అన్వేషించండి

AP Liquor Scam:2022 నాటి కల్తీ మద్యం మరణాలపై మళ్లీ విచారణ - లిక్కర్ కేసుకు లింక్ - ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

Jangareddy Gudem Deaths: 2022లో జంగారెడ్డి గూడెం కల్తీ మద్యం మరణాలపై విచారణకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ నియమించింది. ఎస్పీ కిషోర్ నేతృత్వంలో విచారణ జరుపుతారు.

Government appoints task force to probe Jangareddy Gudem deaths:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2022లో జంగారెడ్డి గూడెంలో దాదాపుగా ఇరవై మంది అసహజంగా చనిపోయారు. అవి కల్తీ మద్యం మరణాలు అని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. అప్పట్లో జరిగిన అసహజ మరణాల కేసులపై పూర్తి వివరాలు సేకరించి..దర్యాప్తు చేసేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను నియమించారు. ఆ మరణాలన్నీ కల్తీ మద్యం కారణంగా అనే అనుమానాలు ఉన్నందున పూర్తి స్థాయిలో అధ్యనం చేయాలని ఆదేశించారు. టాస్క్ ఫోర్స్ చీఫ్గ్ గా ఏలూరు ఎస్పీ కిషోర్ ను నియమించారు. మృతుల పోస్టు మార్టం రిపోర్టులను పరిశీలించి వీరు ఎలా చనిపోయారో ..అసలు ఈ మరణాల మిస్టరీ ఏమిటో బయటకు తీయనున్నారు.

2022లో  జంగారెడ్డిగూడెంలో   కల్తీ  మద్యం తాగిన  చాలా మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో కొందరు ఆసుపత్రులలో చికిత్స పొందుతూ మరణించారు.  వరదరాజులు అనే వ్యక్తి మరణం కలకలం రేపింది.  ఈ వ్యక్తి కల్తీ సారా వల్ల మరణించాడని  ఆరోపణలు వచ్చాయి. అయితే  పించగా, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం పోస్టు మార్టం చేయించింది.  అతని మరణం బ్రెయిన్ హెమరేజ్ వల్ల సంభవించినట్లు నిర్ధారించారని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. బాధితులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుండి, తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన కార్మికులు , రైతులు. మద్యంలో   విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ కలపడం వల్ల ఈ ఘటనలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. 

కల్తీ మద్యం కారణంగానే ఈ మరణాలు జరిగాయన్న టీడీపీ ఆరోపణల్ని వైసీపీ తోసిపుచ్చింది.  జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తయారీ జరగడం లేదని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసెంబ్లీలో  ప్రకటిచారు.  TDP నేతలు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. విచారణ కోసం డిమాండ్ చేశారు.  కల్తీ నాటు  మద్యం తాగడం వల్ల సంభవించిన మరణాలు ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యం నియంత్రణపై తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రతిపక్షం 27 మరణాలు జరిగినట్లు ఆరోపించగా, ప్రభుత్వం కొన్ని మరణాలను ఇతర కారణాలతో ముడిపెట్టింది. సంఘటన తర్వాత, పోలీసులు 33 కేసులు నమోదు చేసి, 22 మందిని అరెస్టు చేశారు. కానీ ఇప్పుడు లిక్కర్ కేసు విచారణ కీలక దశలో ఉన్నప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ వేయడం ఆసక్తికరంగా మారింది.                         

వైసీపీ హయాంలో తయారు చేసిన అమ్మిన లిక్కర్ అంతా కల్తీనేనని టీడీపీ ఆరోపిస్తోంది. గతంలో ల్యాబ్ టెస్టులు కూడా బయట పెట్టింది. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ దర్యాప్తులో అవన్నీ కల్తీ మద్యం మరణాలేనని పోస్టుమార్టం, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా బయట పెడితే.. ఈ కేసులో నిందితులపై మరింత కఠినమైన సెక్షన్లు నమోదు చేసి అదనపు కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 


 

టాప్ హెడ్ లైన్స్

TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Embed widget