఎన్నిక ప్రకటన

AP Assembly: రఘురామకృష్ణరాజు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నిక కానున్నారు. ఆయన బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.

Raghurama will be elected as the Deputy Speaker of AP Assembly: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా  రఘురామ కృష్ణరాజు నామినేషన్ వేశారు.  నారా లోకేష్ తో పాటు నాదెండ్ల మనోహర్, సభా వ్యవహరాల మంత్రి పయ్యావుల కేశవ్, సత్యకుమార్, పల్లా శ్రీనివాస్ నామినేషన్‌ను ప్రతిపాదిదంచారు. గురువారం రఘురామ ఏకగ్రీవంగా డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయినట్లుగా ప్రకటించనున్నారు. వైసీపీ అసెంబ్లీకి రావడం లేదు. వారికి ఎన్నికల్లో పోటీ చేసే అంత బలం కూడా లేదు కాబట్టి  ఎన్నిక లాంఛన ప్రాయమే. 

చివరికి డిప్యూటీ స్పీకర్ పదవితో సరి పెట్టుకున్న రఘురామ         

రఘురామకృష్ణరాజు మంత్రి పదవి ఆశించారు. తర్వాత స్పీకర్ పదవి ఆశించారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవితో సరి పెట్టుకుంటున్నారు. మొదట ఆయన ఎంపీ సీటు కోసం ప్రయత్నించారు. తన సిట్టింగ్ సీటు నర్సాపురం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు.  పొత్తుల్లో భాగంగా ఏ పార్టీకి సీటు వెళ్తే ఆ పార్టీలో చేరి పోటీ చేయాలనుకున్నారు. అయితే బీజేపీలో ఆయనకు సీటు రాలేదు. దాంతో ఆ పార్టీలో చేరలేదు. తర్వాత టీడీపీలో చేరారు.  ఓ దశలో ఆయనకు టిక్కెట్ వస్తుందా లేదా అన్న సందేహం ఏర్పడింది. చివరికి అతి కష్టం మీద ఉండి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. గెలిచిన తర్వాత మంత్రి పదవి అనుకున్నారు. రాలేదు. తర్వాత స్పీకర్ పదవి అనుకున్నారు..అదీ రాలేదు. చివరికి డిప్యూటీ స్పీకర్ పదవితో సరి పెట్టుకుంటున్నారు.           

Also Read: జగన్‌కు బైబై చెప్పేసిన దొమ్మేరు జమిందార్ అల్లుడు- గోదావరి జిల్లాల్లో వైసీపీకి బిగ్‌ షాక్

జనసేన కోటా అయినా రఘురామ కోసం త్యాగం             

మామూలుగా ఈ పదవి జనసేనకు ఇవ్వాల్సి ఉంది. స్పీకర్ పదవి టీడీపీ తీసుకున్నందున డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకే ఇస్తారని అనుకున్నారు. అయితే  సామాజిక సమీకరణాలు, రఘురామకు ఏదో ఓ ప్రోటోకాల్ పదవి కేటాయించాల్సి ఉండటంతో  రఘురామకు ఇవ్వాలని నిర్ణయించారు.దానికి పవన్ కూడా అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవి పెద్దదేం కాదు కానీ.. ఆయనకూ ప్రోటోకాల్ ఉంటుంది. రఘురామకృష్ణరాజును డిప్యూటీ  స్పీకర్‌గా నియమించడం వైసీపీ అధినేత జగన్ కు మరింత ఇబ్బందికరమేనని  రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read: ఏపీ డీఎస్సీపై కీలక ప్రకటన -అందుకే నోటిఫికేషన్ ఆలస్యమన్న మంత్రి లోకేష్

జగన్ ఇక అసెంబ్లీకి రాకపోవచ్చు !            

ప్రస్తుతానికి వైసీపీ అసెంబ్లీ బాయ్ కాట్ చేసింది. ఎప్పుడైనా ఆయన  అసెంబ్లీకి రావాలనుకుంటే అయితే అయ్యన్న పాత్రుడు లేకపోతే రఘురామ చైర్‌లో ఉంటారు. వీరిద్దరిపై  గతంలో పలు కేసులు నమోదయ్యాయి. రఘురామను కొట్టించారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన కేసు కూడా పెట్టారు.  అందుకే వీరు చైర్‌లో ఉంటే..  జగన్ సభకు  హాజరయ్యేందుకు సుముఖత చూపే అవకాశం లేదు. పరిస్థితి చూస్తూంటే ఆయన ఐదేళ్లూ సభకు రాకపోవచ్చని అంటున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
బ్యాడ్‌న్యూస్‌: దేశంలోనే నంబర్‌ 1 బైక్‌ Hero Splendor Plus ధర పెంపు, కొత్త ధరల లిస్ట్‌ ఇదిగో!
బ్యాడ్‌న్యూస్‌, పల్లె నుంచి పట్నం దాకా సామాన్యులు వాడే ఈ బైక్‌ రేటు పెంపు

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
బ్యాడ్‌న్యూస్‌: దేశంలోనే నంబర్‌ 1 బైక్‌ Hero Splendor Plus ధర పెంపు, కొత్త ధరల లిస్ట్‌ ఇదిగో!
బ్యాడ్‌న్యూస్‌, పల్లె నుంచి పట్నం దాకా సామాన్యులు వాడే ఈ బైక్‌ రేటు పెంపు
Ee Nagaraniki Emaindi Sequel Cast: 'యానిమల్' నుంచి ఈ నగరానికి... తరుణ్ భాస్కర్ సినిమాలో హీరోగా 'హిట్' యాక్టర్!
'యానిమల్' నుంచి ఈ నగరానికి... తరుణ్ భాస్కర్ సినిమాలో హీరోగా 'హిట్' యాక్టర్!
Gold Investment: లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
Nandyala Crime News:నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి
నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి
Mana Shankara Vara Prasad Garu BO Day 10: బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా
బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా
Embed widget