అన్వేషించండి

Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?

Andhra Pradesh: పోలవరం ప్రాజెక్ట్‌లో దెబ్బతిన్న డయాఫ్రంవాల్‌ ప్రాంతంలో కొత్త నిర్మాణాలు చేపట్టి...పాత కట్టడానికి అనుసంధానించవచ్చని నిపుణుల బృందం తేల్చింది. సామర్థ్యంలో పెద్దగా తేడా ఉండదని తెలిపింది

Polavaram News: పోలవరం(Polavaram) ప్రాజెక్ట్‌లో దెబ్బతిన్న డయాఫ్రంవా(Diaphragm-Wall)ల్‌ స్థానంలో కొత్తది నిర్మించాలా లేక...దెబ్బతిన్న ప్రాంతం వరకు మరమ్మతు చేపడితే సరిపోతుందా అన్న దానిపై అంతర్జాతీయ నిపుణులు బృందం పరిశీలించింది. దెబ్బతిన్న ప్రాంతాల్లో కొత్తది నిర్మించి పాత కట్టడానికి అనుసంధానించినంత మాత్రాన ఇబ్బంది ఏమీ ఉండదని వారు అభిప్రాయపడ్డారు.
 
పోలవరంలో నిపుణుల పరిశీలన
పోలవరం ప్రాజెక్ట్‌లో వరద ఉద్ధృతికి దెబ్బతిన్న ప్రాంతాలను అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. ఎగువు, దిగువ కాఫర్‌డ్యాంలతోపాటు దెబ్బతిన్న డయాఫ్రంవాల్‌(Diaphragm-Wall )ను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. వరద ఉద్ధృతికి అక్కడక్కడ కొట్టుకుపోయిన డయాఫ్రంవాల్‌ను నిపుణుల బృందం పరిశీలించింది. దెబ్బతిన్న ప్రాంతంలో కొత్తది నిర్మించాలా లేక...మొత్తం డయాఫ్రంవాల్‌ కొత్తగా నిర్మించాలా అన్న దానిపై నీటిపారుదలశాఖ అధికారులు చర్చించారు. ఒక డయాఫ్రంవాల్‌కు మరో కొత్తది అనుసంధానించినంత మాత్రాన ఏలాంటి నష్టం ఉండదని...రెండింటికి మధ్య సమన్వయం ఉండదన్న ప్రచారం తప్పని నిపుణుల బృందం తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఉన్న డయాఫ్రంవాల్‌కు మరమ్మతులు చేసుకుంటే సరిపోతుందని ఓ నిపుణుడు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. వరద నీటిలో మునిగిపోయినంత మాత్రాన డయాఫ్రంవాల్‌(Diaphragm-Wall )కు ఏమీకాదని...నిపుణుల బృందం స్పష్టం చేసింది. అలాగే ఈ కట్టడానికి మరో కొత్త కట్టడం జత చేసినా కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తదన్నారు. పాత ప్రాజెక్ట్‌ల వద్ద మళ్లీ డయాఫ్రంవాల్‌ను వెడల్పు చేసి నిర్మించుకున్న ఘటనలో ప్రపంచంలో చాలా ఉన్నాయని వారు వివరించారు. కొత్తది, పాతది రెండూ  ఒకే సామర్థ్యం కలిగి ఉంటాయన్నారు. 
 
గతంలో చేసిన పరీక్షలు పరిశీలన
డయాఫ్రంవాల్‌ పనితీరుపై జాతీయ జల విద్యుత్ పరిశోధన సంస్థ ఇచ్చిన నివేదికన స్థానిక ఇంజినీర్లు అంతర్జాతీయ నిపుణుల బృందానికి చూపారు.
ఎలక్ట్రోడ్ల సాయంతో చేసిన పరిశోధనలు కాకుండా...అక్కడక్కడ తవ్వి మెటీరియల్ బయటకు తీసి పరీక్షించాలని అధికారులకు సూచించారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌(Cofferdam)లోనూ మరికొన్ని పరీక్షలు చేయించాల్సిందిగా నివేదించారు. బంకమట్టి ఉన్న చోట ఇంత భారీ నిర్మాణాలు చేయడం కష్టమనే అభిప్రాయాలను కూడా అంతర్జాతీయ నిపుణుల బృందం కొట్టిపారేసింది. ప్రపంచంలో చాలాచోట్ల ఇలాంటి మట్టి ఉన్న ప్రాంతాల్లోనే ప్రాజెక్ట్‌లు నిర్మించారని తెలిపారు. మంగళ, బుధవారాల్లోనూ మరిన్ని పరీక్షలు చేయనున్న నిపుణుల బృందం...ఆ తర్వాత ప్రాజెక్ట్ స్థితిగతులపై ఉమ్మడిగా నివేదిక అందించనుంది. 
 
పోలవరం(Polavaram) ప్రాజెక్ట్‌ వైసీపీ(YCP) పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురైందని తిరిగి పట్టాలెక్కించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) సంకల్పించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి క్షేత్రపర్యటనే పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శించారు. దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆయన తనకు కన్నీళ్లు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అంతర్జాతీయ నిపుణుల బృందంతో పరీక్షలు చేయించాలని అధికారులను ఆదేశించారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికావడానికి దాదాపు నాలుగున్నరేళ్లు పట్టే అవకాశం ఉందని ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు అంచనా వేస్తుండగా... నిపుణుల బృందం ఇచ్చే నివేదిక ప్రకారం ఆ సమయం పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. భారీ వరదలకు ప్రాజెక్ట్‌లోని కీలక కట్టడాలు దెబ్బతినడంతో తిరిగి నిర్మించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రాజెక్ట్‌ నిర్మాణం అంచనా వ్యయం కూడా అమాంతం పెరిగే అవకాశం ఉంది. గతంలో ఇస్తామని  హామీ ఇచ్చిన డబ్బులు ఇచ్చేందుకే కేంద్రం సవాలక్ష కొర్రీలు వేస్తుండగా...ఇప్పుడు పెరిగిన వ్యయంపై ఏమంటుందో చూడాలి
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh in Delhi: ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
Telangana Assembly:  ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
Andhra Pradesh Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
Revanth Reddy Challenge: చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan South Indian Temples Tour | పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించటం లేదంటే.! | ABP DesamErrum Manzil Palace | నిర్లక్ష్యానికి బలైపోతున్న చారిత్రక కట్టడం | ABP DesamArya Vysya Corporation Chairman Doondi Rakesh Interview | ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేశ్ ఇంటర్వ్యూ | ABP DesamTirupati Deputy Mayor Election MLC Kidnap | తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో హై టెన్షన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh in Delhi: ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
Telangana Assembly:  ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
Andhra Pradesh Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
Revanth Reddy Challenge: చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
Jr NTR: అభిమానులకు ఎన్టీఆర్ రిక్వెస్ట్... త్వరలో నేనే కలుస్తా, నన్ను కలవడానికి పాదయాత్రలు వద్దు!
అభిమానులకు ఎన్టీఆర్ రిక్వెస్ట్... త్వరలో నేనే కలుస్తా, నన్ను కలవడానికి పాదయాత్రలు వద్దు!
Revanth Reddy in Assembly: లోటుపాట్లు లేకుండా సమగ్ర సర్వే - కులగణన నివేదిక ఖచ్చితమైనదన్న రేవంత్ !
లోటుపాట్లు లేకుండా సమగ్ర సర్వే - కులగణన నివేదిక ఖచ్చితమైనదన్న రేవంత్ !
PM Modi Speech In Lok Sabha: సమయాన్ని వృథా చేశారు- కాంగ్రెస్ పాలనపై లోక్‌సభలో మోదీ విసుర్లు
సమయాన్ని వృథా చేశారు- కాంగ్రెస్ పాలనపై లోక్‌సభలో మోదీ విసుర్లు
SSMB29: మహేష్ బాబు కోసం హైదరాబాద్‌లో కాశీని క్రియేట్ చేస్తున్న రాజమౌళి
మహేష్ బాబు కోసం హైదరాబాద్‌లో కాశీని క్రియేట్ చేస్తున్న రాజమౌళి
Embed widget