అన్వేషించండి

YS Jagan: బటన్లు నొక్కి చంద్రబాబు మోసాల గురించి ప్రజలకు చెప్పండి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం

YSRCP: ప్రభుత్వ వైఫల్యాలపై క్యూ ఆర్ కోడ్‌తో ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు. బాబు హామీ..మోసం గ్యారంటీ అనే పేరుతో ప్రచారం చేయాలన్నారు.

YS Jagan QR Codes:  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి .. ఏపీ ప్రభుత్వం ఐదు వారాల ప్రచార ఉద్యమం ప్రకటించారు. తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయిన ఆయన  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.  "రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో"   పేరుతో  క్యాంపెయిన్‌ను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి చంద్రబాబు మోసాలను ప్రజలకు తెలియజేయాలని జగన్ సూచించారు. 

TDP నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు తల్లికి వందనం, స్త్రీ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం లాంటివి అమలు చేయడంలో విఫలమైందని ప్రజలకు తెలియచెప్పాలని జనగ్ సూచించారు.  YSRCP క్యూఆర్ కోడ్‌ను ప్రజలకు అందజేస్తుంది, దీనిని స్కాన్ చేస్తే చంద్రబాబు మోసాలకు సంబంధించిన వివరాలు  వస్తాయని జగన్ తెలిపారు.  గత ఏడాది ఎగ్గొట్టిన మొత్తం, ఈ ఏడాది రావలసిన సంక్షేమ నిధుల వివరాలు క్యూ ఆర్ కోడ్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు.  ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు, మోసపూరిత హామీలను ఇంటింటికీ చేర్చడం ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. 

ఈ కార్యక్రమం 4 నుండి 5 వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందని..  YSRCP నాయకులు మరియు కార్యకర్తలు ఈ క్యాంపెయిన్‌ను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా నిర్వహించి, ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి వెళ్లి క్యూ ఆర్ కోడ్ బటన్ నొక్కి చంద్రబాబు మోసాలను ప్రచారం చేయాలన్నారు.  చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత  ఏర్పడిందని జగన్ అన్నారు.  రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు విఫలమైందని, ముఖ్యంగా మహిళల కోసం హామీ ఇచ్చిన స్త్రీ నిధి, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం వంటి హామీలు నెరవేరలేదన్నారు.  

 YSRCP పాలనలో అమలు చేసిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద  బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చదువు మానేసి ఉపాధి కోసం వెతుక్కోవాల్సి వస్తోందన్నారు.   రైతులకు కనీస మద్దతు ధర అందడం లేదని, నష్టంతో ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోందని,   రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జగన్ అన్నారు.  ప్రభుత్వం విపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని, అక్రమ కేసులు పెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తోందని జగన్ ఆరోపించారు.   - సత్తెనపల్లి, పోడిలి, రెంటపల్ల వంటి ఊరిలో తన సందర్శనలపై పోలీసు ఆంక్షలు విధించడం ద్వారా ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన అన్నారు. పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ క్యూఆర్ కోడ్‌ను రాష్ట్రవ్యాప్తంగా పంచి, ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని జగన్ సూచించారు. ఈ క్యాంపెయిన్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, 2029 ఎన్నికల్లో YSRCPని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో  పని చేయాలన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget