అన్వేషించండి

Amaravati Protests : అమరావతి ఉద్యమంలో అంతిమ విజయం రైతులదే - సంఘిభావం తెలిపిన అన్ని పార్టీల నేతలు !

అమరావతి రైతుల ఉద్యమానికి వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలూ సంఘిభావం ప్రకటించారు.


Amaravati Protests : అమరావతి  రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరుకుంది. సీఎం జగన్ దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లుగా1200 రోజుల కిందట ప్రారంభించారు. అప్పుడు ఉద్యమం ప్రారంభించిన రైతులు అలుపెరగకుండా పోరాడం చేస్తూనే ఉన్నారు. 1200 రోజులైన సందర్భంగా  రైతుల దీక్ష శిబిరానికి పలువురు నేతలు తరలి వచ్చి సంఘిభావం తెలియచేస్తున్నారు. రైతుల ఉద్యమంలో న్యాయముందని.. ధర్మం వారివైపే ఉంటుందని చంద్రబాబు ట్విట్టర్‌లో తెలిపారు. 

అంతిమంగా అమరావతిదే గెలుపు : చంద్రబాబు
 
రాజధాని ప్రాంత రైతుల ఉద్యమంలో న్యాయముందని  టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ధర్మం వారివైపే ఉందని.. అమరావతే గెలుస్తుందని చెప్పారు. రాజధాని రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా ఆయన ట్వీట్‌ చేశారు. రైతుల పోరాట స్ఫూర్తిని చంద్రబాబు అభినందించారు. అమరావతి ఉద్యమం వైకాపా ప్రభుత్వ ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి ముందుకు సాగుతోందన్నారు. అంతిమంగా గెలిచేది.. నిలిచేది అమరావతేనని ఆయన పేర్కొన్నారు.

 దోచుకోవడానికే విశాఖ రాజధాని : కన్నా 
 
ప్రస్తుత అధికార పార్టీ తప్ప అన్ని పార్టీలు అమరావతి కోరుకుంటున్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మినారాయణ వ్యాఖ్యానించారు.  సీఎం జగన్ రాష్ట్ర భవిష్యత్తును కట్ట గట్టి కృష్ణాలో పారేశారని విమర్శించారు. జగన్‌కు మూడు రాజధానులు కట్టాలని లేదని...  విశాఖ వడ్డించిన విస్తరిలా ఉందని...  దోచుకోవడానికే విశాఖ రాజధాని అంటున్నారని మండిపడ్డారు. దోచుకోవడానికే విశాఖ రాజధాని అంటున్నారని ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తించారని దీన్ని..  గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో   నిరూపించారన్నారు. జగన్ సంక్షేమ కార్యక్రమం అంతా బూటకమన్నారు. ఇచ్చేది చాక్లెట్... ఎత్తుకెళ్లేది నక్లెస్ అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ (YCP) కార్యకర్తలు నాలుగేళ్లలో అసంతృప్తితో ఇళ్లకు పరిమితం అయ్యారన్నారు. అయితే పోలీసులు మాత్రం వాళ్ళకంటే ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారని మండిపడ్డారు. జగన్‌‌ను రాష్ట్ర ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజు ముందుందన్నారు. మూడు రాజధానులు అన్న రోజు... చీపురు పుల్ల కూడా జగన్ అమరావతి నుంచి తీసుకెళ్లలేరని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో అమరావతి అభివృద్ధి చెందుతుందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినా తెరుచుకోని జగన్ కళ్లు : పంచుమర్తి అనూరాధ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినా జగన్  కళ్ళు తెరుచుకోడం లేదని  ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ విమర్శించారు.  అమరావతి మహిళలు పాదయాత్రకు వెళితే ఈ ప్రభుత్వం టాయిలెట్‌ను తీసుకెళ్లిపోయి.. ఇబ్బందులకు గురిచేసిందన్నారు. మహిళలను అనేక ఇబ్బందులు పాలు చేయడంతో వారి రూపు కూడా మారిపోయిందన్నారు. అమరావతికి ప్రతి టీడీపీ కార్యకర్త మద్దతుగా ఉంటారని స్పష్టం చేశారు. 

రాజధాని రైతులకు పలువురు సంఘిభావం 

 రాజధాని రైతులకు వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలు సంఘిభావ తెలిపారు.  బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్  , మాజీ మంత్రి అది నారాయణ రెడ్డి  , కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్ర రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ  ,  మందడంలోని రైతుల దీక్షా శిబిరానికి చేరుకుని రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget