అన్వేషించండి

Leopard In Tirumala: శ్రీవారి మెట్టుమార్గంలో చిరుత సంచారం, భక్తులకు టీటీడీ హెచ్చరిక

Leopard In Srivari Mettu: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. దీంతో భయాందోళనకు గురైన భక్తులు, స్థానికంగా ఉన్న టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు.

Tirumal News: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. వేగంగా రోడ్డు దాటుతూ భక్తులకు కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన భక్తులు, స్థానికంగా ఉన్న టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు వాటర్ హౌస్ దగ్గర భక్తులను నిలిపి వేశారు. బస్సులను, కార్లను మాత్రమే శ్రీవారిమెట్టు వద్దకు అనుమతిస్తున్నారు. 

కాలి నడకన వెళ్లే భక్తులను గుంపులు, గుంపులుగా తిరుమలకు అనుమతిస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అటవీ శాఖ సిబ్బంది ఘటన స్ధలం వద్దకు చేరుకుని చిరుత సంచరించిన ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలను అమర్చుతున్నారు. మరోవైపు చిరుత సంచారం నేపధ్యంలో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఆంక్షలను టీటీడీ కొనసాగిస్తోంది.

గత కొద్దికాలంగా తిరుమల నడకమార్గాల్లో చిరుత, ఎలుగుబంట్లు, ఇతర వన్యప్రాణుల సంచారం విపరీతంగా పెరిగింది. ఇద్దరు చిన్నారులపై చిరుతలు దాడి చేశాయి. అందులో లక్షిత అనే చిన్నారి మృతి చెందింది. అప్పటి నుంచి టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. టీటీడీ, అటవీ శాఖ సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఆ క్రమంలో చిరుతలను బోన్లలో బంధించారు. అయినా చిరుతల సంచారం తగ్గలేదు.

గత నెలలో నరసింహస్వామి ఆలయం నుంచి 7వ మైలు ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరించినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మూడు రోజులు పాటు రాత్రి సమయంలో చిరుత, ఎలుగుబంటి తిరుగుతున్నట్లు గుర్తించారు. అంతే కాదు గతంలో దాడులు చేసిన ప్రాంతంలోనే రెండు చిరుతల సంచరించినట్టు తేల్చారు. వాటి కదలికను గుర్తించేందుకు నడక మార్గంలో టీటీడీ ట్రాప్‌ కెమెరాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు  చేశారు. 

శ్రీవారి మెట్టు మార్గంలో సెప్టెంబర్ ఆరో తేదీ చిరుత సంచారాన్ని గుర్తించారు. దీంతో తిరుమల కాలినడక దారి భక్తులను టీటీడీ అలెర్ట్ చేసింది. చిరుతను బంధించేందుకు ఏర్పాటు చేశారు. చిరుత బోనులో చిక్కుకునే ప్రాంతాలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సెప్టెంబర్ ఒకటోతేదీ అలిపిరి నడక మార్గంలో చిరుత కనిపించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. 

లక్ష్మీనరసింహస్వామి ఆలయం నామాల గవి వద్ద చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుత సంచరించినట్లు రికార్డు అయింది. టీటీడీ అధికారులు చిరుతల కదలికలను గుర్తించి  ఆ ప్రాంతంలో బోనులు ఏర్పాటు చేసి బంధిస్తూ వస్తున్నారు. అయితే  నడకదారిలో వన్యమృగాలు సంచరించడంతో నడక మార్గాల్లో తిరుమల వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది. 

భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. తిరుమల నడక మార్గాల్లో మొత్తం ఐదు చిరుతలను అటవీ అధికారులు బోనులు ఏర్పాటు చేసి పట్టుకున్నారు. జూన్‌ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28వ తేదీల్లో, సెప్టెంబర్‌ 6వ తేదీన చిరుతలు బోనులో పడ్డాయి. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని, భక్తుల భద్రత విషయంలో రాజీపడబోమని టీటీడీ చైర్మన్‌ కరుణాకరరెడ్డి, ఈఓ ధర్మారెడ్డి చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Embed widget