అన్వేషించండి

YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

Devan Reddy : గాజువాక వైఎస్ఆర్‌సీపీ ఇంచార్జ్ దేవాన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూమారుడు.

YSRCP Gajuwaka in charge Devan Reddy resign : ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో వరుసగా రాజీనామాలు చోటు చేసుకుంటున్నాయి . మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే విశాఖ జిల్లా గాజువాక వైసీపీ కోఆర్డినేటర్ దేవన్ రెడ్డి ( Devan Reddy ) కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకేరోజు ఇద్దరు కీలక నేతలు పార్టీని వీడటం, రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది.   గాజువాకలో పవన్ కల్యాణ్ ని ( Pawan Kalyan ) ఓడించి వైసీపీ తరపున బలంగా నిలబడ్డారు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఈసారి ఆయన ఆ స్థానాన్ని కొడుకు దేవన్ రెడ్డికి ఇవ్వాలనుకుంటున్నారు. గాజువాకలో నాగిరెడ్డి తనయుడు దేవన్ రెడ్డి పార్టీ కోఆర్డినేటర్ గా ఉన్నారు. పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నారు.  ఈ సమయంలో సడన్ గా దేవన్ రెడ్డి పార్టీని వీడటం సంచలనంగా మారింది. ఈ రాజీనామాపై దేవన్ రెడ్డి తండ్రి నాగిరెడ్డి ఇంకా స్పందించలేదు కానీ.. ఆయన కూడా పార్టీకి దూరమవుతారనే  ప్రచారం జరుగుతోంది. 

దేవాన్ రెడ్డి రాజీనామా చేసిన వంటనే వైసిపి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా జిల్లా మంత్రి గుడివాడ అమర్నాథ్ ను నియమిస్తూ, పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు నియోజవర్గం ఇన్చార్జిగా ఉన్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు, తిప్పల దేవన్ రెడ్డి, వైసీపీకి రాజీనామా చేయడంతో, ఆస్థానంలో అమర్నాథ్ ను నియమించినట్లుగా పార్టీ ప్రకటించింది. 

సోమవారం రోజే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా రాజీనామా చేశారు.  ఆర్కే మొదటి నుంచి జగన్‌కు నమ్మిన బంటు లాంటి నాయకుడు. రెండుసార్లు మంగళగిరి నుంచి విజయం సాధించారు. రెండోసారి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. అతి తక్కువ మెజార్టీతో విజయం సాధించినా లోకేష్‌ను ఓడించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు సడెన్‌గా పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ సంచలనంగా మారింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ లెటర్‌ను స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు పంపించారు. పార్టీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మరో లెటర్‌ను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపించారు.             

వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఖరారు చేయకపోవడంతో పాటు జిల్లాలో పార్టీ అంతర్గత రాజకీయాల కారణంగా ఎక్కువ మంది వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా భావిస్తున్నారు.ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నేతలుకూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా పలువురు రాజీనామాలు చేసే అవకాశం ఉందని వైసీపీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.ఈ సారి  బీసీలకు అత్యధిక సీట్లు ఇవ్వాలని జగన్  భావిస్తున్నారు. అందుకే రెడ్డి సామాజికవర్గాల వారికి టిక్కెట్లు తగ్గిస్తున్నారని కూడా చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి లేదా మార్చిలోనే వచ్చే అవకాశం ఉండటంతో అన్ని పార్టీలు అభ్యర్థుల కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజీనామాలు చోటు చేసుకుంటున్నాయి. 

అయితే రాజీనామాలు చేసిన వారిని వైసీపీ హైకమాండ్ పట్టించుకోవడం లేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయగానే.. గంజి చిరంజీవిని పార్టీ నేతలు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు పిలిపించారు. ఆయనకు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది.                                        

టాప్ హెడ్ లైన్స్

విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
మీ కారు టైర్‌పై ఉన్న లోడ్ రేటింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Embed widget