అన్వేషించండి

వారి చావుకి చంద్రబాబే కారణం- మంత్రి కాకాణి ఆగ్రహం

ఇవి శవ రాజకీయాలు కావని, శవాలను చేసిన రాజకీయాలని మండిపడ్డారు మంత్రి కాకాణి. కందుకూరు ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి కూడా జనాల్ని రప్పించారని, తొక్కిసలాటకు వారే కారణం అయ్యారని అన్నారు కాకాణి.

చంద్రబాబు ఆశ, అధికార దాహం కోసం కందుకూరులో 8మంది బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కాకాణి. లేనిది ఉన్నట్టు సృష్టించడానిక చంద్రబాబు ప్రయత్నించారని, అందుకే ఎన్టీఆర్ సర్కిల్ లో రోడ్ షో ఏర్పాటు చేశారని చెప్పారు. జనం ఎక్కువమంది కెమెరాకు కనపడాలని ఆయన వాహనాన్ని ముందుకు తెచ్చారు. 20 అడుగుల వెడల్పు ఉండే రోడ్ లో చంద్రబాబు వాహనం వచ్చింది. అక్కడ గ్రూపు రాజకీయాలున్నాయి. పోటా పోటీగా ఫ్లెక్సీలు కట్టారు. జనం అటు, ఇటు వెళ్లిపోకుండా ఫ్లెక్సీల మధ్య నిలబడితే, డ్రోన్ కెమెరాలతో చూపించాలనుకున్నారు. ఆ పొరపాట్ల వల్లే 8మంది చనిపోయారన్నారు కాకాణి. పాపం కూలీ డబ్బులిస్తారని వచ్చి ప్రాణాలు కోల్పోయారని అన్నారు.

ఇవి శవరాజకీయాలు కావని, శవాలను చేసిన రాజకీయాలని మండిపడ్డారు కాకాణి. కందుకూరు ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి కూడా జనాల్ని రప్పించారని, తొక్కిసలాటకు వారే కారణం అయ్యారని అన్నారు కాకాణి. ఫొటో షూట్ కోసం చంద్రబాబు వాహనాన్ని పదే పదే ముందుకు వెనక్కు జరిపారని అన్నారు.

గోదావరి పుష్కరాల్లో ఇదే జరిగింది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. అప్పుడాయన పుష్కర స్నానం చేసే వరకు ఎవరినీ స్నానానికి పోనివ్వలేదని, అందుకే తోపులాట జరిగిందని అన్నారు కాకాణి. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయిందని, ఎనిమిదిమందిని చంద్రబాబు పొట్టినపెట్టుకున్నారని అన్నారు.

ఆ కుటుంబాల ఘోష చంద్రబాబుకి తగులుతుంది..

ఆ 8మంది కుటుంబాల ఘోష చంద్రబాబుకి తప్పకుండా తగులుతుందని శాపనార్థాలు పెట్టారు కాకాణి. అసలు చంద్రబాబు సభలకు ప్రజలు ఎందుకొస్తారని అన్నారు కాకాణి. ఉద్యోగాలిచ్చారని యువత వస్తారా, రుణమాఫీ చేశారని రైతులు వస్తారా, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించారా అని నిలదీశారు. అసలు ఆయన రాష్ట్రానికి ఏం చేశారన ప్రశ్నించారు.

సభలకు జనం ఎందుకొస్తారనే ఆత్మ పరిశీలన చేసుకోకుండా వేలాదిమంది వస్తున్నారని చూపించుకోడానికి ఆయన తపిస్తున్నారని అన్నారు. ఎక్కడ మీటింగ్ పెడితే, ఎక్కడ ఫొటో బాగొస్తుందనేది వారి టీమ్ ముందుగానే చెబుతారని, రైట్ తిరగండి, లెఫ్ట్ తిరగండి అంటూ ఫొటోలు తీసేవాళ్లు చెప్పినట్టే చంద్రబాబు చేస్తుంటారని, ఫొటోలు తీసేవారి డైరక్షన్లో చంద్రబాబు నడుస్తుంటారని, ఆ హడావిడి అంతా పచ్చ మీడియాలో చూపించుకునే తాపత్రయం చంద్రబాబుదని అన్నారు.

ఇదేం ఖర్మ..

చంద్రబాబు కందుకూరు రావడం వల్ల ఇదేం ఖర్మ అని అక్కడి ప్రజలు అనుకుంటున్నారని, చంద్రబాబు పుట్టడమే ఈ రాష్ట్రానికి ఖర్మ అని మండిపడ్డారు కాకాణి. ఆయన పుట్టడమే రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఖర్మ అని అన్నారు. ఆయన ఖర్మకి ఎంతమంది బలయ్యారు, ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయో ఆలోచించాలన్నారు.

వైసీపీ కూడా కందుకూరులో సభ పెట్టారని, తానే ఆ సభ ఏర్పాట్లు చూశానని, సువిశాల ప్రాంతంలో సభ పెడితే జనం విరగబడి వచ్చారని, చంద్రబాబు లాగా పరదా చాటున, ఎవరికీ కనిపించకుండా బస్సుల్లో కూర్చుని రాలేదని ఎద్దేవా చేశారు. జనంలో తిరిగుతూనే జగన్ సభ పెడితే జనం బాగా వచ్చారని, ఎక్కడా అపశృతి చోటు చేసుకోలేదన్నారు కాకాణి. కానీ ఈనాడు పొటో షూట్ కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నం వల్లే 8మంది చనిపోయారన్నారు.

పోలీసుల వైఫల్యం లేదు..

పోలీసులు సభల దగ్గరకు వస్తే, టీడీపీ వాళ్లు దుర్భాషలాడారని, కానీ ఇప్పుడు పోలీసు సిబ్బంది లోపం ఉందని టీడీపీ అనుకూల మీడియాలో రావడం దురదృష్టకరం అని చెప్పారు కాకాణి. ఈ ఘటనకు కారణమైన చంద్రబాబుపై కేసు పెట్టాలని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు కాకాణి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ T20I World Cup Final: టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖీ.. సెంచరీలు బాదడంలో టీమిండియా బ్యాటర్లదే హవా
టీ20ల్లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖీ.. సెంచరీలు బాదడంలో టీమిండియా బ్యాటర్లదే హవా
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
TVK Vijay Super Six: తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
తులం బంగారం, ప్రతి విద్యార్థికి 15 వేలు - తమిళనాట విజయ్ సూపర్ సిక్స్ హామీలు
Iran ship: భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
భారత్‌ ఆశ్రయంలో మరో ఇరాన్ యుద్ధనౌక- తొందరపడటం వల్లనే ఐరిన్ దేనాకు ముప్పు - ఇవే కీలక విషయాలు
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Embed widget