అన్వేషించండి

Nadendla Manohar : బియ్యం స్మగ్లింగ్‌లో ఐదుగురు ఐపీఎస్‌లు - మంత్రి నాదెండ్ల సంచలన ప్రకటన

Andhra Rice Scam : ఏపీలో బియ్యం స్మగ్లింగ్‌లో ఐదుగురు ఐపీఎస్‌లు ఉన్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఒక్క కాకినాడలోనే 43వేల మెట్రిక్ టన్నులకుపైగా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

Minister Nadendla Manohar :  ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం స్మగ్లింగ్ జరిగిందని గతంలో టీడీపీ, జనసేన పార్టీలు చేసిన ఆరోపణలకు ఇప్పుడు బలమైన ఆధారాలు లభిస్తున్నాయి. పౌరసరఫరాల మంత్రిగా బాద్యతలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగా అక్రమాలను వెలికి తీస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా కీలక ప్రకటన చేశారు. కాకినాడ నుంచి జరిగిన బియ్యం స్మగ్లింగ్‌లో ఐదుగురు ఐపీఎస్‌ల పాత్ర ఉన్నట్లుగా తనకు సమాచారం వచ్చిందన్నారు. ఒక్క కాకినాడలోనే 43వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంత భారీ స్థాయిలో అక్రమాలు జరిగి ఉంటాయో ఊహించడం కష్టమన్నారు. అధికారులు రాత్రింబవళ్లు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం బియ్యం స్కాం గుట్టు రట్టు చేస్తామని ప్రకటించారు. 

బియ్యం స్మగ్లింగ్ అంతా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కనుసన్నల్లో జరిగిందని అనుమానం                     

బియ్యం స్మగ్లింగ్‌లో ప్రధాన పాత్ర కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిదన్న ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ పోర్టును ఆయన గుప్పిట్లో పెట్టుకున్నారని చెబుతున్నారు. అదే సమయంలో  ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కు ద్వారంపూడి తండ్రే అధ్యక్షుడిగా ఉన్నారు.  ఈ క్రమంలో ఐదేళ్ల పాటు పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేశారని భావిస్తున్నారు. కాకినాడలోనే ఎమ్మెల్యేకు చెందిన వివిధ గోడౌన్లలో సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున బియ్యాన్ని సీజ్ చేశారు. 

స్మగ్లింగ్‌కు సహకరించిన ఐదుగురు ఐపీఎస్ అధికారులు                             

ఈ వ్యవహారంపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంకా ఏమీ మాట్లాడలేదు. గతంలో చేసిన స్మగ్లింగ్‌కు అధికార సహకారం పూర్తి స్తాయిలో ఉందని.. స్మగ్లింగ్ బియ్యాన్ని గ్రీన్ చానల్ ద్వారా తరలించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల సహకారం లేకపోతే ఇంత భారీ స్థాయిలో అక్రమాలు జరగవని ఐదుగురు ఐపీఎస్ అధికారులు ఈ స్కాంలో భాగం అయి.. పూర్తి స్థాయిలో సహకరించి దానికి తగ్గట్లుగా ఫలితం పొందారని చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే అధికార వర్గాల్లో గుసగుసలు ఉన్నాయి. ఇప్పుడు మంత్రి నాదెండ్ మనోహర్ నేరుగా ప్రకటించడంతో ఇక ఆ ఐదుగురు ఐపీఎస్ అధికారులపై కేసులు నమోదు చేయడం ఖాయమన అంచనా వేస్తున్నారు. 

పౌరసరఫరాల శాఖలో మొత్తం స్కాంను వెలికి తీస్తున్న నాదెండ్ల              

పౌరసరఫరాల శాఖలో జరిగిన మొత్తం స్కాములన్నీ కొత్త మంత్రి బయటకు తీయిస్తున్నారు. పేదలకు పంపిణీ  చేసే నిత్యావసర వస్తువుల ప్యాకెట్లలో బరువు తక్కువ ఉండటం కూడా గుర్తించారు. కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కయి ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున  స్వాహా చేశారని నిగ్గు తేలుస్తున్నారు. మంత్రి నాదెండ్ల దూకుడతో పౌరసరఫరాల శాఖలో చక్రం తిప్పిన వారు తంటాలు పడుతున్నారు. తమ స్కాములు ఎక్కడ బయటపడతాయోనని ఆందోళన చెందుతున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిరంజన్ ఇక లేడనే వార్త తీవ్రంగా కలచివేసింది... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
నిరంజన్ ఇక లేడనే వార్త తీవ్రంగా కలచివేసింది... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Embed widget