అన్వేషించండి

Postal Ballot In Atmakur : వృద్ధులు, వికలాంగులు, కరోనా బాధితులకు పోస్టల్ బ్యాలెట్- ఆత్మకూరు నుంచి ప్రారంభం

ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జూన్‌ 23న ఉపఎన్నికలు జరుగుతాయి. దీనికోసం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వారికి ప్రత్యేక నియమావళిని ఎన్నికల సంఘం విడుదల చేసింది.

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో నామినేషన్లు ఆన్ లైన్ లో స్వీకరించేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఓటింగ్ విషయంలో కూడా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. పోస్టల్ బ్యాలెట్ ని ఇంటి వద్దకే పంపించబోతున్నారు. వృద్ధులు, వికలాంగులు, కరోనా బాధితులకోసం ఈ ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్ల ఇంటికే అధికారుల బృందం వచ్చి బ్యాలెట్‌ ఇచ్చి... ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా సహకరించాలని సూచిస్తుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం ముందుగా ఓటర్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఈనెల 3లోగా దరఖాస్తు
పోస్టల్‌ బ్యాలెట్ హక్కును సద్వినియోగం చేసుకునే వారు ఈనె 3లోపు స్థానిక బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. BLOలు ఇలా తమకు వచ్చిన దరఖాస్తుల వివరాలను తహశీల్దారుకి తెలియజేయాల్సి ఉంటుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 12డి ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమాచారం BLOల ద్వారా సేకరించి ఉన్నతాధికారులకు తహశీల్దార్లు నివేదించాల్సి ఉంటుంది. 

ఎవరెవరికి..?
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జూన్‌ 23న ఉపఎన్నికలు జరుగుతాయి. దీనికోసం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వారికి ప్రత్యేక నియమావళిని ఎన్నికల సంఘం విడుదల చేసింది. ప్రస్తుతం కొత్తగా విడుదలైన ఓటర్ల జాబితా ప్రకారం 80ఏళ్లు నిండిన వృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ వైద్యాధికారి జారీ చేసిన హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్, లేదా పింఛన్‌ సర్టిఫికెట్, ఓటర్ల జాబితాలో వికలాంగులుగా నమోదు చేసుకున్న వారంతా పోస్టల్ బ్యాలెట్ కి అర్హులు. పోలింగ్‌ సమయంలో కొవిడ్‌-19 కారణంగా ఆసుపత్రిలో లేదా ఐసోలేషన్‌ లో ఉన్న ఓటర్లకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. 

ఓటు ఎలా వేయాలి.. 
మామూలుగా ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. సాధారణ ఎన్నికల తేదీకంటే ముందే పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అలా కాదు.. పోస్టల్ బ్యాలెట్ ని కూడా ఎన్నికల రోజే అర్హులకు ఇస్తారు. పోలింగ్‌ అధికారి, ఇతర ప్రత్యేక బృందం, పోలీసు రక్షణలో పోస్టల్‌ బ్యాలెట్‌ను ఓటరుకు ఇంటి వద్దకు తీసుకెళ్లి ఇస్తారు. అక్కడే పోస్టల్ బ్యాలెట్ పై వారు తమ ఓటు ముద్ర వేయాల్సి ఉంటుంది. ఆ తరవాత ఆ పోస్టల్‌ బ్యాలెట్‌ ను అధికారి తీసుకుని రశీదు ఇస్తారు. ఈ తతంగాన్నంతా వీడియో తీయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్లను కూడా సాధారణ ఈవీఎం లతో కలిపి భద్రపరుస్తారు. ఓట్ల లెక్కింపు రోజు వాటిని తీస్తారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Railway Guidelines For Ghee : రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
రైలులో నెయ్యి తీసుకెళ్లొచ్చా? భారతీయ రైల్వే నిబంధనలు ఇవే
Embed widget