అన్వేషించండి

వారి చావుకి చంద్రబాబే కారణం- మంత్రి కాకాణి ఆగ్రహం

ఇవి శవ రాజకీయాలు కావని, శవాలను చేసిన రాజకీయాలని మండిపడ్డారు మంత్రి కాకాణి. కందుకూరు ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి కూడా జనాల్ని రప్పించారని, తొక్కిసలాటకు వారే కారణం అయ్యారని అన్నారు కాకాణి.

చంద్రబాబు ఆశ, అధికార దాహం కోసం కందుకూరులో 8మంది బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కాకాణి. లేనిది ఉన్నట్టు సృష్టించడానిక చంద్రబాబు ప్రయత్నించారని, అందుకే ఎన్టీఆర్ సర్కిల్ లో రోడ్ షో ఏర్పాటు చేశారని చెప్పారు. జనం ఎక్కువమంది కెమెరాకు కనపడాలని ఆయన వాహనాన్ని ముందుకు తెచ్చారు. 20 అడుగుల వెడల్పు ఉండే రోడ్ లో చంద్రబాబు వాహనం వచ్చింది. అక్కడ గ్రూపు రాజకీయాలున్నాయి. పోటా పోటీగా ఫ్లెక్సీలు కట్టారు. జనం అటు, ఇటు వెళ్లిపోకుండా ఫ్లెక్సీల మధ్య నిలబడితే, డ్రోన్ కెమెరాలతో చూపించాలనుకున్నారు. ఆ పొరపాట్ల వల్లే 8మంది చనిపోయారన్నారు కాకాణి. పాపం కూలీ డబ్బులిస్తారని వచ్చి ప్రాణాలు కోల్పోయారని అన్నారు.

ఇవి శవరాజకీయాలు కావని, శవాలను చేసిన రాజకీయాలని మండిపడ్డారు కాకాణి. కందుకూరు ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి కూడా జనాల్ని రప్పించారని, తొక్కిసలాటకు వారే కారణం అయ్యారని అన్నారు కాకాణి. ఫొటో షూట్ కోసం చంద్రబాబు వాహనాన్ని పదే పదే ముందుకు వెనక్కు జరిపారని అన్నారు.

గోదావరి పుష్కరాల్లో ఇదే జరిగింది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. అప్పుడాయన పుష్కర స్నానం చేసే వరకు ఎవరినీ స్నానానికి పోనివ్వలేదని, అందుకే తోపులాట జరిగిందని అన్నారు కాకాణి. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయిందని, ఎనిమిదిమందిని చంద్రబాబు పొట్టినపెట్టుకున్నారని అన్నారు.

ఆ కుటుంబాల ఘోష చంద్రబాబుకి తగులుతుంది..

ఆ 8మంది కుటుంబాల ఘోష చంద్రబాబుకి తప్పకుండా తగులుతుందని శాపనార్థాలు పెట్టారు కాకాణి. అసలు చంద్రబాబు సభలకు ప్రజలు ఎందుకొస్తారని అన్నారు కాకాణి. ఉద్యోగాలిచ్చారని యువత వస్తారా, రుణమాఫీ చేశారని రైతులు వస్తారా, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించారా అని నిలదీశారు. అసలు ఆయన రాష్ట్రానికి ఏం చేశారన ప్రశ్నించారు.

సభలకు జనం ఎందుకొస్తారనే ఆత్మ పరిశీలన చేసుకోకుండా వేలాదిమంది వస్తున్నారని చూపించుకోడానికి ఆయన తపిస్తున్నారని అన్నారు. ఎక్కడ మీటింగ్ పెడితే, ఎక్కడ ఫొటో బాగొస్తుందనేది వారి టీమ్ ముందుగానే చెబుతారని, రైట్ తిరగండి, లెఫ్ట్ తిరగండి అంటూ ఫొటోలు తీసేవాళ్లు చెప్పినట్టే చంద్రబాబు చేస్తుంటారని, ఫొటోలు తీసేవారి డైరక్షన్లో చంద్రబాబు నడుస్తుంటారని, ఆ హడావిడి అంతా పచ్చ మీడియాలో చూపించుకునే తాపత్రయం చంద్రబాబుదని అన్నారు.

ఇదేం ఖర్మ..

చంద్రబాబు కందుకూరు రావడం వల్ల ఇదేం ఖర్మ అని అక్కడి ప్రజలు అనుకుంటున్నారని, చంద్రబాబు పుట్టడమే ఈ రాష్ట్రానికి ఖర్మ అని మండిపడ్డారు కాకాణి. ఆయన పుట్టడమే రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఖర్మ అని అన్నారు. ఆయన ఖర్మకి ఎంతమంది బలయ్యారు, ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయో ఆలోచించాలన్నారు.

వైసీపీ కూడా కందుకూరులో సభ పెట్టారని, తానే ఆ సభ ఏర్పాట్లు చూశానని, సువిశాల ప్రాంతంలో సభ పెడితే జనం విరగబడి వచ్చారని, చంద్రబాబు లాగా పరదా చాటున, ఎవరికీ కనిపించకుండా బస్సుల్లో కూర్చుని రాలేదని ఎద్దేవా చేశారు. జనంలో తిరిగుతూనే జగన్ సభ పెడితే జనం బాగా వచ్చారని, ఎక్కడా అపశృతి చోటు చేసుకోలేదన్నారు కాకాణి. కానీ ఈనాడు పొటో షూట్ కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నం వల్లే 8మంది చనిపోయారన్నారు.

పోలీసుల వైఫల్యం లేదు..

పోలీసులు సభల దగ్గరకు వస్తే, టీడీపీ వాళ్లు దుర్భాషలాడారని, కానీ ఇప్పుడు పోలీసు సిబ్బంది లోపం ఉందని టీడీపీ అనుకూల మీడియాలో రావడం దురదృష్టకరం అని చెప్పారు కాకాణి. ఈ ఘటనకు కారణమైన చంద్రబాబుపై కేసు పెట్టాలని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు కాకాణి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget