అన్వేషించండి

MLA Rama Krishna Babu: "మీరు 16 నెలలు జైల్లో ఉన్నారని, మమ్మల్ని జైల్లో పెడ్తున్నారా"

MLA Rama Krishna Babu: పోలీసులు అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఎమ్మెల్సీ దువ్వారాపు రామారావు అన్నారు. సీఎం జగన్ 16 నెలలు జైల్లో ఉన్నందునే తమను కూడా జైల్లో పెడుతున్నారా అని ప్రశ్నించారు.

MLA Rama Krishna Babu: టీడీపీ హయాంలోనే ఉత్తరాంధ్రకు ఎన్నో పరిశ్రమలు వచ్చాయని విశాఖ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు. మూడు రాజధానుల పేరుతో... సీఎం జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఎమ్మెల్యే రామకృష్ణ బాబు కామెంట్లు చేశారు. పోలీసుల అరాచకాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని అన్నారు. మీరు 16 నెలలు జైల్ లో ఉన్నారు కాబట్టి.. మమ్మల్ని జైలుకు పంపిస్తున్నారా అని ప్రశ్నించారు. ఋషికొండను పిండి చేయడానికి 92 కోట్లు ఖర్చా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పలకరిస్తే... అక్కడకి పోలీసులు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ గర్జనకు సూర్య భగవానుడు కూడా సహకరించ లేదని తెలిపారు. 

రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఋషికొండకు వెళ్దామంటే.. పోలీసులు అడ్డుకున్నారని తెలిరారు. పోలీసులు ఖాకీ చొక్కాలు వేసుకున్నారా లేక వైసీపీ జెండా రంగుల దుస్తులు వేసుకున్నారా అని విమర్శించారు. ఋషికొండకు టీడీపీ నేతలు వస్తుంటే... వైసీపీకి నేతలకు దడ ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఋషికొండను బోడి కొండను చేశారని అనకాపల్లి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు బుద్దా నాగ జగదీశ్వర రావు కాచెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందన్నారు. టీడీపీ నేతలు ఏమైనా టెర్రరిస్టులా అని ప్రశ్నించారు. ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవడం సరైన పద్దతి కాదని సూచించారు. ఋషికొండను సందర్శించి తీరుతామని తెలిపారు. 

టీడీపీ నేతల గృహ నిర్బందాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఋషికొండపై ఏం కడుతున్నారో ప్రజలకు చెప్పాలని చెప్పుకొచ్చారు. వైసీపీ వైఫల్యాలను కప్పిపుచుకోవడానికే.. టిడిపి నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారన్నారు. నిర్మాణం చేయడానికి ఋషికొండే దొరికిందా అని ప్రశ్నించారు. విశాఖలో ఇంకెక్కడా చోటు లేదా అని అడిగారు. 

టీడీపీ కార్యాలయంలో వినూత్న నిరసన..

అనకొండ నోటిలో ఋషికొండ అనే పేరులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. అనకొండ సీఎం.. అక్రమ నిర్మాణాలు ఆపాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పార్టీ ఆఫీసు చుట్టూ భారీగా మోహరించారు. టీడీపీ జిల్లా కార్యాలయంతోపాటు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. విశాఖ వెళ్తున్న శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవి కుమార్, పాలకొండ టీడీపీ ఇన్ ఛార్జీ నిమ్మక జయకృష్ణను తగరపువలస వద్ద భీమిలి పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు.

విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద సుమారు 100 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అవసరం అయితే అరెస్టులు కూడా చేసేందుకు మూడు వాహనాలను సిద్ధం చేశారు. గురువారం రాత్రి మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తన కుటుంబ సభ్యులతో సినిమా థియేటర్ కు వెళ్లినా పోలీసుల ఆంక్షలు తప్పలేదు. ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు థియేటర్ వద్దకు వచ్చారు. 

ఈ ఉదయం విశాఖలో అనిత ఇంటికి వెళ్లిన పోలీసులు... ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిని బయటకు వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్ చేశారు. పార్టీ కార్యాలయానికి వెళ్తున్న తమను అడ్డుకోవద్దని అనిత కోరారు. పోలీసులు అడ్డుకోవడంతో వాహనం దిగి నడుచుకుంటూ బయల్దేరిన అనిత, సంధ్యారాణిని కొద్ది దూరం అనుసరించిన పోలీసులు.. ఆ తర్వాత బలవంతంగా వాళ్లను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికండ పరిరక్షణ కోసం సీఎం జగన్ పోలీసులను వినియోగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆమె మండిపడ్డారు. అంతే కాకుండా రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Earthquake: విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
విశాఖలో భూకంపం.. తెల్లవారుజామున పలుచోట్ల ప్రకంపనలు, భయాందోళనలో ప్రజలు
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Arya: హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
హైదరాబాద్‌లో ఆర్యపై క్రిమినల్ కేసు... ఫైనాన్షియల్ ఇష్యూలో తమిళ హీరో?
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Embed widget