News
News
వీడియోలు ఆటలు
X

Andhra BJP : పోలీసుల దౌర్జన్యంపై ఏపీ బీజేపీ నేతల ఫైర్ - కావలి ఘటనలపై ఆగ్రహం !

ఏపీ బీజేపీ నేతలపై కావలి పోలీసుల దాడి వివాదాస్పదమవుతోంది.

FOLLOW US: 
Share:

Andhra BJP :   ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ముఖ్యమంత్రి జగన్ కావలి పర్యటనలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన  బీజేపీ నాయకుల విషయంలో పోలీసుల వ్యవహిరంచిన తీరు  చర్చనీయాంశమవుతోంది.  ఓ బీజేపీ నాయకుడి తలను కాళ్ల మధ్యలో పెట్టుకున్న పోలీసు అధికారి తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది  దీనిపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నరు. 

నెల్లూరు జిల్లాలో కావలిలో బీజేపీ నేతల నిరసన                                    

చుక్కల భూములకు విముక్తి సభలో పాల్గొనేందుకు సీఎం జగన్ కావలి వచ్చారు.  ఈ సభకు వెళ్లే సమయంలో బీజేపీ కార్యకర్తలు ప్రజా సమస్యల విషయంలో నిరసన చేపట్టారు. కాన్వాయ్ ను అడ్డుకుంటారన్న ఉద్దేశంతో పోలీసులు వందల సంఖ్యలో గుమికూడారు. బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు.  ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.  బీజేపీ  పార్టీ కార్యకర్తల పట్ల పోలీసులు తీవ్రంగా వ్యవహరించారు.  అప్రజాస్వామికంగా వ్యవహరించి పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఉండే నమ్మకాన్ని , మీ నుండి ప్రజలు పొందాల్సిన భరోసాను సమాజానికి దూరం చేసేలా వ్యవహిరంచారన్న ఆరోపణలు చేశారు. 

 

 

 తీవ్రంగా ఖండించిన  నేతలు

ప్రజాస్వామ్య విలువలను పోలీసు బూట్లు తొక్కేస్తున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. అన్యాయాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు.   సీఎం జగన్ కావలి పర్యటన నేపథ్యంలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య నిరసనలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు జీవో నెం.1ని కొట్టివేసి క్షణాలు గడవకముందే ఏపీ పోలీసులు అరాచకానికి పాల్పడ్డారని మండిపడ్డారు.  ముఖ్యమంత్రికి ప్రజాసామ్యయుతంగా నిరసన తెలపడం కూడా తప్పేనా? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని పదుల సంఖ్యలో పోలీసులు బీజేపీ నేతలపై దాడి చేస్తారా? కాళ్లతో తొక్కి హేయంగా ప్రవర్తిస్తారా? అని నిలదీశారు. 

 

 

Published at : 12 May 2023 06:44 PM (IST) Tags: AP News AP BJP leaders Police attack on BJP leaders in Kavali

సంబంధిత కథనాలు

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో 50 మందికిపైగా తెలుగువారు మృతి! వివరాలు సేకరించే పనిలో ఏపీ ప్రభుత్వం

Coromandel Train Accident: రైలు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

Coromandel Train Accident: రైలు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

YS Viveka Case : సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి - అరెస్ట్ భయం లేనట్లే !

YS Viveka Case :  సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి - అరెస్ట్ భయం లేనట్లే !

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

TTD News: తిరుమల శ్రీవారికి రష్యా భక్తుడి భారీ విరాళం - రూ.7.6 లక్షల అందజేత!

TTD News: తిరుమల శ్రీవారికి రష్యా భక్తుడి భారీ విరాళం - రూ.7.6 లక్షల అందజేత!

టాప్ స్టోరీస్

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!

Kamal Haasan: 'కేరళ స్టోరీ'ని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అయితే చేయను - కమల్ హాసన్ కొత్త కామెంట్స్

Kamal Haasan: 'కేరళ స్టోరీ'ని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అయితే చేయను - కమల్ హాసన్ కొత్త కామెంట్స్