అన్వేషించండి

Nadendla Manohar : బియ్యం స్మగ్లింగ్‌లో ఐదుగురు ఐపీఎస్‌లు - మంత్రి నాదెండ్ల సంచలన ప్రకటన

Andhra Rice Scam : ఏపీలో బియ్యం స్మగ్లింగ్‌లో ఐదుగురు ఐపీఎస్‌లు ఉన్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఒక్క కాకినాడలోనే 43వేల మెట్రిక్ టన్నులకుపైగా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

Minister Nadendla Manohar :  ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం స్మగ్లింగ్ జరిగిందని గతంలో టీడీపీ, జనసేన పార్టీలు చేసిన ఆరోపణలకు ఇప్పుడు బలమైన ఆధారాలు లభిస్తున్నాయి. పౌరసరఫరాల మంత్రిగా బాద్యతలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగా అక్రమాలను వెలికి తీస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా కీలక ప్రకటన చేశారు. కాకినాడ నుంచి జరిగిన బియ్యం స్మగ్లింగ్‌లో ఐదుగురు ఐపీఎస్‌ల పాత్ర ఉన్నట్లుగా తనకు సమాచారం వచ్చిందన్నారు. ఒక్క కాకినాడలోనే 43వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంత భారీ స్థాయిలో అక్రమాలు జరిగి ఉంటాయో ఊహించడం కష్టమన్నారు. అధికారులు రాత్రింబవళ్లు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం బియ్యం స్కాం గుట్టు రట్టు చేస్తామని ప్రకటించారు. 

బియ్యం స్మగ్లింగ్ అంతా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కనుసన్నల్లో జరిగిందని అనుమానం                     

బియ్యం స్మగ్లింగ్‌లో ప్రధాన పాత్ర కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిదన్న ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ పోర్టును ఆయన గుప్పిట్లో పెట్టుకున్నారని చెబుతున్నారు. అదే సమయంలో  ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కు ద్వారంపూడి తండ్రే అధ్యక్షుడిగా ఉన్నారు.  ఈ క్రమంలో ఐదేళ్ల పాటు పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేశారని భావిస్తున్నారు. కాకినాడలోనే ఎమ్మెల్యేకు చెందిన వివిధ గోడౌన్లలో సోదాలు నిర్వహించి పెద్ద ఎత్తున బియ్యాన్ని సీజ్ చేశారు. 

స్మగ్లింగ్‌కు సహకరించిన ఐదుగురు ఐపీఎస్ అధికారులు                             

ఈ వ్యవహారంపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంకా ఏమీ మాట్లాడలేదు. గతంలో చేసిన స్మగ్లింగ్‌కు అధికార సహకారం పూర్తి స్తాయిలో ఉందని.. స్మగ్లింగ్ బియ్యాన్ని గ్రీన్ చానల్ ద్వారా తరలించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల సహకారం లేకపోతే ఇంత భారీ స్థాయిలో అక్రమాలు జరగవని ఐదుగురు ఐపీఎస్ అధికారులు ఈ స్కాంలో భాగం అయి.. పూర్తి స్థాయిలో సహకరించి దానికి తగ్గట్లుగా ఫలితం పొందారని చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే అధికార వర్గాల్లో గుసగుసలు ఉన్నాయి. ఇప్పుడు మంత్రి నాదెండ్ మనోహర్ నేరుగా ప్రకటించడంతో ఇక ఆ ఐదుగురు ఐపీఎస్ అధికారులపై కేసులు నమోదు చేయడం ఖాయమన అంచనా వేస్తున్నారు. 

పౌరసరఫరాల శాఖలో మొత్తం స్కాంను వెలికి తీస్తున్న నాదెండ్ల              

పౌరసరఫరాల శాఖలో జరిగిన మొత్తం స్కాములన్నీ కొత్త మంత్రి బయటకు తీయిస్తున్నారు. పేదలకు పంపిణీ  చేసే నిత్యావసర వస్తువుల ప్యాకెట్లలో బరువు తక్కువ ఉండటం కూడా గుర్తించారు. కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కయి ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున  స్వాహా చేశారని నిగ్గు తేలుస్తున్నారు. మంత్రి నాదెండ్ల దూకుడతో పౌరసరఫరాల శాఖలో చక్రం తిప్పిన వారు తంటాలు పడుతున్నారు. తమ స్కాములు ఎక్కడ బయటపడతాయోనని ఆందోళన చెందుతున్నారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget