అన్వేషించండి

Nellore Boat Incident: మంత్రి కాకాణి స్వగ్రామంలో విషాద ఛాయలు, పడవ ప్రమాదంలో మృతదేహాలు లభ్యం

గల్లంతయిన ఆరుగురిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో మిగిలిన వ్యక్తి కూడా జీవించి ఉంటాడనే ఆశలు సన్నగిల్లాయి. దీంతో ఆ గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది.

Nellore Boat Accident: నెల్లూరు పడవ ప్రమాదంలో చెరువులో గల్లంతయినావారిలో ఐదుగురి మృతదేహాలు గుర్తించారు. జాలర్లు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. మొత్తం 10మంది చెరువులోకి వెళ్లగా నలుగురు యువకులు నిన్న రాత్రి ఈదుకుంటూ బయటకు వచ్చారు. గల్లంతయినా వారిలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం.

మంత్రి కాకాణి దిగ్భ్రాంతి..

పడవ ప్రమాదంలో చనిపోయినవారంతా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత ఊరివారు కావడంతో ఆయన హుటాహుటిన కేరళ పర్యటన మధ్యలోనే ముగించుకుని నెల్లూరు జిల్లాకు వచ్చారు. సహాయక చర్యలను ఆయన దగ్గర ఉండి పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ విజయరావుతో కలసి ఆయన ఆదివారం రాత్రి నుంచి సంఘటన స్థలం వద్దే ఉన్నారు. యువకుల మృతదేహాలను చూసి ఆయన చలించిపోయారు. తన సొంత కుటుంబంలో ఈ దుర్ఘటన జరిగినట్టు ఆ ప్రమాదం తనను కలచి వేసిందన్నారు.

ఊరంతా అలజడి.. 
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు గ్రామమంతా చెరువు దగ్గరకు తరలి వచ్చింది. ఒక్కో మృతదేహం బయటకు వస్తుండటంతో వారంతా కన్నీరు మున్నీరయ్యారు. చెరువు వద్దే వారంతా ఉన్నారు. మరొకరి కోసం గాలింపు జరుగుతోంది. గల్లంతయిన ఆరుగురిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో మిగిలిన వ్యక్తి కూడా జీవించి ఉంటాడనే ఆశలు సన్నగిల్లాయి. దీంతో ఆ గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది.

తోడేరు శాంతినగర్ గ్రామ చెరువులో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో 10 మంది యువకులు సరదాగా పడవలో వెళ్లారు. పడవలో షికారుకోసం వారంతా చెరువులోకి వెళ్లారు. దురదృష్టశాత్తు చెరువు మధ్యలోకి వెళ్లిన తర్వాత పడవలోకి నీరు రావడంతో  కొంతమంది బయపడి బోటులోనుంచి దూకగా వారిలో నలుగురు ఈత కొట్టుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన  6 మంది గల్లంతయ్యారు. అందులో ప్రస్తుతం ఐదుగురి మృతదేహాలను గుర్తించారు. చెరువులో పడవలో విహారానికి వెళ్లినవారంతా ఒకే ఊరికి చెందినవారు కావడంతో శాంతి నగర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒడ్డుకు చేరిన నలుగురు ప్రమాద ఘటన నుంచి ఇంకా తేరుకోలేదు. వారంతా షాక్ లోనే ఉన్నారు.

పొదలకూరు మండలం, తోడేరు గ్రామం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంత ఊరు కావడంతో ఆయన ఈ ఘటన విషయంలో చొరవ తీసుకుని పోలీసులను ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చారు. మంత్రి కాకాణి ప్రస్తుతం కేరళలో అధికార పర్యటనలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన కేరళ పర్యటన మధ్యలోనే ఆపేసి ఆయన నెల్లూరుకి బయలుదేరి వచ్చారు. రాత్రి నుంచి ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం.. 
నెల్లూరు జిల్లాలో జరిగిన పడవ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకేసారి ఆరుగురు గల్లంతు కావడం, అందులో ఐదుగురు శవాలుగా తేలడంతో జిల్లాలో ఈ ఘటన విషాదంగా మారింది. జిల్లా మంత్రితోపాటు, జిల్లాకు చెందిన నాయకులు కూడా ఈ ఘటనపై తమ విచారం వ్యక్తం చేశారు. యువకులంతా సరదాగా చెరువులోకి వెళ్లడం, అక్కడే వారు మృత్యువాత పడటంతో తోడేరు గ్రామం కన్నీరుమున్నీరవుతోంది. ఎదిగొచ్చిన బిడ్డలు తమ కళ్లముందే శవాలుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
VB GRAM G Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!
ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!
Prasna Ravan Bail and Arrest: అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ మళ్లీ అరెస్టు! 2025 నాటి కేసులో చర్యలు!
అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ మళ్లీ అరెస్టు! 2025 నాటి కేసులో చర్యలు!
AP TET 2026: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థులకు అలర్ట్! దరఖాస్తుల సవరణకు వన్ టైమ్ డిలీట్ ఆప్షన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థులకు అలర్ట్! దరఖాస్తుల సవరణకు వన్ టైమ్ డిలీట్ ఆప్షన్! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jupally Krishna Rao: ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
ప్లేస్ ఫిక్స్, సాయంత్రం 5 గంటలకు రండి.. నిజాలేంటో తేల్చేద్దాం: బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి సవాల్
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
JSW Rayalaseema Steel Plant: కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్
కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన.. దేశంలోనే తొలి గ్రీన్‌ స్టీల్‌ ప్లాంట్ విశేషాలు
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
Nara Lokesh: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ
Tata Sierra EVని ఏ ప్రాతిపదికన కొంటారు? - ఇలా సింపుల్‌గా కంపేర్‌ చేస్తే మీకో క్లారిటీ వస్తుంది!
Tata Sierra EV వర్సెస్‌ 5 ప్రత్యర్థి మోడళ్లు - ఈ టేబుల్స్‌ చూస్తే బెస్ట్ EV ఏదో ఈజీగా అర్ధమవుతుంది!
Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
Tata Sierra EV vs Curvv EV: ఎక్కువ రేంజ్‌, కంఫర్ట్, మంచి స్పేస్‌ కోసం ఏ EV కొనాలి?
రూ.20 లక్షల బడ్జెట్‌లో Tata Sierra EV లేదా Curvv EV - ఏది బెస్ట్ ఛాయిస్?
Embed widget