అన్వేషించండి

AP Security Alert: ఏపీలోనూ అగ్నిపథ్ సెగలు-భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు

ఏపీ పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. అల్లర్లు జరగకుండా ముందస్తుగా భద్రత పెంచింది.

అగ్నిపథ్ ఆందోళనలు-ఏపీలోనూ హై అలర్ట్

సికింద్రాబాద్ అగ్నిపథ్ ఆందోళనల సెగ ఆంధ్రప్రదేశ్‌నూ తాకింది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఎలాంటి అల్లర్లు 
జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. విశాఖ రైల్వే స్టేషన్ సహా గుంటూరులోనూ భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. ఈ రెండు రైల్వే స్టేషన్ల పరిధిలోని రైళ్లను నిలిపివేశారు. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి నిఘా పెంచారు. అన్ని రైల్వే స్టేషన్లలోనూ దాదాపు ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హై అలర్ట్ ప్రకటించి, దాడులు జరుగుతాయని సమాచారం వచ్చిన స్టేషన్ల పరిధిలో అదనపు బలగాలను మోహరించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌తో పాటు బస్‌స్టాండ్‌లోనూ భద్రత పెంచారు. 

ముందస్తు అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు 

ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు. స్టేషన్‌లోని అన్ని గేట్ల వద్ద బందోబస్తు పటిష్ఠం చేశారు. విద్యార్థులు సంయమనం పాటించాలని, కాదని నిరసనలకు దిగితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కేసులు నమోదు చేయాల్సి వస్తుందని, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. అటు గుంటూరులోనూ ఆర్మీ నియామక బోర్డ్ వద్ద నిఘా పెంచారు. ఆర్మీ కార్యాలయానికి వెళ్లే మార్గాలను మూసేశారు. చలో గుంటూరు కార్యక్రమం నిర్వహిస్తారని ముందస్తు సమాచారం రావటం వల్ల వెంటనే అప్రమత్తమయ్యారు పోలీసులు. కొత్తపేట స్టేషన్‌కు ఆందోళనకారులు వస్తారన్న సమాచారం రావటం వల్ల ముందస్తుగానే పలువురు ఆర్మీ అభ్యర్థుల్ని అరెస్ట్ చేశారు. విశాఖకు వచ్చే కొన్ని రైళ్లను దారి మళ్లించారు. స్టేషన్‌కి అరకిలోమీటర్ ముందే బారికేడ్లు ఏర్పాటు చేసి గస్తీ కాస్తున్నారు. కొందరు విద్యార్థి సంఘ నేతల్ని ముందస్తు జాగ్రత్తగా అరెస్ట్ చేశారు. ఇంకొందరిని గృహ నిర్బంధం చేశారు. 

సింహాచలం, మర్రిపాలెం, గుంటూరు లాంటి స్టేషన్లలోనూ భద్రతను పెంచారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా విశాఖ పట్నంలో కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ప్రభుత్వం, రైల్వే శాఖ అలెర్ట్ అయ్యాయి. 
వైజాగ్ సీపీ శ్రీకాంత్, వాల్తేర్ డివిజన్ DRM అనూప్ సత్పతీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నగరాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు చేపడుతున్నారు. 

Also Read: AP POLYCET 2022 Results: ఏపీ పాలిసెట్ 2022 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: Alert In Vizag: సికింద్రాబాద్ ఘటనతో వైజాగ్‌లో హై అలెర్ట్

టాప్ హెడ్ లైన్స్

AE Nookaraju Family Suicide Case: సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
Konaseema Fishermen Rescued: వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
Nara Lokesh: మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
Missing Fishermen Safe: గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం.. 23 రోజుల తరువాత ఆచూకీ లభ్యం
గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం.. 23 రోజుల తరువాత ఆచూకీ లభ్యం

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AE Nookaraju Family Suicide Case: సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
సాధిక్‌ను సౌజన్య ట్రాప్ చేసింది, బురఖా ధరించి అతడి వెంట తిరిగింది: నిందితుడి సోదరి
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
Konaseema Fishermen Rescued: వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
వెస్ట్ బెంగాల్‌లో క్షేమంగా కోనసీమ మత్స్యకారులు.. ఫొటో చూసి ఫ్యామిలీకి ప్రాణాలు లేచొచ్చాయి!
Hybrid Cyber Fraud: వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
వృద్ధులు, అమాయకులే టార్గెట్‌గా కొత్త రకం మోసం.. అసలేంటీ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్
Nara Lokesh: మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
మంగళగిరిలో రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఆధునిక హంగులతో మోడల్ రైతు బజార్ ఏర్పాటు
IND VS SL 2nd Test Day 4 UPdates: సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
సూరియబండార మెరుపులతో లంక ఎదురీత‌.. విజ‌యానికి నాలుగు వికెట్ల దూరంలో భార‌త్.. స్వ‌ల్ప ఆధిక్యంలో ధ‌నంజ‌య‌సేన‌!
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
Mukesh Gowda: 'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
'బిగ్ బాస్ 10' హౌస్‌లోకి 'గుప్పెడంత మనసు' ముఖేష్ గౌడ... రెండుసార్లు రిజెక్ట్ చేసి ఇప్పుడు?
Embed widget