CM Chandrababu: ఈ 23న ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన.. గేమ్ ఛేంజర్గా P4 మోడల్: సీఎం చంద్రబాబు
Andhra Pradesh News | జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధి, పాలనలో మార్పులు కీలక దిశానిర్దేశం చేశారు.

అమరావతిలో జరిగిన 6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, పాలనపై కీలక దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం కేవలం బిలియనీర్లు, ట్రిలియనీర్ల కోసం మాత్రమే కాదని, సామాన్య పేదల సంక్షేమం కోసమే పనిచేస్తోందనే విషయాన్ని అధికారులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. మార్చి 23వ తేదీన రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయబోతున్నట్లు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు.
పాలనలో టెక్నాలజీ చేర్చాలి..
పాలనలో ఆధునిక సాంకేతికతను జోడించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, డేటా డ్రివెన్ గవర్నెన్స్ మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచాలని కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడం, 'మనమిత్ర' వాట్సప్ గవర్నెన్స్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. 2028 మార్చి నాటికి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను పూర్తి చేయడమే లక్ష్యమని, కొప్పర్తి, ఓర్వకల్లు వంటి ప్రాంతాలను పారిశ్రామిక క్లస్టర్లుగా తీర్చిదిద్దాలని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 MSMEలను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ఉపాధిని మెరుగుపరుస్తామని తెలిపారు.
వాటి ధరలు పడిపోతున్నాయని ఆందోళన
అంతర్జాతీయ పరిణామాలపైనా సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల రాష్ట్రంలోని అరటి, గుడ్ల వంటి ఉత్పత్తుల ధరలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు సొంత బ్రాండింగ్ కల్పించి మార్కెటింగ్ చేయాలని సూచించారు. 2047 నాటికి ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం రూ. 55 లక్షలకు చేరుకోవాలనే విజన్తో పనిచేయాలని, ముఖ్యంగా P4 విధానాన్ని గేమ్ ఛేంజర్గా మలిచే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
ట్రెండింగ్ వార్తలు





















