అన్వేషించండి

Breaking News Telugu Live Updates:  వనపర్తి జిల్లా ఊక చెట్టు వాగులో ముగ్గురు గల్లంతు 

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

LIVE

Key Events
Breaking News Telugu Live Updates:  వనపర్తి జిల్లా ఊక చెట్టు వాగులో ముగ్గురు గల్లంతు 

Background

తిరుపతి : తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది.. శుక్రవారం 07-10-2022 రోజున 70,007 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 42,866 మంది తలనీలాలు సమర్పించగా, 4.25 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయి బయట గోగర్భం డ్యాం వరకూ భక్తులు క్యూలైన్స్ లో వేచి ఉన్నారు.. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు దాదాపు 50 గంటలకు పైగా సమయం పడుతుంది.. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది.. 

త్వరలో ఈశాన్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలలో చివరిసారిగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే అక్టోబర్ 9 నుంచి మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టినా, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి.
 
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
నైరుతి రుతుపవనాల ప్రభావం తెలంగాణపై మరో రెండు రోజుల్లో పూర్తిగా తగ్గనుంది. వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అక్టోబర్ 9 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. శుక్రవారం సైతం పలు జిల్లాల్లో చిరు జల్లులు, మోస్తరు వర్షాలు కురిశాయి. గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి
అక్టోబర్ 8న వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో  అక్కడ్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభాంతో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు పడతాయి. కోస్తాంధ్ర​, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తగ్గుముఖం పడుతున్నాయి. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తీరంలో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం బంగాళాఖాతంలో నుంచి తేమను కోస్తాంధ్రలోని ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు భాగాల్లోకి వస్తోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం మరింత బలపడటంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. సాయంకాలం సమయంలో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడేందుకు అనుకూలంగా ఉంది. తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లోని అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి.

19:01 PM (IST)  •  08 Oct 2022

 వనపర్తి జిల్లా ఊక చెట్టు వాగులో ముగ్గురు గల్లంతు 

వనపర్తి జిల్లా మదనాపురం మండలం ఊక చెట్టు వాగులో ముగ్గురు గల్లంతయ్యారు. కొద్దిరోజులుగా వనపర్తి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు సరళాసాగర్ ప్రాజెక్టు ఆటోమేటిక్ సైఫాన్ వ్యవస్థ ఆన్ కావడంతో ప్రాజెక్టు వెనకాల ఉన్న వనపర్తి ఆత్మకూరు రోడ్డుపై ఊక చెట్టు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వాగును దాటే క్రమంలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతయినవారిలో ఇద్దరు ఆడవాళ్లు ఒక యువకుడు ఉన్నారు. గల్లంతైన వారికోసం మదనాపురం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  

17:38 PM (IST)  •  08 Oct 2022

హైదరాబాద్ లో కుండపోత వర్షం, రోడ్లన్నీ జలమయం 

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.  

14:24 PM (IST)  •  08 Oct 2022

అధికారులు దేవాదాయ శాఖను బ్రష్టు పట్టిస్తున్నారు - స్వరూపానందేంద్ర

దేవాదాయ శాఖ తీరుపై మండిపడ్డ విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర

అంతర్గత కలహాలతో అధికారులు దేవాదాయ శాఖను బ్రష్టు పట్టిస్తున్నారు
-స్వరూపానందేంద్ర

వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాడుతున్నారు
-స్వరూపానందేంద్ర

పెరుగుతున్న భూవివాదాలు, భూ కబ్జాల దృష్ట్యా దేవాదాయశాఖలో రెవెన్యూ ఉద్యోగుల సేవలు అవసరమే
-స్వరూపానందేంద్ర

అలాగని దేవాదాయశాఖ ఉద్యోగస్తులను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదు
-స్వరూపానందేంద్ర

దేవాదాయ శాఖలో అధికారుల సంఖ్య తక్కువగా ఉంది
-స్వరూపానందేంద్ర

12 ఏళ్ళుగా దేవాదాయ శాఖలో ప్రమోషన్లకు నోచుకోకపోవడం శోచనీయం
-స్వరూపానందేంద్ర

కోర్టు వ్యాజ్యాలను పక్కనపెట్టి ఉద్యోగస్తులంతా ఏకతాటిపైకి రావాలి
-స్వరూపానందేంద్ర

అలా వస్తే ప్రభుత్వంతో మాట్లాడి పదోన్నతులు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా
-స్వరూపానందేంద్ర

సింహాచలంలో దేవాదాయ శాఖ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి

13:50 PM (IST)  •  08 Oct 2022

చిరంజీవితో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు భేటీ

చిరంజీవితో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు భేటీ అయ్యారు. గాడ్‌ ఫాదర్‌ మంచి విజయాన్ని అందుకున్నందుకే మెగాస్టార్‌ను అభినందించడానికే సమావేశమయ్యారని గంటా అనుచరులు చెబుతున్నారు. కానీ తాజా రాజకీయ అంశాలు కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలోనే పవన్‌కు సపోర్ట్‌గా చిరంజీవి మాట్లాడారు. అవసరమైతే తాను కూడా పవన్‌కు మద్దతుగా నిలబడతానన్నారు. ఈ కాక ఇంకా చల్లారక ముందే చిరంజీవి, గంటా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ తరఫున 2019 ఎన్నికల్లో గెలిచిన గంటా శ్రీనివాస రావు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య స్టీల్‌ప్లాంట్ ఉద్యమం పాల్గొన్న ఆయన.. తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా కూడా సమర్పించారు. అప్పటి నుంచి శాసన సభకు కూడా వెళ్లడం లేదు. ఈ మధ్య కాలంలో వికేంద్రీకరణ, అమరావతి ఉద్యమంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నా గంటా మాత్రం రియాక్ట్ కాలేదు. టీడీపీలో అంత యాక్టివ్‌గా లేని గంటా ఇప్పుడు చిరంజీవితో సమావేశం కావడం రాజకీయంగా చర్చ మొదలైంది.

12:46 PM (IST)  •  08 Oct 2022

గెలవలేరనే రాజీనామాలంటూ కొత్త డ్రామాలు: నక్కా ఆనందబాబు

వికేంద్రీకరణ సమావేశాలు జగన్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్టులతో నడిపించేవేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. మళ్లీ గెలవలేమని తెలిసే వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామాలంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని దుయ్యబట్టారు. సిఎం దుర్మార్గపు ఆలోచనలు అమలు చేయడానికి మంత్రులంతా మద్దతు పలకటం సిగ్గుమాలిన చర్యని మండిపడ్డారు. కాంగ్రెస్​లో ఉండగా జగన్ రెడ్డిని ధర్మాన, బొత్స తిట్టినట్లు మరెవ్వరూ తిట్టలేదని గుర్తుచేశారు. విశాఖను జేగ్యాంగ్ దోపిడీకి అడ్డాగా మార్చుకుని ప్రజల్ని మభ్యపెట్టేయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget