అన్వేషించండి

జర్నలిజం టీచర్‌గా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి- నెల్లూరులో జర్నలిస్ట్ లకు పాఠాలు

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకం అని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నెల్లూరు నగరంలో ఒకరోజు పర్యటనకు వచ్చిన జర్నలిస్ట్ వర్క్ షాప్ ప్రారంభించారు.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకం అని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నెల్లూరు నగరంలో ఒకరోజు పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక రమారాయల్ హోటల్ లో జర్నలిస్ట్ ల వర్క్ షాప్ ని ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా అభివృద్ధి కార్యక్రమాల అనుసంధానకర్తలుగా పాత్రికేయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్యర్వంలో వార్తాలాప్ (పాత్రికేయుల వర్క్ షాప్) కార్యక్రమం జరిగింది.


జర్నలిజం టీచర్‌గా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి- నెల్లూరులో జర్నలిస్ట్ లకు పాఠాలు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కిషన్ రెడ్డి జ్యోతి వెలిగించి వర్క్ షాప్ ప్రారంభించారు. ఏ ప్రభుత్వమైనా ప్రజాసంక్షేమం కోసమే అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతుందని, ప్రజలకు మేలు చేసే ఉద్దేశమే అందులో ఉంటుందని, క్షేత్ర స్థాయిలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పాత్రికేయుల చొరవతో వాటిని సరిదిద్దుకోవాలని చెప్పారు కిషన్ రెడ్డి. జర్నలిస్ట్ లు, పోలీసులు, రాజకీయ నాయకులకు పండగలు, సెలవులు ఉండవని, సమాజం కోసం ఎవరి స్థాయిలో వారు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తూ ఉంటారని అన్నారు.

వైద్యులు ఆరోగ్య సంరక్షణతో, ఉపాధ్యాయులు విద్యాబోధనతో.. తమ తమ బాధ్యతలు నిర్వహిస్తున్నట్టే, జర్నలిస్ట్ లు సమాజాన్ని జాగృతం చేయటంతోపాటు, ప్రజలు - ప్రభుత్వం మధ్య వారధిగా విలక్షణమైన బాధ్యత నిర్వహిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పథకాల గురించి జర్నలిస్ట్ లకు తెలియజేసే ఉద్దేశంతో వార్తాలాప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

ప్రభుత్వం పేదలకోసం ఏమేం పథకాలు అందిస్తోంది. వాటి ద్వారా ప్రజలు ఎలా లబ్ధి పొందాలి, ఏయే డాక్యుమెంట్లు అవసరం, ఎవరు అర్హులు, లబ్ధి పొందలేని వారికి ఇతర పథకాలు ఉన్నాయా.. అనే విషయాలను తెలియజేసేందుకు జర్నలిస్ట్ లు చొరవ తీసుకోవాలని సూచించారు కిషన్ రెడ్డి. విమర్శించడం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమన్న ఆయన, తెలుసుకుని విమర్శించాలి, మంచి కార్యక్రమాలను అభినందించాలని సూచించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమ విజయంలో ప్రజలు, పాత్రికేయులు పోషించిన పాత్రను ఈ సందర్భంగా ప్రస్తావించిన ఆయన, అందరూ కలిసి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ప్రచురిస్తున్న పక్షపత్రిక న్యూ ఇండియా సమాచార్ గురించి కిషన్ రెడ్డి ప్రస్తావించారు. రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలన్నింటినీ ఈ పత్రిక తెలియజేస్తుందని, ఇందులో సమాచారం తెలుసుకోవచ్చని, విమర్శించడానికి కూడా ఈ పుస్తకం పనికొస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విలేకర్లు మరింత జాగృతమై ఉండాలని, అక్కడి ప్రజలకు ప్రభుత్వ పథకాల వివరాల గురించి తెలియజేసి, వారి వెనుక అండగా నిలబడాలని, ఇది పాత్రికేయులే గాక, ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని పేర్కొన్నారు. రాజకీయలు, పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందేందుకు ప్రతి ఒక్కరి చొరవ అవసరమని పేర్కొన్నారు. ఈ దిశగా అభివృద్ధిని ప్రోత్సహించే పాత్రికేయానికి పెద్ద పీట వేయాలని సూచించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Amaravati Loans: అమరావతి అప్పులు ఏపీ రుణపరిమితిలోకి రావు -  చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్
అమరావతి అప్పులు ఏపీ రుణపరిమితిలోకి రావు - చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్
Rohit Sharma Lands In Mumbai: దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
Telugu TV Movies Today: చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ !
Amaravati Loans: అమరావతి అప్పులు ఏపీ రుణపరిమితిలోకి రావు -  చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్
అమరావతి అప్పులు ఏపీ రుణపరిమితిలోకి రావు - చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్
Rohit Sharma Lands In Mumbai: దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
దుబాయ్ నుంచి వచ్చిన రోహిత్ శర్మ, ముంబైకి చేరుకున్న భారత కెప్టెన్
Telugu TV Movies Today: చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘చూడాలని వుంది’, మహేష్ ‘ఒక్కడు’ to వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’, నితిన్ ‘శ్రీ ఆంజనేయం’ వరకు - ఈ మంగళవారం (మార్చి 11) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Rammohan Naidu News:శ్రీకాకుళం జిల్లాపై రామ్మోహన్ నాయుడు స్పెషల్ ఫోకస్- ఫిషింగ్‌ హార్బర్, జెట్టీలు ఏర్పాటుపై కేంద్రానికి లేఖ
శ్రీకాకుళం జిల్లాపై రామ్మోహన్ నాయుడు స్పెషల్ ఫోకస్- ఫిషింగ్‌ హార్బర్, జెట్టీలు ఏర్పాటుపై కేంద్రానికి లేఖ
Revanth Chit Chat: కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే స్థాయి నిజంగానే లేదు  - కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే స్థాయి నిజంగానే లేదు - కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Latest Crime News: హైదరాబాద్‌లోని హబ్సీగూడలో విషాదం- ఇద్దరు పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య 
హైదరాబాద్‌లోని హబ్సీగూడలో విషాదం- ఇద్దరు పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య 
Robinhood Song: ‘పైకే ఎగబడు సమయంలో.. చెప్పిన పంటే’.. అది ధా సర్‌ప్రైజు... కేతికా కుమ్మేసిందిగా
‘పైకే ఎగబడు సమయంలో.. చెప్పిన పంటే’.. అది ధా సర్‌ప్రైజు... కేతికా కుమ్మేసిందిగా
Embed widget