అన్వేషించండి

Kalava Srinivasulu: అప్పుడు ఢిల్లీలోనే ఉన్నా జగన్ ఎందుకు నోరు విప్పలేదు?: కాలువ శ్రీనివాసులు 

Kalava Srinivasulu: సీఎం జగన్ చేతగానితనంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు.

Kalava Srinivasulu: సీఎం జగన్ చేతగానితనంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తుగ్లక్‌లా వ్యహరిస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని అన్నారు. జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నపుడే కృష్ణ జలాలపై గెజిట్ నోటిఫై వచ్చిందని, వారం రోజులు అవుతున్నా దీనిపై కేంద్రంతో ఒక్క మాట మాట్లాడలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్న చేతులు కట్టుకుని చూర్చున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల విషయంపై కేంద్రానికి ఎలాంటి లేఖ రాయలేదన్నారు. 

ప్రతిపక్షాల మీద నోర్లు వేసుకుని ఎగబడే వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఏమి చేస్తున్నారని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. ఢిల్లీలో ప్రధాని వద్దకు వెళ్లి ఏపీకి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడలేదని మండిపడ్డారు. స్వప్రయోజనాలు తప్ప, ప్రజా ప్రయోజనాలు వైసీపీ ఎంపీలకు పట్టవని విమర్శించారు. కృ‌ష్ణాబోర్డు ఏర్పాటులోను ప్రభుత్వం దారుణంగా ఆలోచిస్తోందన్నారు. కృష్ణ పరివాహకం లేని వైజాగ్‌లో కృష్ణా బోర్డ్ పెడతారా..? అంటూ ప్రశ్నించారు. నార్త్ కోస్ట్ సీఈ కార్యాలయంలో ఒక ఫ్లోర్ కేటాయించామని కృష్ణాబోర్డు చైర్మన్‌కు శశిభూషన్ కుమార్ లేఖ రాశారని, అసలు కృష్ణా బోర్డుకు, వైజాగ్‌కు సంబంధం ఉందా అని ఆయన ప్రశ్నించారు. 

కృష్ణా పరివాహకం ఉన్న విజయవాడ, కర్నూలు ఏర్పాటు చేయకుండా వైజాగ్‌లో ఏర్పాటు చేస్తామనడం జగన్ పిచ్చి చేష్టలకు నిదర్శనమన్నారు. కర్నూలు బోర్డు ఏర్పాటుకు జగన్‌కు మనసు రాలేదా అంటూ ప్రశ్నించారు. కావాలనే జగన్ మోహన్ రెడ్డి రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనతో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. దీనిపై ఉద్యమం చేయబోతున్నట్లు ప్రకటించారు. కృష్ణా జలాల్లో రాయలసీమ హక్కులను పరిరక్షించడంలో జగన్ విఫలమవుతున్నారని, కేసుల కోసం కేంద్రంతో లాలూచి పడుతున్నారని విమర్శించారు. ఫలితంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోతోందని, దీనిపై పోరాటం చేస్తామన్నారు. 

జగన్ లాంటి అసమర్థుడు.. రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర, రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కృష్ణ జలాలు తరలిస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి తన స్వలాభం చూసుకుంటున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల రక్షణ, రాయలసీమ హక్కుల పరిరక్షణలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. రాష్ట్రానికి రావల్సిన నీటిపై 1976 కృష్ణా ట్రిబ్యునల్ పంపకాలు చేసిందని, ఆ హక్కులను కొనసాగిస్తూనే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏపీ వాటను పెంచుతూ ఆమోదం తెలిపిందన్నారు. 

అయితే తాజాగా కృష్ణా జలాల పంపిణీపై పున:సమీక్ష చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రయోజనాలకు అశనిపాతం లాంటదని వ్యాఖ్యానించారు. దీనిపై సోమవారం జగన్ మోహన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారని, కృష్ణా జలాల పంపిణీపై కేంద్రానికి, ప్రధానికి, మంత్రులకు లేఖ రాస్తానని చెప్పిన జగన్ ఇప్పటి వరకు ఆ పని చేయలేదన్నారు. వారం రోజులు గడిచినా కేంద్రానికి రాసిన లేఖపై జగన్‌కు సంతకం పెట్టే సమయం లేదా అంటూ నిలదీశారు. రాయలసీమకు అన్యాయం చేస్తున్న జగన్‌కు ప్రజలు గుణపాఠం చెప్పే సమయం దగ్గరలోనే ఉందన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Fake Currency Printing Racket: డబ్బు సంపాదించడం కన్నా ప్రింట్ చేసుకోవడం ఈజీ అనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఇప్పుడెలా?
డబ్బు సంపాదించడం కన్నా ప్రింట్ చేసుకోవడం ఈజీ అనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఇప్పుడెలా?
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
Sai Krishna Case: సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్
సాయికృష్ణ కేసులో నేను నిర్దోషిని, నన్ను ఇరికించాలని చూస్తున్నారు - సీఐ నాగరాజు లేఖ వైరల్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Business AI: వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
వాట్సాప్ బిజినెస్ కోసం కొత్త నిబంధనలు! మొత్తం ధరల విధానాన్నే మార్చేసిన మెటా!
DMK MLA Anitha Radhakrishnan Arrest: సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
సీఎం విజయ్, త్రిషలపై ‘చీప్’ వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అరెస్ట్!
Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!
Garuda vs Lord Yama: బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
బ్రహ్మ రాత ఎవ్వరూ మార్చలేరు! గరుత్మంతుడు - యముడు - చిలుక కథ
Maa Inti Bangaram Deleted Scenes : మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
మా ఇంటి బంగారం డిలీటెడ్ సీన్స్ చూశారా? - సమంత, ఆమె ఫ్రెండ్ అల్లరి మామూలుగా లేదు
Breaking News: మార్కపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
మార్కాపురంలోని కంభం వద్ద రోడ్డు ప్రమాదం- పెళ్లి ఆటోను ఢీ కొట్టిన లారీ- నలుగురు స్పాట్‌ డెడ్‌!
Mollywood Times OTT : సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
సినిమాల పిచ్చి... సైకోలా మారే హీరో - రెండు ఓటీటీల్లో ప్రేమలు హీరో సైకలాజికల్ డార్క్ కామెడీ
LPG Tanker Explosion: టోల్ గేట్‌ను ఢీకొట్టి పేలిపోయిన భారీ ఎల్పీజీ ట్యాంకర్ - ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే !
టోల్ గేట్‌ను ఢీకొట్టి పేలిపోయిన భారీ ఎల్పీజీ ట్యాంకర్ - ఈ వీడియో చూస్తే వణికిపోవాల్సిందే !
Embed widget