అన్వేషించండి

Amaravati Land Pooling: అమరావతిలో మరో 16,666 ఎకరాల భూసమీకరణ - గతమంత నమ్మకం ఉందా? రైతులు ముందుకు వస్తారా?

Amaravati farmers: అమరావతిని మరింత విస్తరిచేందుకు ప్రభుత్వం భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. మరి రైతులు గతంలోలా ముందుకు వస్తారా ?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Amaravati Land Pooling 2nd Phase:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని అభివృద్ధికి రెండో దశ భూసమీకరణ  ల్యాండ్ పూలింగ్ స్కీమ్ - LPS 2.0 నోటిఫికేషన్ జారీ చేసింది.  16,666.57 ఎకరాల  భూములను 7 గ్రామాల్లో సమీకరిస్తారు.  అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు  కేటాయిస్తారు.  క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (CRDA) పరిధిలో ఉన్న వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, హరిశ్చంద్రపురం, వడ్లమాను, పెదపరిమి గ్రామాల్లో ఈ ప్రక్రియ మొదలవుతోంది.  మొదటి దశలో 33 వేల ఎకరాలు సమీకరించారు. అప్పట్లో నెలన్నరలో ప్రక్రియ పూర్తి అయింది. ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో భూములు ఇచ్చారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అన్నది అసలు ప్రశ్నగా మారింది. 

ప్రపంచ స్థాయి రాజధానికి మరిన్ని భూములు 

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నవంబర్ 28న రెండో దశ LPSకు ఆమోదం తెలిపింది. CRDA కమిషనర్‌కు భూములు సమీకరించే అధికారం ఇచ్చారు. మొత్తం 16,666.57 ఎకరాలు సమీకరించి, అమరావతి అభివృద్ధికి ఉపయోగిస్తారు. రాజధాని నిర్మాణాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు భూములు సమకూర్చడం. మొదటి దశలో 33 వేల ఎకరాలు సమీకరించినట్టు, రెండో దశలో మరో 16 వేలు జోడించి మొత్తం 50 వేల ఎకరాలు చేస్తారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సమావేశంలో ఈ 7 గ్రామాల్లో రైతులు 16,666 ఎకరాలు స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారని తెలిపారు.  మొదటి దశలో 90 శాతం రైతులు సహకరించారు, ఇప్పుడు కూడా  అదే స్పందన వస్తుందని నమ్ముతున్నారు. కానీ అంత ఉత్సాహం కనిపించడం లేదని రాజకీయవర్గాలు భావిసతున్నాయి. 

మొదటి దశలో భూములిచ్చిన రైతుల ఆందోళనల ఎఫెక్ట్ 

మొదటి దశలో భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ సమస్యలు ఉన్నాయి.  అన్ని మౌలిక సదుపాయాలతో ప్లాట్లను హ్యాండోవర్ చేయలేదు. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. పదేళ్లు అవుతున్నాయి. మధ్యలో జగన్ సీఎం కావడం  పనులు ఆగిపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు.  అదే సమయంలో ప్రభుత్వం మారిన తర్వాత గ్రామకంఠాలు,  నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీ , E13 ఆలస్యం వంటి వాటిపై ఫిర్యాదులు చేశారు. ఆరు నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ రైతుల సమస్యలు రెండో వడిత పూలింగ్ లో భూములు ఇవ్వాలనుకునేవారిని కాస్త వెనక్కి తగ్గేలా చేస్తున్నాయి. 

ఈ సారి ల్యాండ్  పూలింగ్ అంత ఈజీగా సాగదు !  

రెండో దశలో ల్యాండ్ పూలింగ్ కు భూములిచ్చే రైతులకు గతంలో అమలు చేసిన నిబంధనలే వర్తిస్తాయని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. జరీబు భూమికి నివాస స్థలం 1,000 గజాలు, వాణిజ్య ప్లాటు 450 గజాలు, మెట్ట భూములకు నివాస స్థలం 1,000 గజాలు, వాణిజ్య ప్లాటు 250 గజాలు కేటాయిస్తారు. కౌలు కూడా మొదటి దశలో రైతులకు చెల్లించినట్లుగానే చెల్లిస్తారు.  ఇప్పటికే ఈ ఏడు గ్రామాల్లో సభలు నిర్వహించారు.  భూ సమీకరణకు అనుకూలంగా చేసిన తీర్మానాలు చేశారు. వారంతా ముందుకు వస్తే రెండో దశ ల్యాండ్ పూలింగ్ సజావుగా సాగుతుంది. కానీ రైతులు కొత్త కొత్త డిమాండ్లు , అదనపు హామీలు అడిగే అవకాశం ఉంది.   16,666 ఎకరాల భూసమీకరణ ప్రజెక్టు అమరావతి పునరుద్ధరణకు కీలకం. రైతులు ముందుకు వస్తే విజయం,  ఆటంకాలు ఏర్పడితే.. కొత్త సమస్యలు వస్తాయి. అయితే ప్రభుత్వం మాత్రం రైతులకు తమపై ఏ మాత్రం నమ్మకం తగ్గలేదని గట్టిగా నమ్ముతోంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Advertisement

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Anti Cancer Drug:జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
India vs Sri Lanka Highlights: మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
Embed widget