అన్వేషించండి

AP Liquor Scam:2022 నాటి కల్తీ మద్యం మరణాలపై మళ్లీ విచారణ - లిక్కర్ కేసుకు లింక్ - ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

Jangareddy Gudem Deaths: 2022లో జంగారెడ్డి గూడెం కల్తీ మద్యం మరణాలపై విచారణకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ నియమించింది. ఎస్పీ కిషోర్ నేతృత్వంలో విచారణ జరుపుతారు.

Government appoints task force to probe Jangareddy Gudem deaths:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2022లో జంగారెడ్డి గూడెంలో దాదాపుగా ఇరవై మంది అసహజంగా చనిపోయారు. అవి కల్తీ మద్యం మరణాలు అని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. అప్పట్లో జరిగిన అసహజ మరణాల కేసులపై పూర్తి వివరాలు సేకరించి..దర్యాప్తు చేసేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను నియమించారు. ఆ మరణాలన్నీ కల్తీ మద్యం కారణంగా అనే అనుమానాలు ఉన్నందున పూర్తి స్థాయిలో అధ్యనం చేయాలని ఆదేశించారు. టాస్క్ ఫోర్స్ చీఫ్గ్ గా ఏలూరు ఎస్పీ కిషోర్ ను నియమించారు. మృతుల పోస్టు మార్టం రిపోర్టులను పరిశీలించి వీరు ఎలా చనిపోయారో ..అసలు ఈ మరణాల మిస్టరీ ఏమిటో బయటకు తీయనున్నారు.

2022లో  జంగారెడ్డిగూడెంలో   కల్తీ  మద్యం తాగిన  చాలా మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో కొందరు ఆసుపత్రులలో చికిత్స పొందుతూ మరణించారు.  వరదరాజులు అనే వ్యక్తి మరణం కలకలం రేపింది.  ఈ వ్యక్తి కల్తీ సారా వల్ల మరణించాడని  ఆరోపణలు వచ్చాయి. అయితే  పించగా, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం పోస్టు మార్టం చేయించింది.  అతని మరణం బ్రెయిన్ హెమరేజ్ వల్ల సంభవించినట్లు నిర్ధారించారని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. బాధితులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుండి, తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన కార్మికులు , రైతులు. మద్యంలో   విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ కలపడం వల్ల ఈ ఘటనలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. 

కల్తీ మద్యం కారణంగానే ఈ మరణాలు జరిగాయన్న టీడీపీ ఆరోపణల్ని వైసీపీ తోసిపుచ్చింది.  జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తయారీ జరగడం లేదని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసెంబ్లీలో  ప్రకటిచారు.  TDP నేతలు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. విచారణ కోసం డిమాండ్ చేశారు.  కల్తీ నాటు  మద్యం తాగడం వల్ల సంభవించిన మరణాలు ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యం నియంత్రణపై తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రతిపక్షం 27 మరణాలు జరిగినట్లు ఆరోపించగా, ప్రభుత్వం కొన్ని మరణాలను ఇతర కారణాలతో ముడిపెట్టింది. సంఘటన తర్వాత, పోలీసులు 33 కేసులు నమోదు చేసి, 22 మందిని అరెస్టు చేశారు. కానీ ఇప్పుడు లిక్కర్ కేసు విచారణ కీలక దశలో ఉన్నప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ వేయడం ఆసక్తికరంగా మారింది.                         

వైసీపీ హయాంలో తయారు చేసిన అమ్మిన లిక్కర్ అంతా కల్తీనేనని టీడీపీ ఆరోపిస్తోంది. గతంలో ల్యాబ్ టెస్టులు కూడా బయట పెట్టింది. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ దర్యాప్తులో అవన్నీ కల్తీ మద్యం మరణాలేనని పోస్టుమార్టం, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా బయట పెడితే.. ఈ కేసులో నిందితులపై మరింత కఠినమైన సెక్షన్లు నమోదు చేసి అదనపు కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 


 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైకోర్టు తీర్పుల జాప్యంపై సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్, 3 నెలలు దాటొద్దంటూ ఆదేశాలు
హైకోర్టు తీర్పుల జాప్యంపై సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్, 3 నెలలు దాటొద్దంటూ ఆదేశాలు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Saravanan Leader OTT: ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Embed widget